పెద్దారెడ్డికి తాడిపత్రిలో నో ఎంట్రీ బోర్డు.. జేసీ మార్క్ పాలిటిక్స్

Publish Date:Jun 15, 2025

Advertisement

 

సొంత ఇంట్లో అడుగుపెట్టలేని విధంగా తయారైంది అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరిస్థితి. జేసీ ప్రభాకరరెడ్డి ఇచ్చిన అల్టిమేటంతో పెద్దారెడ్డి తాడిపత్రిలోని సొంత ఇంట్లో అడుపెట్ట లేకపోతున్నారు. హైకోర్టు ఆయనకు అనుమతి ఇచ్చినా పోలీసుల నిస్సహాయత వ్యక్తం చేస్తుండటంతో ఇక పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టడం ఇప్పట్లో అసాధ్యమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి వేసిన వీరంగంతో వైసీపీ నేతలెవరూ ఆయనకు అండగా నిలవడం లేదంట. తాజాగా పెద్దారెడ్డి వస్తున్నారన్న ప్రచారంతో టీడీపీ శ్రేణులు అడ్డుకోవడానికి రెడీ అవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
తాడిపత్రి నియోజకవర్గం అక్కడ రాజకీయ ఉద్రిక్తతల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.  

అక్కడ రాజకీయాలు ఫ్యాక్షన్ వాతావరణాన్ని తలపిస్తూ ఉంటాయి. 2024 ఎన్నికల సందర్భంగా చెలరేగిన ఘర్షణలే అందుకు ఉదాహరణ. ఆ ఘర్షణలలో  ఎస్పీ, డివైఎస్పీలతో పాటు పోలీసు శాఖలో పలువురు అధికారులు ఉన్నతాధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల ఘర్షణల్లో అరెస్ట్ అయిన పెద్దారెడ్డికి కండీషనల్‌ బెయిల్ ఇచ్చిన కోర్టు తాడిపత్రికి వెళ్లేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. చాలా కాలంగా తాడిపత్రికి వెళ్లేందుకు పోలీసులు పర్మిషన్ నిరాకరిస్తూ ఉండటంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టలేకపోయారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రతిపక్ష నేతలు ఏదో రకంగా పోరాటం చేస్తూ ఉంటే తాడిపత్రిలో మాత్రం కనీసం వెళ్లేందుకు కూడా అనుమతి తెచ్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు కేతిరెడ్డి పెద్దారెడ్డి.

ఇటీవల  పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చింది. ఈ ఉత్తర్వులు పట్టుకొని పెద్దారెడ్డి జిల్లా పోలీస్ అధికారులను కలసి తాడిపత్రికి మీరు చెప్పినప్పుడు వెళ్తానని అనుమతి కోరారు. కానీ  పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెడితే ఊరుకునేది లేదని,  అడుగుపెట్టనివ్వబోమని జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని  వర్గీయులు అల్టిమేటం జారీ చేశారు. అక్కడి వాతావరణం చూసిన పోలీసులు  పెద్దారెడ్డి తాడిపత్రికి వెళితే 2024 ఎన్నికల పరిస్థితులు రిపీట్ అయ్యే అవకాశం ఉందని ఆయన పర్యటనకు బ్రేకులు వేశారు. హైకోర్టు ఆదేశాలు తెచ్చుకున్న తరువాత మొదటిసారి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు సిద్ధమవ్వగా వరుసగా ఎంపీపీ ఎన్నికలు, రాప్తాడులో జంట హత్యలు కారణంగా చూపిస్తూ బందోబస్తు కల్పించలేమంటూ పోలీసులు చేతులెత్తేశారు. 

ఇక మరోసారి తాడిపత్రికి వెళ్లేందుకు జిల్లా పోలీసు అధికారులు అనుమతి కోరగా ఆ సమయంలో మహానాడు జరుగుతుందని అప్పుడు కూడా అనుమతి నిరాకరించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి మోడీ పర్యటన అంటూ మరోసారి అనుమతించలేదు. ఆ క్రమంలో తాజాగా తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది. దాంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సుమారు 300 మందికి  పైగా  జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ సమాచారం అందుకోగానే పోలీసులు పట్టణంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులతో చర్చలు జరిపారు. చివరకు పెద్దారెడ్డి రావడం లేదని పోలీసులకు తెలియడంతో టీడీపీ శ్రేణులను జేసీ ఇంటి వద్ద నుంచి పంపించారు. 

ఈ పరిస్థితిపై పెద్దారెడ్డి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు జేసీ ప్రభాకరరెడ్డి చెప్పినట్లు నడుచుకుంటున్నారని, హైకోర్టు  అనుమతిచ్చినా తనను సొంత సెగ్మెంట్లో అడుగుపెట్టనీయక పోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను తాడిపత్రికి వెళ్లడం అసాధ్యమేనని  నిర్వేదంగా మాట్లాడుతున్నారు. జేసీ ప్రభాకరరెడ్డి అధికారం అండతో ఓవర్ చేస్తున్నారంటూ జేసీ వయస్సు గురించి మాట్లాడుతున్నారు.
ఇదంతా పెద్దారెడ్డి స్వయంకృతాపరాధమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వైసీపీ అధికారంలో ఉన్స సమయంలో పెద్దారెడ్డి స్థానికంగా జేసీ ప్యామిలీపై ఎన్నో ఆంక్షలు పెట్టారు. జేసీ ప్రభాకరరెడ్డి ఆందోళనలకు సిద్దమైతే పోలీసులతో అడ్డుకున్నారు. 

