గార్డెనింగ్‌తో ఆరోగ్యం!

Publish Date:Jul 4, 2016

Advertisement

 

ఉరుకులు పరుగులు పెట్టే జీవితంలో ఎవ్వరికీ నిమిషం ఖాళీ ఉండటం లేదు. ఇంత వేగంగా సాగే జీవితంలోనూ మొక్కలని పెంచడం అంటే ఇష్టపడేవారు లేకపోలేదు. ఇంటి పెరడులో ఏ కాస్త జాగా ఉన్నా, రోజులో ఏ మాత్రం ఖాళీ ఉన్నా... తోటపనిలో తృప్తిని పొందేవారు కనిపించకపోరు. కానీ తోటపని అనేది కేవలం ఒక వ్యాపకం మాత్రమే కాదనీ, అద్భుతమైన ఆరోగ్యాన్ని సాధించే మార్గం అని అంటున్నారు నిపుణులు. నమ్మనివారి కోసం చాలా కారణాలనే చూపిస్తున్నారు.

 

ప్రశాంతత లభిస్తుంది:  నెదర్లాండ్స్‌ చెందిన కొందరు నిపుణులు ఆ మధ్య ఒక పరిశోధనను చేశారు. అందులో భాగంగా రోజులో ఒక అరగంటపాటు కొందరిని తోటపని చేయమని, మరికొందరిని ఇంట్లోనే ఉండి చదువుకోమనీ చెప్పారు. ఫలితం! తోటపని చేసిన వారి మనసు చాలా ఉల్లాసంగా మారిపోయిందట. పైగా మానసిక ఒత్తిడి కారణంగా ఉత్పత్తి అయ్యే ‘కార్టిసాల్‌’ అనే రసాయనం కూడా వీరిలో తగ్గుముఖం పట్టిందట. ఊబకాయం నుంచి గుండెజబ్బుల వరకూ నానారకాల అనారోగ్య సమస్యలకూ ఈ కార్టిసాల్‌ ఓ కారణం! దీనిని బట్టి తోటపని అమితమైన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తుందని తేలిపోయింది.

 

అధిక వ్యాయామం:  చాలామంది నడక, సైక్లింగ్‌, ఈత వంటి వ్యాయామాలే అత్యద్భుత ఫలితాలు ఇస్తాయని అనుకుంటారు. కానీ తోటపని ఒకటి ఉందన్న విషయం మర్చిపోతారు. తోటపనిలో మట్టిని తవ్విపోయడం, పాదులు కట్టడం, మొక్కలు నాటడం, కలుపుని ఏరివేయడం... ఇలా చాలా పనే చేయవలసి ఉంటుంది. దీని వల్ల శరీరానికి కావల్సినంత వ్యాయామం లభిస్తుంది. పైగా ఈ తోటపని చేసే సమయంలో కళ్ల దగ్గర్నుంచీ వేళ్ల వరకూ ప్రతీ అవయవమూ నేర్పుగా పనిచేయాల్సి ఉంటుంది. అంటే శరీరంలోని ప్రతిభాగానికీ ఇది చురుకుదనాన్ని అందిస్తుందన్నమాట! పైగా శరీరం ఎటు పడితే అటుగా వంగే నేర్పునీ అలవరుస్తుంది.

 

విటమిన్‌ డి:  శరీరానికి ప్రకృతి సిద్ధంగా సూర్యరశ్మి నుంచి లభించే పోషకం- విటమిన్‌ ‘డి’. కానీ నాలుగు గోడల మధ్యనే ఉండిపోతున్న జీవనశైలి వల్ల ఈ డి విటమిన్‌ కూడా ఇప్పుడు మనకి దూరమవుతోంది. దీంతో శరీరానికి అవసరమయ్యే కాల్షియంను శోషించుకునే శక్తిని కోల్పోతున్నాము. చర్మవ్యాధుల దగ్గర్నుంచీ చక్కెర వ్యాధి వరకూ... చాలా సమస్యలని అదుపులో ఉంచేందుకు డి విటమిన్‌ అత్యవసరం. తరచూ తోటపని చేయడం వల్ల ఈ డి విటమిన్ మనకు కావల్సినంతగా లభించే అవకాశం ఉంది.

