సినీ ఇండ‌స్ట్రీతో వివాదం.. రేవంత్ కు జగన్ కు తేడా గమనించారా?

Publish Date:Dec 28, 2024

Advertisement

రేవంత్ స‌ర్కార్, టాలీవుడ్ మ‌ధ్య త‌లెత్తిన వివాదం తెలంగాణ రాజ‌కీయాల‌ను ఒక్క‌సారిగా హీటెక్కించింది.  పుష్ప-2 బెనిఫిట్ షో సంద‌ర్భంగా సంధ్య థియేట‌ర్ వ‌ద్ద‌ తొక్కిస‌లాట చోటుచేసుకుని మ‌హిళ మృతిచెంద‌గా.. ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు కోమాలో ఉండి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో సినీ న‌టుడు అల్లు అర్జున్‌, థియేట‌ర్ యాజ‌మాన్యంపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఆ త‌రువాత అల్లు అర్జున్ అరెస్టు కావ‌టం, బెయిల్ పై జైలు నుంచి బ‌య‌ట‌కు రావ‌టం చకచకా జరిగిపోయాయి.

అయితే, వివాదం స‌ర్దుమ‌ణిగింద‌ని అంతా భావిస్తున్న దశలో  థియేట‌ర్ వ‌ద్ద తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌స్తావించారు. ఈ క్ర‌మంలో సినీ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. వెంట‌నే అల్లు అర్జున్ మీడియా స‌మావేశం పెట్టి రేవంత్ పేరు ప్ర‌స్తావించ‌కుండా ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. దీంతో రేవంత్ స‌ర్కార్‌, సినీ ఇండ‌స్ట్రీకి మ‌ధ్య ఎవ‌రూ పూడ్చ‌లేని గ్యాప్‌ ఏర్ప‌డిందని అంతా భావించారు. కానీ  రెండుమూడు రోజుల‌కే సినీ ఇండ‌స్ట్రీ పెద్ద‌లు రంగంలోకి దిగి రేవంత్ ను రీచ్ అయ్యారు.  దీంతో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్‌ సినీ ప్ర‌ముఖులు కొంద‌రు భేటీ  అయ్యారు. ప్ర‌భుత్వం, ఇండ‌స్ట్రీకి మ‌ధ్య వివాదం స‌మ‌సిపో యిందనిపించారు. అయితే, గ‌తంలో ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉన్న స‌మ‌యంలోనూ సినీ ఇండ‌స్ట్రీ వ‌ర్సెస్ ప్ర‌భుత్వం అన్న‌ట్లుగా వివాదం కొన‌సాగింది. జ‌గ‌న్ త‌న మొండి వైఖ‌రితో వివాదాన్ని పెంచుకోగా.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం త‌న చాకచక్యంతో వివాదాన్ని ముగించడమే కాకుండా పై చేయి సైతం సాధించారు. రేవంత్ తీరును గ‌మ‌నించిన వైసీపీ నేత‌లు సినీ పెద్ద‌ల ప‌ట్ల జ‌గ‌న్ అప్పట్లో అవ‌లంబించిన విధానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 

ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉన్న స‌మ‌యంలో సినీ ఇండ‌స్ట్రీని చుల‌క‌న‌గా చూశార‌న్న‌ వాద‌న ఉంది. సినిమా రేట్ల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం వ‌ర్సెస్ సినిమా ఇండ‌స్ట్రీ అన్న‌ట్లుగా కొద్ది రోజులు వివాదం కొన‌సాగింది. ఈ క్ర‌మంలో  మెగాస్టార్ చిరంజీవితో పాటుగా మ‌హేశ్‌బాబు, ప్ర‌భాష్‌, రాజ‌మౌళి త‌దిత‌రులు సీఎం జ‌గ‌న్ తో భేటీ అయ్యారు. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ వారి ప‌ట్ల అవ‌మాన‌క‌రంగా ప్ర‌వ‌ర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు ఏవైనా.. ముఖ్య‌మంత్రి ఎవ‌రున్నా మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్య‌క్తి వెళితే ఘ‌న‌ స్వాగ‌తం ల‌భించేది. కానీ, జ‌గ‌న్ మాత్రం చిరంజీవి, ఇత‌ర హీరోల వాహ‌నాల‌ను లోప‌లికి అనుమ‌తించ‌లేదు. దీంతో వారు కార్ల‌ను గేటు బ‌య‌టే వ‌దిలేసి జ‌గ‌న్ ను క‌లిసేందుకు న‌డుచుకుంటూ వెళ్లాల్సి వ‌చ్చింది. దీనికితోడు జ‌గ‌న్ తో స‌మావేశం అయిన స‌మ‌యంలో మీరేంటి హీరోలు.. నేను అస‌లైన హీరో అన్న‌ట్లుగా జ‌గ‌న్ ప్ర‌వ‌ర్త‌న క‌నిపించింది. ఈ క్ర‌మంలో చిరంజీవి చేతులు జోడించి సినిమా ఇండ‌స్ట్రీకి మేలు జ‌రిగేలా నిర్ణ‌యాలు తీసుకోవాలంటూ విజ్ఞ‌ప్తి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బ‌య‌ట‌కు రావ‌టంతో మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్ర‌ముఖులు జ‌గ‌న్ తీరుప‌ట్ల‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అప్ప‌టి ప్ర‌తిప‌క్ష పార్టీ నేత చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్  చిరంజీవి ప‌ట్ల జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితీరును తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. మెజార్టీ ప్ర‌జ‌లుసైతం సినీ హీరోల ప‌ట్ల జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలిని త‌ప్పుబ‌ట్టారు. దీనికితోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు సినీ ఇండ‌స్ట్రీపై నోరుపారేసుకున్నారు. దీంతో ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ ఘోరం ఓట‌మికి ఈ ఘ‌ట‌న కూడా కార‌ణ‌మైంద‌ని చెప్పొచ్చు.

తెలంగాణలో ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత మెగాస్టార్ చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున, ప‌లువురు సినీ ఇండ‌స్ట్రీ పెద్ద‌లు క‌లిసి అభినంద‌న‌లు తెలిపారు. అయితే, హైద‌రాబాద్ లో చెరువులను ఆక్ర‌మించి నిర్మించిన క‌ట్ట‌డాల‌ను ప్ర‌భుత్వం కూల్చివేత‌ల ప్ర‌క్రియ‌ను చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో హీరో నాగార్జున‌కు సంబంధించిన ఎన్ క‌న్వెన్ష‌న్ హాల్ కొంత భాగాన్ని అధికారులు కూల్చివేశారు. ఆ స‌మ‌యంలో సినీ ఇండ‌స్ట్రీ నుంచి రేవంత్ రెడ్డిపై కొంత వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. కొద్దిరోజుల త‌రువాత కేటీఆర్ ను విమ‌ర్శించే క్ర‌మంలో అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల వ్య‌వ‌హారాన్ని మంత్రి కొండా సురేఖ ప్ర‌స్తావించారు. దీంతో అక్కినేని కుటుంబంతోపాటు సినీ ఇండ‌స్ట్రీలోని ప్ర‌ముఖులు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఈక్ర‌మంలో సినీ ఇండ‌స్ట్రీ మొత్తం ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మారింది. తాజాగా పుష్ప‌-2 సినిమా బెనిఫిట్ షో సంద‌ర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌లో రేవంతి అనే మ‌హిళ మృతిచెంద‌గా.. ఆమె కుమారుడు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘట‌న‌కు సంబంధించి అల్లు అర్జున్ స‌హా ప‌లువురిపై కేసు న‌మోదైంది. అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేసి జైల‌ుకు పంపించారు. అదే స‌మ‌యంలో హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పై విడుద‌లై అల్లు అర్జున్ త‌న నివాసానికి వెళ్లిన త‌రువాత సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చి అల్లు అర్జున్ ను ప‌రామ‌ర్శించారు. దీంతో రేవంత్ స‌ర్కార్ వ‌ర్సెస్ సినీఇండ‌స్ట్రీ అన్న‌ట్లుగా వివాదం మారింది. 

