అందరూ మిమ్మల్ని ఇష్టపడాలంటే.. ఇలా చేయండి..!

Publish Date:May 12, 2025

Advertisement


ఇల్లు అయినా,  ఆఫీసు అయినా.. వేరే ఇతర ప్రదేశమైనా.. అందరూ మనల్ని ఇష్టపడాలని,  అందరూ మనకు ఆకర్షితమవ్వాలని,  మనల్ని గౌరవించాలని అనుకోవడంలో తప్పు లేదు. అయితే అన్ని చోట్లా ఈ గౌరవం,  అబిమానం దొరకడం కష్టం. కానీ అసాధ్యం ఏమీ కాదు.  ఈ విషయం గురించి ఆచార్య చాణక్యుడు  చాలా వివరంగా చెప్పాడు.  ఆయన చెప్పిన కొన్ని విధానాలు పాటించడం వల్ల ఆఫీసు అయినా,  ఇల్లు అయినా మరొక ప్రదేశం అయినా అందరూ గౌరవం ఇస్తూ,  ఇష్టపడతారు కూడా. ఇంతకూ చాణక్యుడు చెప్పిన విషయాలేంటో తెలుసుకుంటే..

సమిష్టి కృషి..

ఆచార్య చాణక్యుడి ప్రకారం సమిష్టి కృషితో ముందుకు వెళ్లే వారు అందరి నుండి గౌరవం పొందుతారు. అంతేకాదు అందరూ ఇలాంటి వారిని ఇష్టపడతారు.  తమ పనులు చేసుకుని వెళ్లిపోయే వారి కంటే అందరినీ తమతో కలుపుకుంటూ పనులలో వేగంగా ముందుకు వెళ్ళేవారు ఆపీసులలో మంచి గుర్తింపు,  గౌరవం తెచ్చుకోగలుగుతారు. అంతేకాదు.. అందరికీ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి కూడా.

పరిష్కారం..

ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యను తొందరగా పరిష్కారం చేసుకోవడం ఇతరులకు సంబంధించిన సమస్యలను అయినా తొందరగా పరిష్కరించడం చాలా మంచి విషయం. కానీ దురదృష్ట పశాత్తు చాలా మంది సమస్యలను తొందరగా పరిష్కరించడంలో చాలా నిర్లక్ష్యంగా లేదా చాలా జాప్యం చేస్తూ ఉంటారు.  కానీ సమస్యలు ఏవేనా,  ఎవరివి అయినా తొందరగా పరిష్కారం చేస్తే అందరూ గౌరవిస్తారు, ఇష్టపడతారు కూడా.

గౌరవం..

ఆపీసులో అందరినీ గౌరవించాలి. పెద్దవారు అయినా  చిన్నవారు అయినా గౌరవించాలి. అలా వారికి గౌరవం ఇచ్చినప్పుడు ఎదుటివారు కూడా గౌరవం పొందుతారు. తమ కంటే తక్కువ స్థాయి ఉద్యోగస్థులను కూడా గౌరవించే వారిని అందరూ ఎల్లప్పుడూ గౌరవిస్తారు.

అవకాశాలు ఇవ్వడం..

ఇతరులకు అవకాశాలు ఇవ్వడం, అవకాశాలు చూపించడం అనేది ఆపీసులలో ప్రతిభావంతులైన వ్యక్తులు ముందుకు సాగడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది.  ఒకరి ప్రతిభను ప్రోత్సహించినప్పుడు ఆ వ్యక్తి మాత్రమే కాదు.. ఆ వ్యక్తి ప్రతిభను ప్రోత్సహించిన వ్యక్తి కూడా ఇతరుల నుండి గౌరవం పొందరుతారు.  తద్వారా అందరూ ఇష్టపడతారు.


                                       *రూపశ్రీ.

By
en-us Political News

  
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే...
ప్రేమ,  భార్యాభర్తల బంధం,  సహజీవనం.. ఏదైనా సరే.. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కీ పాయింట్ గా ఉంటుంది. నేటికాలంలో బంధాలు చాలా పెళుసుగా మారాయి.  చాలా తొందరగా బ్రేకప్ లు  జరుగుతున్నాయి...
పెళ్లి ప్రపంచంలో ప్రజలందరూ సాగించే ఒక పవిత్రమైన  బంధం. భారతీయులు పెళ్లికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.  సాధారణంగా వయసు రాగానే పెళ్లి వయసు వచ్చింది అని అంటుంటారు.  దానికి తగ్గట్టే పెళ్ళిళ్లు చేస్తుంటారు....
గొడవలు లేని భార్యాభర్తల బంధం అంటూ ఉండదు. వాస్తవానికి భార్యాభర్తల మధ్య  జరిగే గొడవలు చాలా వరకు వారి బంధాన్ని మరింత బలంగా మార్చడంలో సహాయపడతాయి.  భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు  ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమను స్పష్టం చేస్తాయి...
అత్తాకోడలు ఇద్దరూ వేరే ఇంట్లో తమ తల్లిదండ్రుల మధ్య గారాభంగా పెరిగి వివాహం పేరుతో ఒక ఇంటిని చేరే వారు.  అయితే ఏ ఇంట్లో చూసినా అత్తాకోడళ్లు అంటే ఒకానొక శత్రుత్వమే కనిపిస్తుంది, వినిపిస్తుంది...
కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడు, ఇతరుల నుండి అన్యాయాన్ని ఎదుర్కుంటున్నప్పుడు, ఇతరుల తప్పులకు తాము నష్టాన్ని  అనుభవిస్తున్నప్పుడు చాలా మంది న్యాయం కోసం న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తారు.
మోసపోవడం,  మోసం చేయడం,  తప్పు చేయడం,  తప్పించుకు తిరగడం,  చట్టానికి విరుద్దంగా, న్యాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం..  ఒకటి రెండు కాదు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.