ఆంధ్రా లిక్కర్ స్కాం ముందు ఢిల్లీ లిక్కర్ స్కాం బ‌లాదూర్ - మాజీ సి.ఎం. కిర‌ణ్‌కుమార్‌రెడ్డి.

Publish Date:Apr 1, 2024

Advertisement

ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాల పేరుతో సాగుతోన్న మ‌ద్యం దందాలో బ్రాండ్లుదే కీల‌క‌పాత్ర‌. ఊరూ పేరు లేని మ‌ద్యం బ్రాండ్లు దాదాపు 2725 ర‌కాల‌వి అమ్ముతున్నారు. వీటిలో 70 శాతం బ్రాండ్ల పేర్లు గ‌తంలో ఎవ‌రూ విన‌లేదు. ఇవ్వ‌న్నీ ఎవ‌రు త‌యారు చేస్తున్నారు. ఎందుకు త‌యారు చేస్తున్నారు. ఎలా త‌యారు చేస్తున్నారు? ఇదో పెద్ద స్కాం అంటారు మాజీ సి.ఎం. కిర‌ణ్‌కుమార్‌రెడ్డి.  ఆంధ్రా లిక్క‌ర్ స్కాం ముందు ఢిల్లీలో వెలుగుచూసిన లిక్క‌ర్ కుంభ‌కోణం బ‌లాదూర్ అంటారాయ‌న‌. ప్ర‌భుత్వ మ‌ద్యం,  వైన్‌షాపుల్లో అమ్మేది మ‌ద్యం కాదు విషం అని లేబ‌రేట‌రీ నివేదిక‌ల్లో తేల‌డంతో ఏపీలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. 
మీకు గుర్తుందా అప్ప‌ట్లో ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా వున్న సోము వీర్రాజు ఏమ‌న్నారంటే ఏపీలో బీజేపీ అధికారంలోకి వ‌స్తే కేవ‌లం 50 రూపాల‌కే చీప్ లిక్క‌ర్ ఇస్తామ‌న్నారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం తక్కువ ధరకే ఇస్తామ‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు.
సి.ఎం. జ‌గ‌న్ ఏమో ప్ర‌భుత్వ మ‌ద్యాన్ని పేద‌లు కొన‌లేనంత రేట్లు పెంచానంటున్నారు. ఎందుకంటే అది మ‌ద్య‌నిషేధంలో భాగ‌మ‌ని క‌ల‌రిచ్చారు. 
తాజాగా మాజీ సి.ఎం. కిర‌ణ్‌కుమారెడ్డి రాజంపేట ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో మాట్లాడుతూ ఆంధ్రా లిక్క‌ర్ స్కాం ముందు ఢిల్లీలో వెలుగుచూసిన లిక్క‌ర్ కుంభ‌కోణం బ‌లాదూర్ అంటూ జే సిండికేట్ గుట్టు ర‌ట్టు చేశారు. దీంతో
ఏపీ రాజ‌కీయాల్లో లిక్క‌ర్ హాట్ హాట్‌గా మారింది.  
ఏపీలో దేశంలోనే మ‌రెక్క‌డా లేనివిధంగా 2725 బ్రాండ్లు మార్కెట్‌లో ఉన్నాయి. ఊరూపేరూలేని వేలాది బ్రాండ్ల‌న్నీ పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, అనిల్‌రెడ్డి సిండికేట్ ఉత్ప‌త్తులేన‌ట‌. జ‌గ‌న్ ఆయ‌న మ‌నుషులు త‌యారు చేస్తున్న ఈ మ‌ద్యం బ్రాండ్ల‌న్నీ..  కేంద్ర ప్ర‌భుత్వం నిర్దేశించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌కి విరుద్ధంగా వున్నాయ‌ని  కెమిక‌ల్ ప‌రీక్ష‌ల్లో తేలిపోయింది.  ఏపీ వైన్ షాపుల్లో కొనే బ్రాందీ, విస్కీల్లో సైనైడ్ వుంద‌ట‌.  