టాలీవుడ్.. రేవంత్ సర్కార్ మధ్య గ్యాప్ తగ్గినట్లేనా?

Publish Date:Jan 1, 2025

Advertisement

సినీ పరిశ్రమ వర్సెస్ రేవంత్ సర్కార్ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయిపోయిందా? అన్న ప్రశ్నకు ఔనన్న సమాధానమే వస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వేసిన అడుగులతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచే బీఆర్ఎస్ తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివాదాన్ని ఎగదోసి రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్న విమర్శలు సినీ పరిశ్రమ నుంచే వస్తున్నాయి. ఇంత కాలం సంధ్యా థియేటర్ తొక్కిసలాట సంఘటన, తదననంతర పరిణామాలు అంటే.. అల్లు అర్జున్ అరెస్టు, కొత్త సినిమాలకు ప్రీమియర్ షోలు, టికెట్ల ధరల పెంపునకు అనుమతి నిరాకరణ వంటి సంఘటనలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు ఇష్టారీతిగా విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కేటీఆర్ అయితే రేవంత్ టార్గెట్ గా ఈ పరిణామాలపై చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమకు ఒకింత ఇబ్బందికరంగా మారాయి. 
పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మరచిపోయారనీ, ప్రముఖులకే రేవంత్ ఎవరో తెలియని పరిస్థితి ఉంటే ఇక సామాన్యులకు ఆయన ఎలా తెలుస్తారనీ కేటీఆర్ చేసి వ్యాఖ్యలు సినీ పరిశ్రమ ప్రముఖులు జీర్ణించుకోలేకపోయారు. అంతే కాకుండా సినీ ప్రముఖులతో భేటీలో రేవంత్ సూటిగానే పరిశ్రమను అడ్డు పెట్టుకుని కేటీఆర్ తనను టార్గెట్ చేస్తూ చేస్తున్న వ్యాఖ్యలకు పరిశ్రమ పెద్దల నుంచి కౌంటర్ ఎందుకు రావడం లేదని నిలదీశారు. ఈ ప్రశ్నకు సినీ ప్రముఖల వద్ద నుంచి సమాధానం లేకుండా పోయింది. 
అయితే ఆ భేటీ తరువాత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు దీటుగా సమాధానం ఇచ్చారు.  సినీ పరిశ్రమను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని కేటీఆర్ కు దిల్ రాజు చాలా స్పష్టంగా చెప్పారు.

చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన  సమావేశం  పూర్తి సుహృద్భావ వాతావ రణంలో జరిగిందని స్పష్టం చేసిన దిల్ రాజు.. అనవసర వివాదాల్లోకి సినీ పరశ్రమను లాడగం మంచిది కాదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పరిశ్రమను అడ్డం పెట్టుకోవద్దని ఒకింత ఘాటుగానే చెప్పారు. దిల్ రాజు ప్రకటన తరువాత సినీ పరిశ్రమలో ఒకింద ధీమా వ్యక్తం అవుతోంది. దిల్ రాజు వినా మిగిలిన సినీ ప్రముఖులెవరూ కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించలేదు. అలాగే దిల్ రాజు ప్రకటనను స్వాగతిస్తున్నట్లుగా మౌనంగా ఉండిపోయారు. దీనిని బట్టే కేటీఆర్ వ్యాఖ్యలకు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లేదన్న విషయం తేటతెల్లమైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అంతే కాకుండా సీఎం రేవంత్ తో భేటీ సందర్భంగా ఆ భేటీకి హాజరైన సినీ ప్రముఖులంతా పోటీలు పడి రేవంత్ పై ప్రశంసలు కురిపించడమే బీఆర్ఎస్, కేటీఆర్ అభిప్రాయాలతో తమకు సంబంధం లేదని చాటినట్లైందని అంటున్నారు.  

ఇక అన్నిటి కంటే ప్రముఖంగా చెప్పుకోవలసినదేమిటంటే.. కేటీఆర్ వ్యాఖ్యలకు దిల్ రాజు కౌంటర్ తో సినీ పరిశ్రమకు, రేవంత్ సర్కార్ కు ఉన్న గ్యాప్ తగ్గిపోయిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎందుకంటే సినీపరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య వారథిగా సమస్యల పరిష్కారినికి ఒక వేదికను ఏర్పాటు చేసే బాధ్యతను ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు తీసుకున్నట్లైంది. ఇటు ప్రభుత్వం తరఫునా, అటు సినీ పరిశ్రమ తరఫునా కూడా తన వాయిస్ ను వినిపించడానికి ఆయన ఎటువంటి భేషజాలూ లేకుండా ముందుకు వచ్చారు.

పరిశ్రమకు కావలసినవి ప్రభుత్వం ముందు ఉంచడంతో పాటు, ప్రభుత్వం పరిశ్రమ విషయంలో ఏ చేయాలని అనుకుంటోందన్నది పరిశ్రమ పెద్దలకు స్పష్టం చేశారు.  దీంతో ముందు ముందు సినీపరిశ్రమ ప్రభుత్వం మధ్య సత్సంబంధాలతో పాటు పరిశ్రమ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే వాతావరణాన్ని దిల్ రాజు కల్పించారన్న అభిప్రాయం పరిశ్రమ వర్గాలలోనే కాకుండా పరిశీలకుల నుంచి కూడా వ్యక్తం అవుతోంది. 

By
en-us Political News

  
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.