అక్టోబర్‌లోనే తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్?!

Publish Date:Jun 28, 2023

Advertisement

తెలంగాణలో రాజకీయం ఇప్పటికే హీటెక్కింది. ఇప్పటికే పార్టీలు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటూ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నాయి. ఇక ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి.. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి చేరికలు పెరిగిపోతున్నాయి. పార్టీలు సైతం గెలుపు గుర్రాల కోసం వేటికవి సర్వేలు చేయించుకుంటున్నాయి. దీంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం హీటెక్కింది.  రుతుపవనాలు ప్రవేశించి వాతావరణం చల్లబడిందే కానీ రాజకీయ ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోయాయి. సాధారణంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. కానీ ఈ సారి మాత్రం తెలంగాణ రాజకీయాలు మునుపెన్నడూ లేనంత ఆసక్తిని, ఉత్కంఠనూ రేకెత్తిస్తున్నాయి.

త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేందుకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. అక్టోబర్ 10న తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉందన్న అత్యంత విశ్వసనీయ సమాచారం ఒకటి బయటకొచ్చింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు తెలంగాణ రాష్ట్రంలో  మూడు రోజులు  పర్యటించి.. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, కలెక్టర్లతో సమావేశమై పలు సలహాలు, సూచనలు ఇవ్వగా.. సరిగ్గా మూడు నెలలలో  ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.

తెలంగాణలో 2024 జనవరి 16తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది చివరికి ఎన్నికల ప్రక్రియ ముగించాలని ఎన్నికల సంఘం భావిస్తుంది. దీని ప్రకారం అక్టోబర్‌ మొదటి వారం లేదా రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని చూస్తున్నట్లుగా సమాచారం. అన్నీ కుదిరితే అక్టోబర్ 10వ తేదినే నోటిఫికేషన్ వెలువడవచ్చని తెలుస్తోంది. 2018లో శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లినప్పుడు కూడా నవంబర్ 10న నోటిఫికేషన్ వెల్లడించింది. అదే విధంగా ఈసారి నెల రోజుల ముందే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎన్నికల కమిషన్ సమయాత్తమవుతున్నట్లు తెలుస్తుంది.

ఈ ఏడాది చివరిలో మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీసగఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలున్నాయి. ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం చూస్తే తెలంగాణలో ఈ ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, గతంలో ఐదేళ్ల పదవీ కాలానికి ఆరు నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ఈసారి అలా చేయలేదు. పూర్తిగా ఐదేళ్లు పదవీ కాలం పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయనేది తేలిపోయింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, ఒక నెల ముందుగా నవంబర్ లోనే ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దమై అక్టోబర్ లోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ముందుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అధికారుల బదిలీలపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ముఖ్యంగా ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చాల్సిందేనని కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాలకు సూచించినట్టు సమాచారం. వీటిలో తెలంగాణ కూడా ఉండగా.. త్వరలోనే ఈ భారీ బదిలీల ప్రక్రియ మొదలు కానుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి అనుకూలమైన అధికారులను వారికి అవసరం ఉన్న జిల్లాలకు బదిలీ చేసే ప్రక్రియ కూడా మొదలు పెట్టడం పరిపాటి. వీరిలో కొందరిని ఎన్నికల కమిషన్ మరోసారి బదిలీ చేయడం.. విధుల నుండి తప్పించడం కూడా చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఒక్కసారి ఈ బదిలీల ప్రక్రియ మొదలైందంటే ఎన్నికల నగారా మోగినట్లే భావించాలి.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.