ఏపీ అసెంబ్లీ టైగర్...విపక్షాల పాలిట సింహస్వప్నం

Publish Date:Mar 11, 2026

Advertisement

 

ఒక రాజకీయ నాయకుడిలో విషయ పరిజ్ఞానం, సమయస్ఫూర్తి....మేధస్సు , వీటన్నింటి తోపాటు ఆర్థిక వ్యవహారాలపై అవగాహన తోడయితే … ఆ నాయకుడు పరిపూర్ణ రాజకీయవేత్తగా అవతరిస్తారు…ఆయనపై విమర్శలు చేయాలన్నా ప్రత్యర్థులకు గుండెళ్లో రైలు పరుగెత్తడమే....అది నిజంగా చాలా అరుదైన కాంబినేషన్‌. ఇటు ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంత మాస్‌గా ఉంటారో… అటు శాసన సభా,ఆర్థిక వ్యవహారాల్లో అంత క్లాస్‌గా ఉంటారు. తన వాగ్ధాటితో విపక్షాలను గడ గడ లాడించడం వల్ల ఆయన సహచర ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచే కాదు… రాజకీయ వర్గాలన్నింటి నుంచీ ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయన ఎవరో మీకు ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది... ఆయనే అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.

ఆయన గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రాదని ఓ ప్రచారం ఉండేది. కాని దానికి భిన్నంగా 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాదించిన నేపథ్యంలో పయ్యావుల కూడా ఉరవకొండ నుంచి గెలుపొందారు. దీంతో పార్టీ లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న కేశవ్ కు మంత్రివర్గంలో కీలక శాఖలు కేటాయించారు చంద్రబాబు.. పార్టీ అధినేత తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ ఇంటా బయటా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పయ్యావులపై ప్రశంసల వర్షం కురిపించారు. పార్టీ అధినేత చంద్రబాబు కూడా ప్రశంసించారు.ఈ నేపథ్యంలో… వాటీజ్ పయ్యావుల? ఆయన పనితనం ఎలా ఉంటుంది? అన్న చర్చ మొదలైంది.

బడ్జెట్‌ను ఎవరికైనా చదవడం మామూలే…కానీ ఆ బడ్జెట్‌ను స్పష్టంగా, గణాంకాలతో, విశ్లేషణతో వివరించగలిగితేనే అసలు ఆర్థిక నిపుణుడని చెప్పాలి. అలా మాట్లాడే నాయకులు అరుదుగానే ఉంటారు. పయ్యావుల కేశవ్ కూడా అలాంటి నాయకుల్లో ఒకరు. ఆర్థిక మంత్రిగా ఆయనకు తొలి అనుభవం మాత్రమే కావచ్చు. కానీ ఆయన చూపిస్తున్న పట్టుదల, డేటాపై ఉన్న అవగాహన… రాజకీయ వర్గాలను ఆకట్టుకుంటోంది. ఇటీవల అసెంబ్లీలో పయ్యావుల బడ్జెట్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా నిలిచాయి. పయ్యావుల మాట్లాడుతున్నప్పుడు అది ఒక క్లాస్ విన్నట్టుగా ఉంటుందని… ఆయనకు ఉన్న విషయ పరిజ్ఞానం, డేటాపై పట్టు అద్భుతమని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. 

ఇంతటితో ఆగకుండా… పయ్యావుల తన నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒక కరపత్రం చూపిస్తూ… అక్కడ జరుగుతున్న పనులను కూడా వివరించారు.పయ్యావుల విషయంలో మాత్రం ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. పయ్యావుల కేశవ్ కేవలం పదవి ఉన్నందుకే ఈ పనితనం చూపిస్తున్న నాయకుడు కాదు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలోనే ఆయన పీఏసీ చైర్మన్ గా తన మేధస్సు, విశ్లేషణతో ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లోని లోపాలను బయటపెట్టారు. అప్పుడు ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన అంశాల్లో ముఖ్యమైనది సీఎఫ్‌ఎంఎస్ స్కామ్. దాదాపు 41 వేల కోట్ల రూపాయల లావాదేవీలకు సరైన రికార్డులు లేవని ఆయన ఆధారాలతో వెల్లడించారు. కోడ్‌లను మార్చి నిధులను పక్కదారి మళ్లించారని… తన ఆడిట్ నివేదికల ఆధారంగా వివరించారు.ఈ అంశంపై ఆయన చేసిన పోరాటం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. 

