కేంద్రమంత్రుల బృందం వేస్తే అదో తుత్తి!

Publish Date:Nov 19, 2013

Advertisement

 

రాష్ట్ర విభజనపై సీమాంధ్రలో పెద్ద ఎత్తున నిరసనలు మొదలయినప్పుడు కాంగ్రెస్ హడావుడిగా అంటోనీ కమిటీ వేసింది. దాని నిర్వాకం అందరికీ తెలిసిందే. ఆ తరువాత ఏర్పాటు చేసిన కేంద్రమంత్రుల బృందం రాష్ట్రంతో కానీ, రాష్ట్ర ప్రజలతో గానీ ఎటువంటి సంబంధం లేకుండా డిల్లీలోనే కూర్చొని విభజన ప్రక్రియ చకచక చేసుకుపోతుంటే, సీమాంధ్ర రాజకీయ పార్టీలు మళ్ళీ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయడంతో అఖిలపక్ష సమావేశం పెట్టింది. అయినప్పటికీ విభజన రాజ్యంగా ప్రకారం జరుగలేదంటూ సుప్రీంకోర్టులో కేసులు దాఖలవుతుండటంతో చివరిగా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులను, ముఖ్యమంత్రిని కూడా నిన్న పిలిచి వారి అభిప్రాయాలు తీసుకొని ‘మమ’ అనిపించేసింది.

 

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరి వరకు విశ్వప్రయత్నాలు చేశామని, అందుకోసం తమ పదవులకు రాజీనామాలు కూడా చేసేసామని చెప్పుకొంటున్న సీమాంధ్ర కేంద్ర మంత్రులు, మళ్ళీ తమ కేంద్రమంత్రుల హోదాలోనే రాష్ట్ర విభజనపై ఏర్పాటయిన కేంద్రమంత్రుల బృందానికి తగిన సూచనలు ఇచ్చివచ్చారు.

 

కానీ, ఇప్పుడు కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమనే చెప్పివచ్చామని మరో మారు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసారు. బహుశః ఏపీఎన్జీజీవోల హెచ్చరికలు, ప్రజల ఆగ్రహానికి గురికాకూడదనే భయమే వారిని ఆవిధంగా పలికించి ఉంటుంది. లేకుంటే వారు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని ఎక్కడ పెట్టాలనే విషయం గురించి ఈ సందర్భంగా మీడియా ముందు ప్రస్తావించేవారే కాదు. ఆ తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా గట్టిగా చాలా వాదించానని, తను కూడా అవసరమయితే వారిలాగే పదవీ త్యాగానికి సిద్దమని చెప్పి వచ్చారు.

 

కేంద్రమంత్రుల బృందం తన నివేదికను సిద్దం చేసి ఈ నెల 21న క్యాబినెట్ కి సమర్పించనుంది. కానీ, ఈ అభిప్రాయ సేకరణ తంతు పూర్తయిన కొద్ది గంటలలోనే రాష్ట్ర విభజనకి ప్రధాన కారకుడు-కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర విభజనను ముందే ఖరారు చేసేస్తూ తెలంగాణా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసారు. దీనిని బట్టి ఈ కేంద్రమంత్రుల బృందం, అబిప్రాయాల సేకరణ తంతు మొత్తం కూడా సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టేందుకేనని అర్ధం అవుతోంది.

 

కేంద్ర మంత్రిత్వ శాఖల ప్రధాన కార్యదర్శులు శాఖల వారిగా తెరవెనుక ఈ విభజన ప్రక్రియ అంతా పూర్తి చేస్తుంటే, ప్రజల తుత్తి కోసమే కేంద్రమంత్రుల బృందం పాపం! చాలా శ్రమ తీసుకొంది. కానీ నేటికీ కొందరు విభజనను వ్యతిరేఖిస్తూ చెప్పివచ్చమని, మరి కొందరు అడ్డుకొంటామని చెప్పడం కూడా సీమాంధ్ర ప్రజల తుత్తి కోసమే!

By
en-us Political News

  
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.