Publish Date:Oct 28, 2024
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. మొత్తం ప్రపంచం దృష్టి ఆ ఎన్నికలపైనే ఉంది. అయితే ఇప్పటి వరకూ అమెరికా అధ్యక్ష పీఠాన్ని మహిళ అధిరోహించిన చరిత్ర లేదు. ఈ సారైనా అధ్యక్ష పదవికి అమెరికన్లు మహిళను ఎన్నుకుంటారా? అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. గతంలో హిల్లరీ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేశారు. అయితే ఆమె ట్రంప్ చేతిలో పరాజయం పాలయ్యారు.
ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్,భారత సంతతికి చెందిన కమలాహారిస్ పోటీపడుతున్నారు. గతానికి భిన్నంగా ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. రిపబ్లికన్ అభ్యర్ధి ట్రంప్ పై ప్రచారంలో దాడి జరిగింది. అగంతకుడి తూటా నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన కారణంగా ట్రంప్ పై సానుభూతి వెల్లువెత్తుతుందని రిపబ్లికన్ లు ఆశిస్తున్నారు. నాలుగేళ్ల కిందట అంటే 2020లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడన్ చేతిలో పరాజయం పాలయ్యారు. నాలుగేళ్ల విరామం అనంతరం మళ్లీ ట్రంప్ బరిలో దిగారు. ఇప్పుడు డెమొక్రటిక్ అభ్యర్థిగా బైడన్ కాకుండా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ట్రంప్ ప్రత్యర్థిగా నిలబడ్డారు. వయోభారం కారణంగా బైడన్ స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకుని ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ కు అవకాశం ఇచ్చారు.
అమెరికా ఆవిర్భావం తరువాత ఈ 235 సంవత్సరాలో అయి 46 మంది అధ్యక్షులు గెలిచినా వారిలో ఒక్క మహిళ లేకపోవడం అమెరికా సమాజంలో పురుషాధిక్యతకు నిదర్శనం అనడం కంటే ఆ సమాజంలో మహిళల పట్ల వివక్ష ఉందనడానికి రుజువుగా చెప్పుకోవచ్చు. ట్రంప్ పై 2016లో హిల్లరీ క్లింటన్ పోటీ చేసి చివరివరకూ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ ఆమె గెలవలేకపోయారు. ఇప్పుడు ఎనిమిదేళ్ల తరువాత మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మహిళ నిలబడ్డారు.
ఈ సారైనా అమెరికన్లు మహిళను అధ్యక్షురాలిగా ఎన్నుకుంటారని ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. అసలు ఇప్పటి వరకూ అమెరికా అధ్యక్ష పదవి ఒక మహిళకు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించక మానదు. ప్రపంచంలోనే అత్యాధునిక దేశం,నాగరికతలో మేటి,స్వేచ్ఛా సమాజంగా పేరొందిన అమెరికాలో ప్రధాన పార్టీలు రెండూ కూడా మహిళలను అధ్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంచడం మహిళా వివక్షగానే చెప్పుకోవలసి ఉంటుంది. అమెరికా చరిత్రలో అధ్యక్ష బరిలో నిలబడిన తొలి మహిళగా హిల్లరీ క్లింటన్ రికార్డు సృష్టించారు. ఇప్పుడు 2024 ఈసారి కమలా హారిస్ పురుషాహంకారాన్ని ఆధిక్యతను ఎదుర్కొని విజయం సాధిస్తారా చూడాల్సి ఉంది.
భారత్,శ్రీలంక,ఫిలిప్పీన్స్,ఫ్రాన్స్ వంటి దేశాల్లో దేశాధినేతలుగా మహిళలు 60,70దశకాల్లోనే ఎన్నికయ్యారు. అమెరికాలో ఇంతవరకూ మహిళా అధ్యక్షరాలు ఎన్నిక కాకపోవడం, అన్నిటికీ మించి 235 ఏళ్ల చరిత్రలో కేవలం రెండంటే రెండు సార్లు మాత్రమే అధ్యక్ష బరిలో మహిళలు నిలబడే అవకాశం రావడం అంటే అమెరికన్ సమాజంలో మహిళల పట్ల వివక్ష ఏ స్థాయిలో ఉందన్నది అవగతమౌతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/discrimination-towards-women-in-america-39-187510.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.