ఇంత కాలానికి అంబటి రాంబాబు జగన్ గుడ్ లుక్స్ లోకి వచ్చేశారు. అవును ఇప్పుడు వైసీపీలో ఇదే విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ కు ఎంతో ఇష్టమైన బూతుపురాణాన్నివినిపించిన అంబటికి ఇక ఇప్పుడు పార్టీలో పదోన్నతి, కీలక స్థానం ఖాయమన్న భావన పార్టీలో వినిపిస్తోంది. పైగా వైసీపీ ఎకో సిస్టమ్ లో జగన్ దృష్టిలో పడాలన్నా, ఆయన మెప్పు పొందాలన్న ప్రత్యర్థి పార్టీల నాయకులపై బూతులతో విరుచుకుపడాలి. లేదా వారి ఇళ్లపై దాడులకు పాల్పడాలీ, అదీ కాకపోతే ప్రత్యర్థి పార్టీల కార్యాలయాలను దగ్ధం చేయాలి.
వైసీపీ అధికారంలో ఉండగా దాదాపు ఇలాంటి పనులే చేసి జోగి రమేష్ మంత్రిపదవి పొందారు. కొడాలినాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు జగన్ కు అత్యంత నమ్మకస్తులుగా మారారు. తెలుగుదేశం నుంచి వలస వచ్చిన వల్లభనేని వంశీ జగన్ కు అస్మదీయుడయ్యారు. ఇక అంబటి రాంబాబు, పేర్ని నాని కూడా జగన్ అధికారంలో ఉన్నప్పటి నుంచీ ఆయన మెప్పు కోసం సొంత సామాజికవర్గాన్ని కూడా కించపరుస్తూ జనసేనాని పవన్ పై దూషణలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. అందుకే వారిరువురికీ జగన్ కేబినెట్ లో స్థానం దక్కింది. ఇక నగరి మాజీ ఎమ్మెల్యే రోజా సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జగన్ వైసీపీ లో రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చేసి హద్దులు మీరి బూతులు, దాడులు, దౌర్జన్యాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడిన వారందరికీ అందలాలు దక్కాయి. పదవుల తాయిలాలు అందాయి.
అధికారం కోల్పోయిన తరువాత అప్పట్లో హద్దులు మీరి చెలరేగిన వారిలో చాలా మంది జాగ్రత్తపడో, భయపడే నోటికి తాళాలు వేసేసుకున్నారు. కానీ అప్పటి కంటే ఎక్కువగా చెలరేగిపోతున్న అంబటి రాంబాబు ఇప్పుడు జగన్ మెప్పు పొదారనీ వైసీపీలో చర్చ జరుగుతోంది. ఆయనకు పార్టీలో కీలక స్థానం ఖాయమన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. అయితే తన బూతులతో అంబటి రాంబాబు జనం దృష్టిలో మరింత దిగజారిపోయారని పరిశీలకులు అంటున్నారు.
అయితే జగన్ మెప్పు ముందు ప్రజల దృష్టిలో దిగజారడం ఏమంత విషయం కాదని వైసీపీయులు అంటున్నారు. ఇప్పుడు పార్టీలో చర్చ అంతా అంబటికి పార్టీలో దక్కే కీలక స్థానం ఏమిటన్నదే అని అంటున్నారు. అన్నిటికీ మించి తెలుగుదేశం కూటమిలో చీలకలు తీసుకురావాలన్న లక్ష్యంతో ఉన్న జగన్ కు జనసేనాని పవన్ కల్యాణ్ సామాజిక వర్గానికి చెందిన అంబటికి పార్టీలో కీలక పదవి ఇవ్వడం కలిసొచ్చే అంశంగా మారుతున్నంద ఆశా ఉందని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/elevation-to-ambat-rambabu-in-ycp-25-213589.html
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
అమరావతికి చట్టబద్ధత అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు.
సీఎం హోదాలో నాడు అమరావతి శాసన రాజధాని , విశాఖ పరిపాలన రాజధాని , కర్నూలు న్యాయ రాజధాని అంటూ ఓ కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు పడకపోయినా.. అప్పటి వరకూ పరుగెడుతున్న అమరావతి నిర్మాణ పనులను నిలిపివేశారు.
దేశంలో ఉన్న అన్ని పార్టీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు నిలిపి అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీని పార్లమెంటు హాలులో గురువారం ఉదయం కలిసిన లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
వైసీపీ నేతలు అవగాహన లేకుండా ప్లాట్లు, ఖర్చులంటూ అవగాహనా రాహిత్యంతో వ్యాఖ్యలు చేస్తూ తమ అజ్ణానాన్ని చాటుకుంటున్నారని ఎద్దేవా చేశారు.