బడ్జెట్‌లో చూపించకుండా, ట్రెజరీ నిబంధనలకు విరుద్ధంగా ఖర్చులు జరిగాయని పయ్యావుల ఆరోపించడంతో… కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో పాటు కాగ్ కూడా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అప్పటి వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. పయ్యావుల రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే… ఆయన టీడీపీలో విశ్వసనీయమైన, మేధావి వర్గానికి చెందిన నాయకుడిగా గుర్తింపు పొందారు. అదే సమయంలో ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు.1994, 2004, 2009, 2019, 2024 ఎన్నికల్లో… అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం నుంచి వరుసగా గెలిచారు. మధ్యలో ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. 

చంద్రబాబు ఒక పని అప్పగిస్తే… అది పూర్తయ్యే వరకు పయ్యావుల నిద్రపోరని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. అంత నిజాయితీగా బాధ్యతను నిర్వహించే నాయకుడిగా ఆయన పేరుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన  ప్రభుత్వ ఆర్థిక లావాదేవీల్లోని లోపాలను ఆధారాలతో బయటపెట్టి పెద్ద చర్చకు దారితీశారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత… ముఖ్యమంత్రి చంద్రబాబు పయ్యావుల కేశవ్‌కు అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను అప్పగించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లోతైన అధ్యయనం చేసి… అప్పుల వివరాలను ప్రజల ముందుంచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా… సూపర్ సిక్స్ వంటి సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తూ… అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యం సాధించేలా బడ్జెట్ రూపకల్పన చేశారు. పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో మాట్లాడుతుంటే అది ఒక క్లాస్ విన్నట్టుగా ఉంటుందని… ఆయన డేటాపై పట్టు అద్భుతమని పవన్ పేర్కొన్నారు. ఇలా నమ్మకం, పనితనం రెండింటికీ ప్రతీకగా నిలుస్తున్నారు పయ్యావుల కేశవ్. 2026 ఫిబ్రవరి 14న ఆయన ప్రవేశపెట్టిన ₹3.32 లక్షల కోట్ల బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యం సాధించిందని విశ్లేషకులుఅభిప్రాయపడుతున్నారు. 

ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రిగా… ఆయన పనితీరుకు అన్ని వర్గాల నుంచీ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.ఐదు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీగా అనుభవం ఉన్న పయ్యావుల… ఇటీవల ముగిసిన శాసన మండలి సమావేశాల్లో సంఖ్యా బలంలో అధికంగా ఉన్న వైసిపీ పక్షానికి చెమటలు పట్టించారు. బడ్జెట్ పై విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఏవో పేపర్లు చూపిస్తూ కాగ్ నివేదకలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని మాట్లాడారు. దానికి పయ్యావుల ఆ పేపర్లు పంపితే చూసి సమాధానం చెబుతానని పట్టు పట్టారు. 

చివరకు ఆ పేపర్లు కాగ్ నివేదిక కాదని జగన్ పత్రికలో వచ్చిన కథనాలని తేల్చి వైసీపీ డొల్ల తనాన్ని ఎండగట్టారు. అలాగే కల్తీ నెయ్యి విషయంలోని విపక్ష ఆరోపణలను బలంగా తిప్పి కొట్టారు. ఏవిషయంపైనైనా సరే పూర్తి సమాచారంతోనే మీడియా ముందుకు రావడం ఆయన ప్రత్యేకత..ఇప్పుడు మంత్రిగా కూడా అదే ధోరణిలో ముందుకు సాగుతున్నారు. ఇటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూనే… అటు తన నియోజకవర్గ అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు.చాలా కాలం తర్వాత… ఒక మంచి ఆర్థిక అవగాహన ఉన్న నాయకుడు ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారని సామాన్య ప్రజలు కూడా భావిస్తున్నారు.


 

By
en-us Political News

  
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయతకు నిలువెత్తు రూపం అంటూ గతంలో పదేపదే చెప్పుకున్న జగన్ ఇప్పుడు.. నిత్యం అసత్యాలను వల్లెవేస్తూ.. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారంటున్నారు.
గ‌త ఎన్నిక‌ల్లో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌వితను అరెస్టు చేయ‌కుంటే ఈ రెండు పార్టీల మ‌ధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్న‌ట్టేనని జ‌నం అనుకుంటారని అన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి. ఈ కామెంట్ ఎంత‌గా ప‌ని చేసిందంటే రేసులో సెకండ్ ప్లేస్ లో ఉన్న‌.. బీజేపీని థ‌ర్డ్ ప్లేస్ లో ప‌డేసింది. చావుతప్పి క‌న్ను లొట్ట‌బోయిన‌ట్టు.. బొటాబొటిగా 8 మంది ఎమ్మెల్యేల‌తో స‌రిపెట్టుకుంది బీజేపీ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.