కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న వ్యక్తి అయిన రాహుల్ గాంధీ నేపాల్ పర్యటనలో నిజంగానే నైట్ క్లబ్ లో ఎంజాయ్ చేశారా? బీజేపీ విడుదల చేసి రచ్చ చేస్తున్న వీడియోల వెనుక అసలు కథ ఏమిటి? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ ఆయన వెళ్లింది ఒక వివాహానికని చెబుతున్న మాటలలో నిజమెంత? ఇంతకీ ఆ వీడియోలలో కనిపిస్తున్న యువతి ఎవరు? ఆమెకూ రాహుల్ గాంధీకీ సంబంధం ఏమిటి?
వీటన్నిటికీ సమాధానాలు తెలియాలంటే...బీజేపీ చెబుతున్నట్లుగా రాహుల్ గాంధీ ఎంజాయ్ చేస్తున్న నైట్ క్లబ్ లో రాహుల్ గాంధీతో ఉన్న యువతి ఎవరన్నది తెలియాలి. ఆమె పేరు సుమ్మిమా ఉదాస్. నేపాలీ అయిన ఆమె ప్రముఖ వార్తా సంస్థ సీఎన్ఎస్ ఇంటర్నేషనల్ కు ఢిల్లీ ప్రతినిథిగా పని చేశారు. ఆ సమయంలో ఆమె దేశంలో రాజకీయ, ఆర్థిక, పర్యావరణ, సామాజిక అంశాలకు సంబంధించి పలు ఆసక్తికర కథనాలతో సంచలనాలు ష్టించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ గ్యాంగ్ రేప్ కేసుపై ఆమె కథనాలు అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందాయి. అలాగే 2014 సార్వత్రిక ఎన్నికలను కూడా ఆమె సీఎన్ఎన్ ఇంటర్నేషనల్ ఢీల్లీ ప్రతినిథిగా కవర్ చేశారు.
రాహుల్ గాంధీకి ఆమె మంచి ఫ్రెండ్. ఆమె వివాహానికి హాజరయ్యేందుకే రాహుల్ నేపాల్ వెళ్లారు. ఆమె వివాహం గురువారం జరగనుంది. అందుకు సంబంధించిన రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఆ రిసెప్షన్ వేడుకలలో రాహుల్ పాల్గొన్న ఫొటోలే సామాజిక మాధ్యమంలో బీజేపీ పోస్టు చేసింది. అవి వైరల్ అయ్యి రాజకీయ దుమారానికి కారణమయ్యాయి.
రాహుల్ గాంధీ తమ ఆహ్వానం మేరకే ఖాట్మండూ వచ్చారని సుమ్మిమా ఉదాస్ తండ్రి భీమ్ ఉదాస్ తెలిపారు. ఆయనా సామాన్యుడేమీ కాదు. దౌత్య అధికారిగా పనిచేశారు. మయన్మార్ లో నేపాల్ రాయబారిగా సేవలందించారు.
అసలు సంగతి ఇలా ఉంటే బీజేపీ కాదేదీ రాజకీయ రచ్చకు అనర్హం అన్నట్లుగా కొన్ని వడియోలను సోషల్ మీడియాలో వదలి రాజకీయ రచ్చ చేసింది. దేశంలో ఎలక్షన్ హీట్ ఉన్న సమయంలో ప్రత్యర్థి పార్టీలను బలహీన పరచడమే లక్ష్యంగా ఈ చర్యకు పాల్పడిందని కాంగ్రెస్ విమర్శలు కురిపిస్తున్నది. వివాహానికి వెళ్లడమే బీజేపీ దృష్టిలో నేరమా అని నిలదీస్తున్నది. ఇలా ఉంటే దేశంలో క్రమంగా కాంగ్రెస్ బలపడుతోందన్న భావనతోనే కాంగ్రెస్ పై బురదజల్లి బలహీనపరిచే ఉద్దేశంతో బీజేపీ ఈ రాద్ధాంతం చేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద రాహుల్ నేపాల్ పర్యటన రాజకీయ రాద్ధాంతానికి కారణమైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/did-rahul-really-enjoyed-in-night-club-25-135409.html
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.