బెజవాడకు ముంపు తప్పదా? బుడమేరు ఇప్పటికీ దుఖదాయినేనా?

Publish Date:Aug 3, 2026

Advertisement

తెలుగువన్ స్పెషల్

విజయవాడ నగరాన్ని గతంలో తీవ్ర విషాదంలోకి నెట్టిన బుడమేరు ముంపు ఘటన జరిగి రెండేళ్లు పూర్తవుతోంది. ప్రభుత్వం అప్పట్లో ముంపు బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంది. అండగా నిలిచింది. అంతే కాకుండా.. బుడమేరు ముంపు సమస్యను శాశ్వత పరిష్కారానికి  అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నట్లు పేర్కొంది. అయితే ఇప్పటికీ నాటి బుడమేరు ముంపు ప్రాంతాల ప్రజలలో ఆందోళన ఇప్పటికీ ఇసుమంతైనా ఆందోళన తగ్గలేదు. వర్షాకాలం వచ్చిందంటే.. కృష్ణా నదికి వరద వస్తోందంటూ ఇక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.  ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరితే మళ్లీ ముంపు తప్పదా అన్న భయం మాత్రం స్థానికులను వెంటాడుతూనే ఉంది.  గత వరదల అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిన నివారణ చర్యలు కేవలం తాత్కాలికమేనని, ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

గతంలో వచ్చిన తీవ్ర వరదల వల్ల విజయవాడ నగరంలోని దాదాపు 16 డివిజన్లు నీట మునిగిన సంగతి తెలిసిందే. రాయనపాడు, సింగ్ నగర్, వైఎస్సార్ కాలనీ, రాజరాజేశ్వరిపేట, భవానీపురం వంటి అనేక ప్రాంతాల్లో ప్రజలు దాదాపు పది రోజుల పాటు వరద నీటిలోనే చిక్కుకుపోయారు. ఆ సమయంలో  ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది.  బుడమేరు బెజవాడ పాలిట దుఃఖదాయినిగా మారింది.

ప్రస్తుతం ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో బుడమేరులోకి వరద ప్రవాహం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.దీంతో బుడమేరుర ముంపు భయం వెంటాడుతోంది. ఈ సందర్భంగా.. గతంలో పడిన గండ్లను ప్రభుత్వం  నామమాత్రంగానే పూడ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొండపల్లి శాంతినగర్ వద్ద ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం కూడా పూర్తిస్థాయిలో జరగలేదని  సిపిఐ నేత శంకర్ అంటున్నారు. 

బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే   వెయ్యి కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం  50 కోట్ల రూపాయలే మంజూరు చేయడంతో పనులు అరకొర మాత్రమే జరిగాయంటున్నారు.   బుడమేరు దిగువ భాగంలో   282 ఎకరాలు, నగర పరిధిలో మరో 82 ఎకరాల వరకు ఆక్రమణలకు గురైనట్లు గతంలో నిర్వహించిన సర్వేలోనే తేలింది.

బుడమేరు ప్రవాహ మార్గంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను తొలగించకపోవడం, కాలువ లోతును పెంచకపోవడం వల్ల కొద్దిపాటి వరద వచ్చినా నీరు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఏనికేపాడు అండర్ టన్నెల్ ఛానల్ వద్ద నీటి ప్రవాహ సామర్థ్యం కేవలం 4 వేల క్యూసెక్కులు మాత్రమే ఉండటం వల్ల, ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తే నీరు వెనక్కి తన్ని నగరంపైకి విరుచుకుపడే అవకాశం ఉంది.

నాటి వరదల్లో ఆటోలు, గృహోపకరణాలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన బాధితులు ఇప్పటికీ కోలుకోని పరిస్థితి. ప్రభుత్వం వెంటనే స్పందించి  ఆపరేషన్ బుడమేరు పేరుతో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నారు.కృష్ణా నది తరహాలోనే బుడమేరు పరివాహక ప్రాంతమంతా పటిష్టమైన రిటైనింగ్ వాల్ నిర్మించాలని, ఆక్రమణలను తొలగించి కాలువను వెడల్పు చేయాలని బెజవాడ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.  

 

 Vijayawada Floods, Budameru Flood Threat, Vijayawada News, Andhra Pradesh Rains, Budameru Retaining Wall