జేసీ ఇంట్లోకి  వెళ్లి సోఫాలో కూర్చుని సినీ స్టైల్లో ప్రగల్భాలు పలికారు. టీడీపీ శ్రేణులను కేసులతో వేధించారు. అసలే జేసీ ప్రభాకరరెడ్డి ఎంత ఫైర్ బ్రాండో వేరేగా చెప్పనవసరం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా గెలిచారు. ఆయన కొడుకు  అస్మిత్ రెడ్డి తర్వాత టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక కూటమి ప్రభుత్వం ఉంది. దాంతో ఇప్పుడాయన పెద్దారెడ్డికి చుక్కలు చూపిస్తున్నారంట. ఇలాంటి సిట్యుయేషన్‌లో పెద్దారెడ్డికి బాసటగా స్థానిక వైసీపీ నాయకులు ఎవరూ ముందుకు  రావడం  లేదంట.

తాడిపత్రి పట్టణానికి వెళ్లడానికి న్యాయస్థానం నుండి అనుమతులు వచ్చి సుమారు మూడు నెలలు  కావొస్తున్నా పెద్దారెడ్డి అక్కడ అడుగు పెట్టలేకపోతున్నారు. పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తిరిగి అధికారంలోకి వచ్చినా రాకపోయినా, ఫ్యాక్షన్ మొదలు పెడతానని జేసీ వర్గీయులకు పదేపదే వార్నింగులు ఇచ్చారు. ఇప్పుడు బేల చూపులు చూస్తూ నిర్వేదంతో మాట్లాడాల్సి వస్తోంది. ఇదంతా చూస్తూ ఖచ్చితంగా ఇది స్వయం కృతాపరాధమే అంటున్నారు.  చూడాలి మరి  పెద్దారెడ్డి విషయంలో పోలీసులు ఎప్పుడు కరుణిస్తారో? ఆయన ఎప్పుడు సొంత ఇంటికి వెళ్తారో?
 

By
en-us Political News

  
చిత్తూరు జిల్లా కుప్పం ఘటన బాధితురాలు శిరీషను ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నరు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఉండగా, మీడియా ముందు ఆధారాలు లేని ఆరోపణలు చేసినందుకు టీపీసీసీ చీఫ్‌కు మాజీ మంత్రి లీగల్ నోటీసులు పంపారు.
ప్రముఖ నటి రమ్యశ్రీపై దాడి జరిగింది. ఆమె సోదరుడు ప్రశాంత్ వీడియో తీస్తున్నారని సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరులు దాడికి పాల్పడ్డారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిమణం నెలకొంది. రేపు సిట్ ముందుకు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు హాజరు కానున్నారు.
బనకచర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఉలిక్కిపడుతోంది. ఇప్పటికే ఈ దిశగా.. ఒక అఖిలపక్షం ఏర్పాటు చేయగా.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఎంపీలను ఆహ్వానించింది.
అంతర్జాతీయ అంతరిక్ష సహకారంలో మరో మహోత్తర ఘట్టం ఆవిష్కరణ సమయం ఆసన్నమైంది.
స్వర్ణాంధ్ర విజన్–2047 పక్కగా అమలు చేసేందుకు కుటమి ప్రభుత్వం చర్యలు చేపటడుతోంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు యాక్షన్ ప్లాన్ అమలుకు ప్రత్యేకంగా నిపుణులను నియమించాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు.. తెలంగాణ శాసనసభ స్థానాలు 119 నుంచి 134కు పెంపునకు మార్గం సుగమమైంది.
చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు తిరుమల శ్రీవారి పేరును పెట్టాలని ప్రతిపాదించినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు మాజీ ఎంపీ డీకే సురేశ్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.
బోయింగ్ డ్రీమ్‌లైనర్ అత్యాధునిక విమానమని అన్ని ఎయిర్‌వేస్ సంస్థలు కొనుగోలు చేశాయి. అయితే ఇప్పుడు ఆ విమానాల్లో ఎక్కడానికి ప్రయాణీకులు భయపడే పరిస్థితులు నొలెకొన్నాయి.
కల్వకుంట్ల కవిత.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తెగా మాత్రమే కాదు.. ఎంపీగా, పార్టీ సాంస్కృతిక విభాగం తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలిగా తనదైన ప్రత్యేక గుర్తింపు పొందిన నేత.
ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులకు కూటమి సర్కార్ అండగా నిలిచింది. ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని మంత్రి సవిత, మురళీ నాయక్ తల్లిదండ్రులకు అందజేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.