బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్.. తిరుపతి ఘటనపై అసత్య ప్రచారాలకు ఎండ్ కార్డ్

Publish Date:Jan 13, 2025

Advertisement

తిరుమ‌ల‌లో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారిని ద‌ర్శించుకునేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు తిరుమ‌ల‌కు వ‌స్తుంటారు. ప్ర‌తీ రోజూ దాదాపు అర‌వై వేల‌కుపైగా భ‌క్తులు స్వామివారిని ద‌ర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. తిరుమల నిత్యం  స్వామినామ‌స్మ‌ర‌ణంతో మారుమోగిపోతుంది. అలాంటి తిరుమ‌ల‌లో గ‌డిచిన ఐదేళ్ల వైసీపీ హ‌యాంలో ఎన్నో అప‌చారాలు జ‌రిగాయి. ల‌డ్డూ త‌యారీలో వాడే నెయ్యి విష‌యం ద‌గ్గ‌ర నుంచి.. తిరుమ‌ల‌లో టికెట్ల పంపిణీ.. ఉద్యోగుల నియామ‌కం ఇలా అన్నిఅంశాల్లోనూ వైసీపీ హ‌యాంలో అనేక త‌ప్పులు జ‌రిగాయి. మొత్తంగా తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను దెబ్బ‌తీసే స్థాయికి గ‌త పాల‌కుల నిర్ణ‌యాలు వెళ్లారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సూచ‌న‌ల‌తో అధికారులు తిరుమ‌ల ప్ర‌క్షాళ‌న‌కు న‌డుం బిగించారు. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన త‌ప్పుల‌ను ఒక్కొక్క‌టిగా స‌రిచేసుకుంటూ వ‌స్తున్నారు. దీంతో తిరుమ‌ల‌ను ద‌ర్శించుకునే భ‌క్తుల తాకిడి క్ర‌మంగా మరింత పెరుగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా టోకెన్ల జారీ స‌మ‌యంలో తొక్కిస‌లాట చోటు చేసుకుంది. ఈ విషాద ఘ‌ట‌న‌లో ఆరుగురు మ‌ర‌ణించ‌గా.. ప‌దుల సంఖ్య‌లో భ‌క్తులు గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేసేందుకు జ‌గ‌న్, వైసీపీ నేత‌లు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు.

తిరుప‌తిలో టోకెన్ల పంపిణీ స‌మ‌యంలో ఆరుగురు మృతిచెంద‌డం చ‌రిత్ర‌లోనే తొలిసారి. ఒక‌రిద్ద‌రు అధికారుల కార‌ణంగా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అయితే, ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే టీడీపీ పాల‌క మండ‌లి అప్ర‌మ‌త్త‌మైంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం వెంట‌నే స్పందించారు. ఘ‌ట‌న జ‌రిగిన కొన్నిగంట‌ల‌కే వారు తిరుప‌తికి వ‌చ్చి క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఘ‌ట‌న జ‌రిగిన ప్ర‌దేశాన్ని ప‌రిశీలించి.. ప్ర‌మాదం జ‌రిగిన తీరుపై అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలో అధికారుల‌పై చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రాథ‌మిక విచార‌ణ‌లో ఈ ఘ‌ట‌న‌కు బాధ్యులైన డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరనాథ్ రెడ్డిలను సస్పెండ్ చేయ‌డంతోపాటు.. ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, సీఎస్‌వో శ్రీధర్‌లను బ‌దిలీ చేశారు. గాయ‌ప‌డి ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్న వారివ‌ద్ద‌కు వెళ్లిన చంద్ర‌బాబు.. వారిని ప‌రామ‌ర్శించి ఘ‌ట‌న జ‌రిగిన తీరును తెలుసుకున్నారు. అంతేకాక మ‌రుస‌టిరోజే వారికి ప్ర‌త్యేక వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నం ఏర్పాటు చేయించారు.

అయితే, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేయాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. క్ష‌త‌గాత్రుల ప‌రామ‌ర్శ పేరుతో ఆస్ప‌త్రికివ‌చ్చిన జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు ఇష్ట‌మొచ్చిన‌ట్లు ప్ర‌వ‌ర్తించారు. ఒక‌రిద్ద‌రే రావాల‌ని వైద్యులు వారించినా విన‌కుండా జ‌గ‌న్ స‌హా మ‌రో ప‌దిమంది వైసీపీ నేత‌లు లోప‌లికి వెళ్లారు. దీనికితోడు జ‌గ‌న్ వ‌చ్చే ముందే ప‌లువురికి ఓ వైసీపీ నేత‌ తెల్లక‌వ‌ర్లు పంచిపెట్ట‌డం సీసీ కెమెరాల్లో రికార్డు కావ‌టంతో వైసీపీ కుట్ర‌కోణం బ‌య‌ట‌కొచ్చింది. క‌వ‌ర్లో డ‌బ్బులిచ్చి చంద్ర‌బాబు వ‌ల్ల‌నే ఆ ఘ‌ట‌న జ‌రిగింద‌ని చెప్పించే ప్ర‌య‌త్నం చేసింది వైసీపీ బ్యాచ్‌. చంద్ర‌బాబు స‌కాలంలో స్పందించ‌డంతో ఘ‌ట‌న‌ను రాజ‌కీయంగా వాడుకోవాల‌న్న వైసీపీ ప్లాన్ బెడిసికొట్టింది. 

అబ‌ద్ధాల‌ను ప‌దేప‌దే ప్ర‌చారం చేసి అవి నిజ‌మ‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించేలా చేయ‌డంలో జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు దిట్ట‌. దీనికి తోడు జ‌గ‌న్ సొంత మీడియా, వైసీపీ సోష‌ల్ మీడియా ఉండ‌నే ఉంది. ఘ‌ట‌న జ‌రిగిన తొలి రెండు రోజులు చంద్రబాబు కార‌ణంగానే ఈ ఘ‌ట‌న జ‌రిగిందంటూ వైసీపీ మీడియా ప్ర‌చారం చేసింది. వారి ప్లాన్ బెడిసికొట్ట‌డంతో ఈ ఘ‌ట‌న‌కు కార‌ణం చైర్మ‌న్‌, ఈవో అంటూ ప్ర‌చారం చేయ‌డం మొద‌లు పెట్టింది వైసీపీ బ్యాచ్‌.  చైర్మ‌న్‌, ఈవో మ‌ధ్య సమన్వయ లోపం, విభేదాలే ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మ‌ని సొంత జగన్ మీడియా, సోష‌ల్ మీడియాలో విస్తృత ప్ర‌చారం చేశాయి. చైర్మ‌న్‌, ఈవోకు వేంక‌టేశ్వ‌ర స్వామి అంటే భ‌క్తిలేదని, తిరుమ‌ల‌లో రాజ‌కీయాలు చేస్తున్నారంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేశాయి. తాజాగా వైసీపీ త‌ప్పుడు ప్ర‌చారాల‌పై టీటీడీ చైర్మ‌న్‌, ఈవో మీడియా స‌మావేశం పెట్టి సీరియ‌స్ అయ్యారు. టీటీడీ పాలక మండలికి, అధికారులకు మధ్య విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. అందరూ సమన్వయంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఆ సంఘటన మినహా మిగతా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పారు. భక్తులు ప్రశాంతంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారని స్ప‌ష్టం చేశారు. దీంతో వైసీపీ అస‌త్య ప్ర‌చారాల‌కు ఎండ్ కార్డు ప‌డిన‌ట్ల‌యింది.

By
en-us Political News

  
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.