Publish Date:Oct 21, 2024
మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు పినిపే శ్రీకాంత్ ను పోలీసులు మధురైలో అరెస్టు చేశారు. దళిత యువకుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న పినిపే శ్రీకాంత్ గత కొంత కాలంగా పరారీలో ఉన్నాడు. ఆయనను పోలీసులు మధురైలో గుర్తించి అరెస్టు చేశారు. దళిత యువకుడి హత్య కేసు వివరాలు ఇలా ఉన్నాయి.
కోనసీమ జిల్లా అయినవిల్లికి చెందిన దళిత యువకుడు జనుపల్లి దుర్గాప్రసాద్ అయినవిల్లి గ్రామంలో వాలంటీర్ గా పని చేసేవాడు. మాజీమంత్రి పినిపే విశ్వరూప్ కు అనుచరుడు. అదే క్రమంలో పినిపే శ్రీకాంత్ కు సన్నిహితుడిగా మారాడు. ఇటీవలి ఎన్నికలలో పి. గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పినిపే శ్రీకాంత్ ప్రయత్నాలు చేశారు.
ఆ క్రమంలో పినిపే శ్రీకాంత్ కు అన్ని విధాలుగా జనుపల్లి దుర్గాప్రసాద్ సహాయ సహకారాలు అందించారు. కాగా ఆ క్రమంలో కోనసీమకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేయడంపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అయ్యింది. అప్పట్లో ఆ ఆందోళన హింసాకాండకు దారి తీసింది. ప్రధానంగా కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు హింసాకాండ చెలరేగింది. ఆ అల్లర్లలో పినిపే విశ్వరూప్ ఇంటిని ఆందోళన కారులు ధ్వంసం చేశారు. ఆ సమయంలో దాదాపు నెల రోజుల పాటు అమలాపురం వ్యాప్తంగా ఆంక్షలు అమలులో ఉన్నాయి. కర్ఫ్యూ కూడా విధించారు.
ఆ సమయంలోనే అంటే 2022 జూన్ 6న జనుపల్లి దుర్గాప్రసాద్ అదృశ్యమయ్యారు. అతడి మృతదేహం అదే నెల 10 ముక్తేశ్వరం రేవు వద్ద అభించింది. అయితే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లతో దర్యాప్తును సాగించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటికి పినిపే విశ్వరూప్ మంత్రిగా కూడా ఉండటంతో ఈ కేసును పోలీసులు నీరుగార్చారన్న విమర్శలూ వెల్లువెత్తాయి.
ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. విచారణలో భాగంగా మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడి ప్రమేయం ఉందని వెల్లడి కావడంతో పోలీసులు పినిపే శ్రీకాంత్ ను ఈ కేసులో ఏ1గా చేర్చారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన ధర్మేష్ అనే యువకుడు విచారణఏలో పినిపే శ్రీకాంత్ ఆదేశాల మేరకు జనుపల్లి దుర్గా ప్రసాద్ హత్య జరిగిందని వెల్లడి కావడంతో శ్రీకాంత్ కోసం గాలింపు చేపట్టారు. పరారీలో ఉన్న శ్రీకాంత్ మధురైలో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/former-minister-pinipe-viswaroop-son-srikanth-arrest-25-187124.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.