 

మెదడుకీ మంచిదే!:  తోటపనిలో కేవలం శరీరం మాత్రమే కాదు... మెదడు కూడా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి వృద్ధాప్యంతో పాటు వచ్చే అల్జీమర్స్‌, మతిమరపు వంటి సమస్యలకి తోటపని చాలా ఉపయుక్తమట! తోటపని చేసే అలవాటు లేనివారితో పోలిస్తే, ఆ అలవాటు ఉన్నవారిలో మతిమరపు సమస్య దాదాపు 47 శాతం తక్కువగా ఉన్నట్లు ఓ పరిశోధనలో తేలింది.

 

సంతృప్తి:  తోటపని చేసేవారిలో..... తాము ఒక మొక్కకి జీవం పోసామన్న సంతృప్తి, ఆ మొక్కలు పెరుగుతున్నప్పుడు కలిగే సంతోషం ఏ ఆస్తిపాస్తులకీ తీసిపోవు. ఇక తాము నాటిన చెట్ల నుంచి సహజసిద్ధంగా లభించే కూరగాయలు తిన్నప్పుడు ఎలాంటి అనారోగ్యమూ దరిచేరదు. చెట్లని పెంచడం, వాటి మధ్య ఉండటం... మనిషికి తాను కూడా ప్రకృతిలో ఒక భాగం అన్న భావనను కలిగిస్తుంది. ప్రకృతితో ఉండే ఆ అనుబంధంతో అతని ఆయుష్షు మరింతగా పెరుగుతుంది.

 

- నిర్జర.

By
en-us Political News

  
కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి....
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం..
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి...
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి...
AI..ప్రపంచం అంతా వాడుతున్న కృత్రిమ మేధస్సు ఇది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సు వాడకం చాలా పెరిగింది.  ఏ చిన్న సందేహం వచ్చినా ఏఐ ని వాడటం, దాన్ని సలహాలు, సూచలు అడగడం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ళ నొప్పులు. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం మరియు సరైన పోషకాహారం..
వేసవి మొదలవ్వగానే తీవ్రమైన ఎండ , పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన రోజువారీ  కార్యకలాపాలు , ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలవుతుంది. ఈ రోజుల్లో బయట కొద్దిసేపు ఉన్నా కూడా శరీరం అలసిపోయేంత వేడిగా ఉంటుంది...
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  ముఖ్యంగా వేసవి కాలంలో నీటిశాతం అధికంగా ఉన్న పండ్లను ఎంత తీసుకుంటే అంత మంచిదని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వేసవి కాలంలో పండ్ల జ్యూసులు..
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీ వ్యాధులు...
తిండి కలిగితే కండ కలదోయ్ అని అంటుంటారు. అలాగే కొందరు ఎంత కారంగా ఉన్న ఆహారం తింటే.. శరీరం అంత దృఢంగా ఉంటుందని కూడా అంటుంటారు.  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు బాగా కారంగా...
నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, ఒత్తిడి మరియు ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు (Heart Attack) బారిన పడుతున్నారు. అయితే, గుండెపోటు అకస్మాత్తుగా వచ్చే ప్రమాదమే అయినప్పటికీ, మన శరీరం కొన్ని రోజుల ముందే కొన్ని లక్షణాల ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. ఆ సంకేతాలను సరైన సమయంలో గుర్తిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు.
భారతీయుల ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది.  పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లేకుండా రోజు అస్సలు గడవదు.  ఇక ఇప్పట్లో చాలా మంది పనీర్ కుడా బాగా వినియోగిస్తున్నారు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.