ఓల్డ్ టైమ‌ర్ ,చాంపియ‌న్, రాయ‌ల్‌సింహ,  గ్రీన్ చాయిస్‌, సెల‌బ్రిటీ బ్రాండ్ల‌లో  ప్ర‌మాద‌క‌ర ర‌సాయ‌నాలున్నాయ‌ని త‌మిళ‌నాడులోని ఎస్ జీ సి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై ల్యాబ్‌కి ప‌రీక్ష‌ల్లో తేలింది. ఈ మద్యంలో... బెంజోక్వినోన్‌, స్కోపారోన్‌, డైమితోక్సినామిక్‌ యాసిడ్‌,  పైరోగలాల్‌, వొల్కెనిన్‌,  వంటి రసాయనాలు కనిపించాయి. జ‌గ‌న్ బ్రాండ్లు తాగితే ఆయుష్షు తీరిన‌ట్టేన‌ని ల్యాబ్ రిపోర్ట్ స్ప‌ష్టం చేస్తోంది. 
1. దేశ‌మంతా డిజిట‌ల్ లావాదేవీలైతే ఏపీ మ‌ద్యం షాపుల్లో ఓన్లీ క్యాష్‌...నో బిల్‌
2. మ‌ద్యం త‌యారీకి కావాల్సిన‌ ఇథైల్ ఆల్క‌హాల్ దేశంలో ఉత్ప‌త్తి లేదు.. విదేశాల నుంచి దిగుమ‌తీ లేదు
3. 10 రూపాయ‌లు క్వార్ట‌ర్ ఖ‌రీదైన ప్రెసిడెంట్ మెడ‌ల్ ని 150 అమ్ముతున్నారు
4. ఎక్స్‌ట‌ర్న‌ల్ యూజ్ మెడిసిన్స్ కోసం వాడే కెమిక‌ల్స్‌తోనే ఏపీ లిక్క‌ర్ త‌యారౌతోంది5.  మ‌ద్యం మ‌ర‌ణాల‌కు జె బ్రాండ్ మ‌ద్యమే కార‌ణ‌మ‌ని తేలిపోయింది.
మద్యం త‌యారీలో 1. ఈఎన్ ఏ, 2. లిక్విడ్ ఇథైల్ అనేవి కీల‌కం. అయితే వీటికి ప్ర‌త్యామ్నాయంగా జే సిండికేట్ సైనేడ్ తో పాటు ఇత‌ర ప్ర‌మాద‌క‌ర‌మైన ర‌సాయ‌నాలు వాడి మ‌ద్యం త‌యారు చేసి ఏపీ ప్ర‌భుత్వ షాపుల్లో అమ్ముతున్నారు. 
ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌(ఈఎన్‌ఏ) ఎలా త‌యారు చేస్తారంటే..... 
బియ్యం, బియ్యం నూకలు, మొక్క‌జొన్న‌ ప్రాసెసింగ్‌ చేయడం ద్వారా తొలుత రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ తయారు చేస్తారు. దాన్ని మరింత శుద్ధి చేస్తే ఈఎన్‌ఏగా మారుతుంది. స్పిరిట్‌లో ప్యూరిటీ 66శాతం దాటితే ఈఎన్‌ఏగా పిలుస్తారు. ఎక్సైజ్‌ నిబంధనల ప్రకారం కనీసం 66 శాతం ప్యూరిటీ ఉన్న ఈఎన్‌ఏతోనే మద్యం తయారు చేయాలి. ఆ తర్వాత ఈఎన్‌ఏకు నీరు, రంగు, ఫ్లేవర్‌, మాల్ట్ లాంటివి కలిపి మద్యం ఉత్పత్తి చేస్తారు. 
కానీ...జ‌గ‌న్  బ్రాండ్లను ఈఎన్‌ఏ కాకుండా నేరుగా రెక్టిఫైడ్‌ స్పిరిట్‌తోనే ఉత్పత్తి చేస్తున్నారు. 
ఇక మ‌ద్యం త‌యారీలో కీల‌కమైన లిక్విడ్ ఇథైల్ ఆల్క‌హాల్ ను ఎలా త‌యారు చేస్తున్నారో చూస్తే.... 
జ‌గ‌న్ సిండికేట్‌ ఉత్ప‌త్తి చేస్తోన్న ల‌క్ష‌ల లీట‌ర్ల మ‌ద్యానికి స‌రిప‌డా 
ఇథైల్ ఆల్క‌హాల్ రాష్ట్రంలో ఉత్ప‌త్తి కాలేదు. దేశంలోనూ లేదు. 
ఇథైల్ ఆల్క‌హాల్ ఎంత దిగుమ‌తి చేసుకున్నారు అని ఒక స‌మాచార హ‌క్కు కార్య‌క‌ర్త అడిగితే అస‌లు దిగుమ‌తి చేసుకోలేద‌ని సంబంధిత శాఖ నుంచి స‌మాచారం అందింది. 
