ధర్మ సందేహాలు ఎన్నో

Publish Date:Nov 15, 2013

Advertisement

 

జగన్ బాధితులలో ధర్మాన ప్రసాదరావు కూడా ఒకరు. కానీ చావు తప్పి కన్నులొట్టపోయినట్లు ఇంకా జైలు గడప తొక్క కుండా ఎలాగో మేనేజ్ చేసుకొంటూ, ఆ జగన్ బాబుతోనే కలిసి రోజూ కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు చేసుకొంటున్నారు. ఆ క్రమంలో వారిద్దరూ ఒకరికొకరు ఎట్రాక్ట్ అవుతునట్లు సమాచారం. ఇంతవరకు కిరణ్ రెడ్డి ఎప్పటికయినా కొత్త పార్టీ పెట్టకపోతాడా అందులో తను చేరకపోతానా? అని త్రిశంకులో ఊగిసలాడుతున్న ధర్మాన, ఈ ఎట్రాక్షన్లో పడి, తనకీ పరిస్థితి కల్పించిన బాబు ఆ బాబేనన్న సంగతి కూడా మరిచిపోయి, ‘పోనీ వైకాపాకి కమిట్ అయిపోదామా?’ అని ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

 

కానీ రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం పోలేదన్నట్లు, సీబీఐ ఇచ్చిన మెడల్స్ వల్ల తనకి టికెట్ రాని కాంగ్రెస్ నుండి, సీబీఐతో అనుబందం పెనవేసుకొన్న కాంగ్రెస్ లోకి జంప్ చేస్తే, రేపు కేసులు ఓ కొలిక్కి వస్తున్నపుడు మళ్ళీ అదే బాబుకి వ్యతిరేఖంగా మాట్లాడవలసి వస్తే? అనే ధర్మసందేహం కూడా ధర్మయ్యని పట్టి వెనక్కి లాగుతోంది.

 

అంతే గాక తనకంటే ముందే ఆ పార్టీలో సెటిల్ అయిపోయిన బ్రదర్ కృష్ణ దాసు తనకోసం తలుపులు తీసేందుకు బొత్తిగా ఒప్పుకోవడం లేదట. ఇదివరకు అతనిపై మరో బ్రదర్ రామదాసుని ఎన్నికలలో పోటీకి నిలబెట్టడమే అందుకు కారణమని సమాచారం. అయితే ఏ బ్రదర్ ఒప్పుకోకపోయినా బిగ్ బ్రదర్ ఒప్పుకొంటే అన్ని తలుపులు వాటంతటవే తెరుచుకొంటాయని జగమెరిగిన సత్యం.

 

అయితే కండువా ఏదయినప్పటికీ ఈసారి నేరుగా లోక్ సభకే వెళ్ళిపోవాలని ధర్మాన డిసైడ్ అయిపోయినట్లు సమాచారం. అలాగయితే, ఆ రేంజిలో జిల్లాలో పోటీపడవలసిన వారు ఇద్దరు ఉన్నారు. తండ్రి మరణంతో అతని స్థానంలోకి వచ్చిన ఎర్రం నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు. కాంగ్రెస్ డీ.యన్.యే. కలిగి ఉన్నకిల్లి రాణిగారు.

 

రామ్మోహన్ నాయుడు తన ముందు కాకి పిల్లే అనుకొన్నా, అతనికి సానుభూతి ఓటు, జిల్లాలో అతని తండ్రికి ఉన్నమంచి పేరు ప్లస్ పాయింట్స్. ఇక కిల్లి రాణీ గారి గురించి చెప్పేదేముంది? తన పట్టు చీర కొంగుతో రాష్ట్రాన్ని గట్టిగా ముడేసి కలిపి ఉంచుదామనుకొన్నపటికీ ఆ పాడు బీజేపీ, తెదేపాలు ‘యు టర్నులు’ తీసుకొంటున్నాయని ఆవేదన చెందని రోజు లేదు. ఇక ఎలాగు విడిపోయే రాష్ట్రం కోసం రాకరాక వచ్చిన తన కేంద్ర మంత్రి రాజీనామా చేసి ఉపయోగమేమిటని నిలదీస్తుంటారు కూడా. కానీ ఈసారి కూడా తనకే ఓటేసి గెలిపించేస్తే డిల్లీలో తనకున్న పలుకుబడినంతా ఉపయోగించేసి శ్రీకాకుళానికి ఒక మంచి ప్యాకేజి తెస్తానని హామీ ఇస్తున్నారు.

 

కానీ మళ్ళీ అంతలోనే ధర్మనకి మరో ధర్మసందేహం కలిగింది. అదే, ఏ కండువా కప్పుకొన్నపటికీ జనాలు గుర్తు పట్టకుండా ఉంటారా? అని. మరి ఈ పద్దులు, సందేహాలు అన్నీ సరి చూసుకొన్న తరువాతనే ఏ కండువా కప్పుకోవాలో, ఏ సీటులో కూర్చొంటే ఐదేళ్ళు కడుపులో చల్ల కదలకుండా హాయిగా కూర్చోవచ్చో ఫైనల్ చేసుకోవడం ధర్మానకి ధర్మంగా ఉంటుంది.

By
en-us Political News

  
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.