Publish Date:Oct 28, 2024
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. మొత్తం ప్రపంచం దృష్టి ఆ ఎన్నికలపైనే ఉంది. అయితే ఇప్పటి వరకూ అమెరికా అధ్యక్ష పీఠాన్ని మహిళ అధిరోహించిన చరిత్ర లేదు. ఈ సారైనా అధ్యక్ష పదవికి అమెరికన్లు మహిళను ఎన్నుకుంటారా? అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. గతంలో హిల్లరీ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేశారు. అయితే ఆమె ట్రంప్ చేతిలో పరాజయం పాలయ్యారు.
ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్,భారత సంతతికి చెందిన కమలాహారిస్ పోటీపడుతున్నారు. గతానికి భిన్నంగా ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. రిపబ్లికన్ అభ్యర్ధి ట్రంప్ పై ప్రచారంలో దాడి జరిగింది. అగంతకుడి తూటా నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన కారణంగా ట్రంప్ పై సానుభూతి వెల్లువెత్తుతుందని రిపబ్లికన్ లు ఆశిస్తున్నారు. నాలుగేళ్ల కిందట అంటే 2020లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడన్ చేతిలో పరాజయం పాలయ్యారు. నాలుగేళ్ల విరామం అనంతరం మళ్లీ ట్రంప్ బరిలో దిగారు. ఇప్పుడు డెమొక్రటిక్ అభ్యర్థిగా బైడన్ కాకుండా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ట్రంప్ ప్రత్యర్థిగా నిలబడ్డారు. వయోభారం కారణంగా బైడన్ స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకుని ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ కు అవకాశం ఇచ్చారు.
అమెరికా ఆవిర్భావం తరువాత ఈ 235 సంవత్సరాలో అయి 46 మంది అధ్యక్షులు గెలిచినా వారిలో ఒక్క మహిళ లేకపోవడం అమెరికా సమాజంలో పురుషాధిక్యతకు నిదర్శనం అనడం కంటే ఆ సమాజంలో మహిళల పట్ల వివక్ష ఉందనడానికి రుజువుగా చెప్పుకోవచ్చు. ట్రంప్ పై 2016లో హిల్లరీ క్లింటన్ పోటీ చేసి చివరివరకూ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ ఆమె గెలవలేకపోయారు. ఇప్పుడు ఎనిమిదేళ్ల తరువాత మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మహిళ నిలబడ్డారు.
ఈ సారైనా అమెరికన్లు మహిళను అధ్యక్షురాలిగా ఎన్నుకుంటారని ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. అసలు ఇప్పటి వరకూ అమెరికా అధ్యక్ష పదవి ఒక మహిళకు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించక మానదు. ప్రపంచంలోనే అత్యాధునిక దేశం,నాగరికతలో మేటి,స్వేచ్ఛా సమాజంగా పేరొందిన అమెరికాలో ప్రధాన పార్టీలు రెండూ కూడా మహిళలను అధ్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంచడం మహిళా వివక్షగానే చెప్పుకోవలసి ఉంటుంది. అమెరికా చరిత్రలో అధ్యక్ష బరిలో నిలబడిన తొలి మహిళగా హిల్లరీ క్లింటన్ రికార్డు సృష్టించారు. ఇప్పుడు 2024 ఈసారి కమలా హారిస్ పురుషాహంకారాన్ని ఆధిక్యతను ఎదుర్కొని విజయం సాధిస్తారా చూడాల్సి ఉంది.
భారత్,శ్రీలంక,ఫిలిప్పీన్స్,ఫ్రాన్స్ వంటి దేశాల్లో దేశాధినేతలుగా మహిళలు 60,70దశకాల్లోనే ఎన్నికయ్యారు. అమెరికాలో ఇంతవరకూ మహిళా అధ్యక్షరాలు ఎన్నిక కాకపోవడం, అన్నిటికీ మించి 235 ఏళ్ల చరిత్రలో కేవలం రెండంటే రెండు సార్లు మాత్రమే అధ్యక్ష బరిలో మహిళలు నిలబడే అవకాశం రావడం అంటే అమెరికన్ సమాజంలో మహిళల పట్ల వివక్ష ఏ స్థాయిలో ఉందన్నది అవగతమౌతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/discrimination-towards-women-in-america-25-187511.html
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.