By
en-us Political News

  
ఏలూరు జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కిడ్నాప్ కేసుకు సంబంధించి ముస్తఫాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాపార వివాదాల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నూజివీడు పోలీసులు, గుజరాత్ వెళ్లి మరీ అరెస్టు చేశారు.
సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలో నడుస్తున్న ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ చేసిన ఒక వీడియో దాదాపు ఐదు గంటల పాటు అందుబాటులో లేకుండా పోయింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పార్లమెంటరీ కమిటీ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి కారణాలను పది రోజుల్లోగా రాతపూర్వకంగా సమర్పించాలని మెటా యాజమాన్యాన్ని కమిటీ ఆదేశించింది.
ఆయన తీసుకున్న టారిఫ్ ల నిర్ణయానికి వ్యతిరేకంగా అమెరికాలోనే తిరుగుబాటు మొదలైంది. ప్రపంచ వ్యాపార రంగాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న ట్రంప్ టారిఫ్ టెర్రర్ కు వ్యతిరేకంగా అమెరికాలోని పాతిక రాష్ట్రాలలో వ్యతిరేక గళం బలంగా వినిపిస్తోంది.
కిరణ్ కుమార్ రెడ్డి దుబాయ్ లో ఉంటూ.. ఈ కేసులోని ఇతర నిందితులకు కూడా అక్కడ ఆశ్రయం కల్పించినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యావంతుడు కిరణ్ కుమార్ రెడ్డి.. సునాయాసంగా డబ్బు సంపాదించాలన్న పేరాశతో మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కేసి రెడ్డితో చేతులు కలిపాడని సిట్ దర్యాప్తు లో తేలింది. 
యాపిల్ ప్లాట్‌ఫామ్ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించేలా సున్నితమైన కంటెంట్ టెలిగ్రామ్‌లో కనిపించడమే టెలిగ్రామ్ ను యాపిల్ స్టోర్ నుంచి తొలగించడానికి కారణమని తెలిసింది. పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన చైల్డ్ అబ్యూజ్ కంటెంట్ టెలిగ్రామ్ ఛానెళ్లలో వ్యాప్తి చెందినట్లు యాపిల్ బృందం గుర్తించింది.
సెబీ మార్గదర్శకాలతో భారత స్టాక్ మార్కెట్లో అమల్లోకి వచ్చిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ CAS వివరాలు, ఎఫ్&ఓ షేర్ల నూతన ట్రేడింగ్ వేళలు మరియు ముగింపు ధర నిర్ణయించే ప్రక్రియ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.
దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువత, విద్యార్థుల ఆశయాలు, ఆకాంక్షలు, ఆందోళనలు, అవసరాలను నేరుగా తెలుసుకోవడమే లక్ష్యంగా దేశవ్యాప్త పర్యటనకు కాక్రోచ్ జనతా పార్టీ శ్రీకారం చుట్టింది. లిజనింగ్ టూర్ పేర చేపట్టనున్న ఈ పర్యటన ద్వారా ప్రతి రాష్ట్రంలోని యువతతో నేరుగా మమేకమయ్యేందుకు కాక్రోచ్ జనతా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తున్నది.
అమేజాన్ ఆస్ట్రేలియాలో ఆపిల్ వాచ్ సిరీస్ 11 42mm, GPS పై ఏకంగా 37% దాకా భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. AU$252 ఆదా అయ్యే ఈ రికార్డు ఆఫర్ డీల్ వివరాలు, బ్యాటరీ లైఫ్ మరియు బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ సహా కొత్త హెల్త్ ఫీచర్ల సమగ్ర సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
GMKtec NEO X1 వర్క్‌స్టేషన్ పిసి అత్యంత వేగవంతమైన AMD Ryzen 9000HX సిరీస్ ల్యాప్‌టాప్ CPU మరియు NVIDIA RTX 5070 డెస్క్‌టాప్ GPU కాంబినేషన్‌తో లాంచ్ అయింది. 14.6L చిన్న పరిమాణంలో లిక్విడ్ కూలింగ్‌తో వచ్చిన ఈ పవర్‌ఫుల్ పిసి పూర్తి వివరాలు తెలుసుకోండి.
హెచ్‌బీవో మాక్స్ ఫేమస్ సిరీస్ స్టూవర్ట్ ఫెయిల్స్ టు సేవ్ ది యూనివర్స్ ఎపిసోడ్ 3 రిలీజ్ డేట్, ఇండియా స్ట్రీమింగ్ టైమింగ్స్ మరియు మొత్తం 10 ఎపిసోడ్‌ల కంప్లీట్ షెడ్యూల్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
రూ. 1.14 కోట్ల ఇన్కమ్ టాక్స్ చెల్లించిన వ్యక్తికి రూ. 10 రీఫండ్ వచ్చింది. సీఏ సుమిత్ శర్మ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఐటీ నిబంధనలు మరియు సెక్షన్ 143 1 అసలు నిజాలను వెల్లడించాయి.
ప్రసిద్ధ కన్జ్యూమర్‌వేర్ బ్రాండ్ సెల్లో వరల్డ్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకునేందుకు ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బైన్ క్యాపిటల్ చర్చలు జరుపుతోంది. రూ. 3,000 కోట్లకు పైగా విలువైన ఈ డీల్ మరియు భారత మార్కెట్ సమీకరణాల వివరాలు ఇక్కడ చూడండి.
భారతీయ స్టాక్ మార్కెట్ క్లోజింగ్ వేళలు మారాయి! NSE మరియు BSE కొత్తగా ప్రవేశపెట్టిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ CAS టైమింగ్స్, F&O ట్రేడింగ్ మార్పులు మరియు ఇన్వెస్టర్లపై దీని ప్రభావం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.