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సినీఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌పై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. తొక్కిస‌లాట‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన బాలుడు ఆస్ప‌త్రిలో ప్రాణాపాయ‌స్థితిలో చికిత్స పొందుతుంటే అత‌న్ని చూసేందుకు వెళ్ల‌ని సినీ ప్ర‌ముఖులు జైలుకు వెళ్లివ‌చ్చిన అల్లు అర్జున్ ను ప‌రామ‌ర్శించ‌టం ప‌ట్ల సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదిక‌గా త‌ప్పుబ‌ట్టారు. ఇక నుంచి తెలంగాణ‌లో బెనిఫిట్ షోలు ఉండ‌వ్‌, టికెట్లు పెంపు ఉండ‌ద‌ని ఖ‌రాఖండీగా చెప్పేశారు. దీంతో సినీ పెద్ద‌ల రంగంలోకిదిగి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న‌ సినీ ప్ర‌ముఖుల ప‌ట్ల‌ రేవంత్ రెడ్డి మ‌ర్యాద‌పూర్వంగా న‌డుచుకున్నారు. హీరో నాగార్జున‌, వెంక‌టేశ్ తో రేవంత్‌ ఆప్యాయంగా మాట్లాడారు. త‌ద్వారా  ప్ర‌భుత్వం ప‌రంగా తీసుకునే నిర్ణ‌యాల్లో  కాఠిన్యం ఉన్నా.. సినీ ఇండ‌స్ట్రీ వారి ప‌ట్ల మ‌ర్యాద‌పూర్వ‌కంగా ఉంటామ‌ని రేవంత్ చెప్ప‌క‌నే చెప్పారు. ఈ స‌మావేశంలో సినీ పెద్ద‌ల ప్ర‌తిపాదనలను రేవంత్ ఆమోదించలేదు. ముఖ్యంగా బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంపు వంటి వాటిని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అయితే రేవంత్ సినీ ప్రముఖులకు ఇచ్చిన మర్యాద ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంది. రేవంత్ తో భేటీ తరువాత ఆ భేటీకి హాజరైన వారంతా రేవంత్ ను పొగడ్తల వర్షంలో ముంచేశారు. దీంతో  గతంలో సినీ ప్రముఖులతో  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ్యవహరించిన తీరు ఇప్పుడు ప్రముఖంగా చర్చకు వచ్చింది. రేవంత్ జగన్  మధ్య తేడాను ప్రస్ఫుటంగా ఎత్తి చూపింది. అప్పట్లో సినీ హీరోల‌ ప‌ట్ల జ‌గ‌న్  వ్యవహరించిన తీరు ఏ మాత్రం సమర్ధనీయం కాదన్న అభిప్రాయం మరో సారి వ్యక్తం అవుతోంది.  

By
en-us Political News

  
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడాయా ఖాతాలలో అంగన్ వాడీలకు సెల్ ఫోన్ల వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన వరుస పోస్టులు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాయని సీతక్క ఆ నోటీసులో పేర్కొన్నారు.
తమిళనాడులో ఆదివారం జరిగిన ఒక రోడ్‌షోలో హలోగ్రాఫిక్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు. విజయ్ స్వయంగా అక్కడ ప్రచారంలో పాల్గొన లేదు. కానీ ఏఐ ద్వారా విజయ్ రూపం, గొంతుఓటర్ల ముందుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
డిజిటల్ మీడియా, ఆ తరువాత త్వరలోనే పూర్తి స్థాయి శాటిలైట్ చానల్ అని ప్రకటిస్తూ విజయ సాయి రెడ్డి.. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే అలా విమర్శించి ఊరుకోకుండా అమరావతిలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం అంటే దీక్ష చేస్తున్న రామచంద్రయాదవ్ కు మద్దతు ప్రకటించారు.
కేంద్రం ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇందుకు సంబంధిచిన బిల్లు ఆమోదం పొందడం, ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఎలాంటి జాప్యం లేకుండా సాగిపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆ విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కీలక చర్చ జరుుగుతోంది.
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.