ఆధునికత, సృజనాత్మకత, ప్రజా ప్రయోజనం, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ఇవీ.. చంద్రబాబు పాలనకు ట్రేడ్ మార్కులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలన అలాగే సాగింది. ఆ తరువాత నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు పాలన అదే బాటలో సాగింది. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తరువాత కూడా ఆయన ఆధునికత, సాంకేతికతల మేళవింపుతో ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.
అందులో భాగంగానే విజయవాడ, విశాఖపట్నం నగరాలలో మెట్రో రైలు ప్రాజెక్టు అమలుకు నిర్ణయించి, అందు కోసం కసరత్తు ప్రారంభించేశారు. అందులో భాగంగానే విజయవాడలో రామవరప్పాడు రింగ్ రోడ్డు నుంచి నిడమానూరు వరకూ 4.70 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మోడల్ లో మెట్రో ప్రాజెక్టు పనులు చేపట్టేలా ప్రతిపాదించిన డిజైన్లకు చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. డబుల్ డెక్కర్ మోడల్ అంటే కింద రోడ్డు, పైన ఫ్లైఓవర్, ఆ పైన మెట్రో రైల్ లైన్ అన్న మాట. మొత్తంగా 18 మీటర్ల ఎత్తులో కొన్ని ప్రాంతాలలో మెట్రో రైల్ నడుస్తుందన్న మాట. ఈ మోడల్ ప్రకారం రోడ్డుకు పది మీటర్ల ఎత్తులో ఫ్లై ఓవర్ ఉంటుంది. దానికి ఎనిమిది మీటర్ల ఎత్తులో మెట్రో ట్రాక్ ఉంటుందన్న మాట. ఫ్లై ఓవర్ దాటిన తరువాత మెట్రో రైల్ ట్రాక్ పది మీటర్ల ఎత్తులోనే ఉంటుంది.
ఇదే మోడల్ ను విశాఖలోనూ అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. విశాఖలో మధురవాడ నుంచి తాటిచెట్ల పాలెం వరకూ, అలాగే గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ వరకూ మొత్తం 19 కిలోమీటర్ల పోడవున మెట్రో ప్రాజెక్టుకు చంద్రబాబు పచ్చ జెండా ఊపారు. ఇక ఈ రెండు నగరాలలోనూ మెట్రో ప్రాజెక్టు వ్యయాన్ని వంద శాతం కేంద్రమే భరించేలా సంప్రదింపులు జరపాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/double-dekker-model-metro-in-vijayawada-and-visakha-39-190744.html
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.