తెలుగుజాతికి పెద్ద పండుగ మహానాడు!

Publish Date:May 27, 2023

Advertisement

తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడుకు రాజమహేంద్రవరం వేదిక అయింది. ఈ మహానాడుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి అన్నగారు అభిమానులు భారీగా పోటెత్తారు. మరోవైపు రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలు పసుపు   శోభను సంతరించుని బంతిపూల వనంలా మారాయి. ఇక ఇటు మీడియాలో... అటు సోషల్ మీడియాలో రాజమహేంద్రవరంలో మహానాడు.. రాజమహేంద్రవరంలో మహానాడు అంటూ.... తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణతోపాటు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

 తెలుగుదేశం పార్టీ ప్రతీ ఏటా జరుపుకొంటున్న మహానాడు.. పార్టీ శ్రేణులకు ఓ పర్వదినం. అదే విధంగా తెలుగు తమ్ముళ్లకు అత్యంత ఆత్మీయమైన రోజు. అంతే కాదు.. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా జరుపుకుంటున్న ఈ మహానాడు తెలుగుజాతీ యావత్తుకు పెద్ పండుగ.  అసలు అలాంటి రోజుకు.. మహానాడు అనే పేరు అసలు ఎలా వచ్చింది. అలాగే ఈ మహానాడును తెలుగుదేశం పార్టీ మే నెల చివరి రోజుల్లోనే ఎందుకు జరుపుకొంటుంది. అయినా మహానాడు అంటే అర్థం ఏమిటి?.. ఇంతకీ మహానాడు అనే పేరు ఎవరు,ఎందుకు పెట్టారనే అంశాలను తెలుసుకునేందుకు రాజమహేంద్రవరంలో మహానాడు జరుగుతోన్న వేళ ప్రజలు గుగూల్‌ను ఆశ్రయిస్తున్నారు.  

వెండితెర కథనాయకుడిగా ఓ వెలుగు వెలుగుతోన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు.. 1982, మార్చి 29వ తేదీ హైదరాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ తర్వాత తొమ్మిది నెలలకే జరిగిన ఎన్నికల్లో  తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించింది. దీంతో అప్పటి వరకు రాష్ట్రంలో అప్రపతీహతంగా సాగుతోన్న కాంగ్రెస్  పాలనకు అన్న ఎన్టీఆర్ చెక్ పెట్టినట్లు అయింది. 

మరోవైపు టీడీపీ ఆవిర్భవించిన తర్వాత.. పార్టీ జెండా, గుర్తు, పథకాల రూపకల్పన తదితర అంశాలపై వాడివేడిగా చర్చోపచర్చలు జరుగుతోన్న వేళ.. పార్టీలోని ఇతర నాయకుల అభిప్రాయాలను సైతం ఎన్టీఆర్ స్వీకరించారు. ఆ క్రమంలో 1982, ఏప్రిల్ 11వ తేదీన పార్టీ విధి విధానాలు, ఆశయాలను ప్రజల్లోకి బలంగాతీసుకు వెళ్లేందుకు హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌ వేదికగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ సంకల్పించారు. అందులోభాగంగా ఈ సభకు ఏ పేరు పెడితే బాగుంటుందంటూ చర్చ జరుగుతోండగా.. మహానాడు పేరు పెడదామని ఎన్టీఆర్ సూచించడంతో.. ఆయన సూచనకు అందరు హ్యాట్సాఫ్ చెప్పారు. కానీ 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ గెలిచి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మే 28న  గుంటూరులో నిర్వహించిన సభ నే  తొలి మహానాడుగా పేర్కొనడం విశేషం. 


అయితే టీడీపీ అగ్రశేణి నాయకుల నుంచి సాధారణ కార్యకర్త వరకు అందరూ కూడా మహానాడుకి అధిక ప్రాధాన్యత ఇస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సభ ప్రాంగణం వేదికగా అంతా కలసి తీర్మానాలు ఆమోదించుకోవడం... పార్టీ ప్రారంభమైన నాటి నుంచి ఓ ఆచారంగా వస్తుందన్న విషయం విధితమే. అలాగే ఇదే వేదికగా పార్టీ అధ్యక్షులను సైతం ఎన్నుకొవడం మరో విశేషం. అలాగే పార్టీ చేపట్టే భవిష్యత్తు కార్యాచరణను సైతం ఇదే మహానాడు వేదికగా ప్రకటిస్తూ పార్టీ అధినేతలు వస్తున్నారు.  

మరోవైపు తెలుగుదేశం పార్టీ ప్రతీ ఏటా మహానాడును మే 27 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. అంటే మే 28వ తేదీ ఎన్టీఆర్ జన్మదినం. ఈ నేపథ్యంలో ఆయన పుట్టిన రోజుకు ఒక రోజు ముందు.. అలాగే ఆయన జన్మదినం మరునాడు నిర్వహిస్తు వస్తున్నది.. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి, అలాగే 2020, 2021 కరోనా నేపథ్యంలో మహానాడు ప్రజల మధ్య జరుపుకోలేదు. ఈ మహానాడును ఆన్‌లైన్‌లో జరుపుకోవడం విశేషం. మరోవైపు కరోనా నేపథ్యంలో మహానాడును మూడు రోజుల నుంచి రెండు రోజులకు కుదించారు. 

ఇక 2022, మే 27న ప్రకాశం జిల్లా ఒంగోలు వేదికగా నిర్వహించిన మహానాడు సూపర్ డూపర్ హిట్ అయింది. టీడీపీ ఆవిర్భవించి 40 ఏళ్లు కావడంతోపాటు ఎన్టీఆర్ 99వ జయంతి   కూడా ఇదే మహానాడు వేదికగా జరగడం మహావిశేషం.  


తెలుగుదేశం పార్టీ స్థాపించిన 41 ఏళ్లు అయినా.. కొన్ని సార్లు మహానాడు జరుపుకోలేదన్న సంగతి తెలిసిందే. ఇక మహా అంటే మొత్తం సమీకరణ, గంభీరం అని అర్థాలు సూచిస్తుంది. దీంతో మహానాడు అంటే.. అందరికీ కలుపుకొని పోయే రోజుగా భావిస్తున్నారు. అదీకాక పార్టీ స్థాపించిన తొలినాళ్లలో మహనాడు ఒక రోజే నిర్వహించే వారు. కానీ ఈ సభకు పార్టీ శ్రేణులు భారీగా తరలి రావడం.. వారిందరిని మాట్లాడించడం కోసం.. సమయం చాలకపోవడంతో.. ఆ తర్వాత ఒక రోజును..  రెండు రోజులకు. అలాగే రెండు రోజులను మూడు రోజులకు  పొడిగించారు. కానీ కరోనా నేపథ్యంలో మహానాడు రెండు రోజులకే పరిమితం చేస్తున్నట్లు ఒంగోలులో జరిగిన మహానాడు వేదికగా పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన విషయం విదితమే. ఏదీ ఏమైనా అన్న నందమూరి తారక రామారావు చేతుల మీదగా.. ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ అన్న గారి చిరు నవ్వులా... నిత్యం వెలుగుతూ.. సమాజమే నా దేవాలయం.. ప్రజలే నా దేవుళ్లు అన్నట్లుగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సేవలో.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై గళమెత్తి అన్నగారి నిత్య సత్యాస్పూర్తితో ముందుకు కదం తొక్కుతోంది.

By
en-us Political News

  
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.