చంద్రబాబుకి చిన్న మెదడు చిట్లిందన్న గట్టు
Publish Date:Oct 25, 2012
Advertisement
జైల్లో జగన్ సెల్ ఫోన్ వాడుతున్నారంటూ టిడిపి నేతలు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. లేని పోని ఆరోపణలు చేస్తూ జనంలో పబ్లిసిటీ పెంచుకునేందుకు యనమల రామకృష్ణుడు లాంటి నేతలు చేస్తున్న ఆరోపణలకు జనం సరైన బుద్ధి చెబుతారని ఆ పార్టీనేత గట్టు రామచంద్రరావు హెచ్చరించారు. గతంలో వై.ఎస్ ని తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు ఆయన బాటలోనే నడుస్తూ పాదయాత్ర చేయడం, వై.ఎస్ ఇచ్చిన వరాల్నే మళ్లీ ప్రజలకు ఆశచూపడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబుకి చిన్న మెదడు చిట్లిపోయింది కనుకే వై.ఎస్ ని కాపీ కొడుతున్నారంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. సినిమా డైరెక్టర్ల డైరెక్షన్ లో సాగుతున్న చంద్రబాబు పాదయాత్రకి ఎంత ప్రజాదరణ ఉందో, షర్మిల చేస్తున్న పాదయాత్రకి ఎంత ప్రజాదరణ ఉందో టిడిపి నేతలు ఇప్పటికైనా తెలుసుకోవాలని వైకాపా నేతలు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గట్టు రామచంద్రరావుకి బుద్ధి చెప్పి తీరాలంటూ తెలుగు దేశం నేతలు మండిపడుతున్నారు. త్వరలోనే ఎవరి సంగతి ఏంటో ప్రజలే తేల్చేస్తారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/gattu-ramachandra-rao-31-18491.html