మ‌ద్యం తయారీ అత్య‌వ‌స‌ర‌మైన ఇథైల్ ఆల్క‌హాల్ దేశీయంగా ఉత్ప‌త్తి లేకుండా, 
దిగుమ‌తి చేసుకోకుండా ఏపీలో ప్ర‌మాద‌క‌ర బ్రాండ్ల త‌యారీకి వాడుతున్న ర‌సాయ‌నాలు ఏంట‌నేది ఎస్ జీ ఎస్ ల్యాబ్ ప‌రీక్ష‌ల్లో తేట‌తెల్ల‌మైంది. 
ఇథైల్ ఆల్క‌హాల్‌కి బ‌దులుగా 
ఎక్స్‌టెర్న‌ల్ మెడిసిన్ త‌యారు చేసేందుకు వాడే కెమిక‌ల్స్‌ని మ‌ద్యం త‌యారీకి వాడుతున్నారు. 
ఆయిట్మెంట్లు, టాబ్లెట్లు, క్రీములు త‌యారు చేసుకునేందుకు త‌మ ఫార్మా కంపెనీలు దిగుమ‌తి చేసుకున్న కెమిక‌ల్స్‌నే మ‌ద్యం తయారీకి వాడేస్తున్నారు. 
గ‌తంలో మండ‌లానికి ఓ మ‌ద్యం సిండికేట్‌వుండేది. ఇప్పుడు రాష్ట్ర‌మంతా జ‌గ‌న్ అనుచ‌రులు  సిండికేట్‌గా ఏర్ప‌డ్డారు. అమ్మేది ప్ర‌భుత్వం పేరుతోనైనా, త‌యారు చేసేది మాత్రం జె. సిండికేట్ డిస్టిల‌రీల్లోనే అనేది బ‌హిరంగ ర‌హ‌స్యం. 
ఎస్పీవై  డిస్టలరీ వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చేతిలో వుంది. ఇందులోంచి  ఎస్పీవై గెలాక్సీ బ్రాందీ, ఎస్పీవై చాంపియన్ విస్కీ, ఎస్పీవై, సెలబ్రిటీ బ్రాందీ,  వైట్ టస్కర్, దారు హౌస్ బ్రాండ్లు త‌యారు చేస్తున్నారు. 
మంత్రి బొత్స సత్యనారాయణకు చెందిన  అదాన్, లీల డిస్టలరీలు  సుప్రీం విస్కీ, బ్రిలియంట్ విస్కీ త‌యారు చేసి ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాల ద్వారా అమ్ముతున్నారు. 
క‌మీష‌న్లు ఇచ్చుకోలేని డిస్టిల‌రీలు జ‌గ‌న్ అనుచ‌రుల‌కే లీజుకిచ్చేశారు. 2 వేల‌కి పైగా బ్రాండ్ల‌న్నీ వీరే త‌యారు చేస్తూ అమ్ముతున్నారు. అన్నీ క్యాష్ ట్రాన్సాక్ష‌న్స్‌, నో బిల్‌. దేశ‌మంతా డిజిట‌ల్ లావాదేవీలు జ‌రుపుతుంటే ఏపీ ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాల‌లో ఓన్లీ క్యాష్. నో బిల్‌. అతి పెద్ద దోపిడీ ఇలా సాగుతోంది. 
టిడిపి హ‌యాంలో ఏడాదికి 6 వేల‌కోట్లు... అమ్మాకాలుండేవి. వైసీపీ ప్ర‌భుత్వం 20 వేల కోట్ల మ‌ద్యం ఏడాదికి అమ్ముతోంది. సిండికేట్ త‌యారుచేసిన ఈ మ‌ద్యం అమ్మ‌కాల నుంచి నెల‌కి 200 కోట్లు నేరుగా జ‌గ‌న్ కు అందేలా 
వైఎస్ అనిల్ రెడ్డి చూసుకుంటార‌ట‌.  ఏపీ లిక్క‌ర్ స్కాం సంబంధించిన కీల‌క ఆధారాలు త‌న వ‌ద్ద వున్నాయ‌ని మాజీ సి.ఎం. చెబుతున్నారు. ఈ స్కాంలో మిథున్‌రెడ్డి పాత్ర గురించి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఏం చెబుతారోన‌నే ఉత్కంఠ‌త నెల‌కొంది.

By
en-us Political News

  
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.