పగటి కలలా? మానసిక రుగ్మతా.. జగన్ వింత ప్రవర్తనకు కారణమేంటి?

Publish Date:Jan 15, 2025

Advertisement

కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించడం అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పిలుపు నిచ్చారు. అయితే మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మాత్రం తాను కలలు కంటాననీ, వాటిలోనే జీవిస్తాననీ, అదే వాస్తవమని తాను నమ్మడం కాకుండా, పార్టీ నేతలు, క్యాడర్, ప్రజలూ కూడా నమ్ముతున్నారని భ్రమ పడుతున్నారు. జగన్ ఐదేళ్ల అరాచక పాలనపై ప్రజలు తమ వ్యతిరేకతను, ఆగ్రహాన్ని గత ఏడాది జరిగిన ఎన్నిలలో విస్పష్టంగా చాటారు. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ దీనంగా కోరిన జగన్ కు ఆ చాన్స్ ఇచ్చి అధికారం కట్టబెట్టినందుకు తమను తాము తిట్టుకుంటూ ఐదేళ్లు గడిపిన ప్రజలు.. ఐదేళ్ల తరువాత ఎన్నికలు రాగానే జగన్ ఇక చాలు.. నీకు మరో చాన్స్ లేదని విస్పష్టంగా చాటేలా ఓట్లు వేశారు. అందుకే ఆయన పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 11 అంటే 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆ ఎన్నికల్లో జగన్ కు ఆయన అండ చూసుకుని విర్రవీగిన ఆయన పార్టీ నేతలకూ గట్టి బుద్ధి చెప్పారు. 

సరే జగన్ ప్రభుత్వం పతనమై చంద్రబాబు సారథ్యంలో తెలుగుదేశం కూటమి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆరు నెలలు దాటింది. చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో ప‌రుగులు పెట్టిస్తోంది. ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల్లోని ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ ప‌ని తీరు ప‌ట్ల ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతుకుల ర‌హ‌దారుల‌ స్థానంలో అద్దాల్లాంటి రోడ్లు దర్శనమిస్తున్నాయి. ఐదేళ్లు రాష్ట్రం వైపు చూడడానికే భయపడిన పెట్టుబడి దారులు ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. రాష్ట్రానికి ప్ర‌పంచ స్థాయి కంపెనీలు తరలి వస్తున్నాయి. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ సార‌థ్యంలో  రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు పెడుతుందన్న జనం బలంగా విశ్వసిస్తున్నారు. అయితే ప్రజల ఆకాంక్షలు, అభీష్ఠాలతో ఏ మాత్రం సంబంధం లేని, మాజీ  మయుఖ్యమంత్రి, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే అయిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం తన అధికార వియోగం తాత్కాలికమేననీ,  కొద్ది రోజులలోనే లేకుంటే కొద్ది నెలల్లోనే మళ్లీ తానే ముఖ్యమంత్రిని అవుతాననీ తాను నమ్మడమే కాకుండా అందరూ నమ్మి తీరాలంటున్నారు.  

ఐదేళ్లు ముఖ్య‌మంత్రిగా ఉండి..  ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై అక్ర‌మ కేసులు బనాయించి జైలు పంపించ‌డం, ప‌ర‌దాలు క‌ట్టుకొని బ‌య‌ట‌కు రావ‌డం, ప్ర‌భుత్వ ప‌నితీరును ప్ర‌శ్నించిన వారిపై దాడులు చేయించ‌డం, సొంత మీడియా, సోష‌ల్ మీడియా ద్వారా ఆడ‌వారిపై కూడాఅస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టించ‌డం చేసిన జ‌గ‌న్‌.. ప్ర‌జ‌ల‌చేతిలో చావుదెబ్బ‌తిన్నా బుద్ధి మార్చుకోలేదు.  కనీసం ప్రతిపక్ష  హోదా కూడా లేక‌పోయినా అహంకార పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాత్రిళ్లు దేవుడు క‌ల‌లోకి వ‌చ్చి చెప్పిన‌ట్లు ఈ ప్ర‌భుత్వం ఎక్కువ రోజులు ఉండ‌దు అంటూ అధికారుల‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడు. అధికారం కోల్పోయి ఏడాదికూడా కాక‌ముందే .. మ‌రికొద్ది రోజుల్లో అధికారంలోకి వ‌స్తున్నామంటున్న జ‌గ‌న్ తీరును చూసి వైసీపీ నేతలూ, శ్రేణులే తలలు బాదుకుంటున్నాయి. ఆయన మానసిక స్థితిపై వారిలో  అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రచారంలో ఉన్నట్లుగా జగన్ కు ఏదైనా మానసిక రుగ్మత ఉందా అన్న సందేహాలు వైసీపీ నుంచే వ్యక్తం అవుతున్నాయి. 

ఎన్నిక‌ల్లో అధికారం కాల్పోయిన ఏ పార్టీ అయినా.. త‌మ పాల‌న‌లో ఎక్క‌డ పొర‌పాట్లు జ‌రిగాయి.. ప్ర‌జ‌లు ఎందుకు మ‌న‌ల్ని ఓడించారు అన్న విషయాలపై సమీక్షలు చేసుకుంటుంది.  మ‌రోసారి అలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతుంది. కానీ వైసీపీ అధినేత  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం అటువంటి వాటి జోలికి పోవడం లేదు.  అధికారం కోల్పోయిన నెల రోజుల నుంచే మళ్లీ మేమే అధికారంలోకి వ‌స్తాం.. అప్పుడు మీ అంతు చూస్తాం అంటూ అధికారుల‌బెదరింపులకు దిగడం మొదలు పెట్టారు. ఇక్కడ జగన్ మానసిక పరిస్థితిపై ప్రజలలో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  జ‌గ‌న్ అధికారం కోల్పోయిన నాటి నుంచి అధికారుల‌ను బెదిరిస్తూ భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మొట్ట‌మొద‌టి అసెంబ్లీ స‌మావేశాల స‌మ‌యంలో త‌న‌ను నేరుగా అసెంబ్లీలోకి పంపించ‌డం లేద‌ని మ‌ధుసూద‌న్ రావు అనే అధికారిని జ‌గ‌న్ బెదిరించారు.  ఆ తరువాత తిరుప‌తి మాజీ ఎస్పీ సుబ్బారాయుడిపైనా బెదరింపుల పర్వానికి దిగారు. మేం అధికారంలోకి రాబోతున్నాం.. అప్పుడు నువ్వు ఎక్క‌డికిపోయినా  తీసుకొచ్చి నీ అంతుతేలుస్తాం అంటూ జ‌గ‌న్ హెచ్చరికలు జారీ చేశారు. ఇక తాజాగా పులివెందుల‌లో డీఎస్పీ ముర‌ళీనాయ‌క్ కు సైతం జ‌గ‌న్ వార్నింగ్ ఇచ్చారు. 
తనకు వరసకు సోదరుడైన వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియల సందర్భంగా సతీసమేతంగా పులివెందుల  వ‌చ్చిన జ‌గ‌న్‌.. కార్యక్రమం అనంతరం వెళ్లిపోయే సమయంలో తన హెలీప్యాడ్ వద్దకు డీఎస్పీ మురళీనాయక్‌ను పిలిపించుకుని మరీ వార్నింగ్ ఇచ్చారు.  వైసీపీ అధికారంలోకి వ‌స్తుంది ఏపీలో నువ్వు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

జ‌గ‌న్ అధికారంలో ఉండి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, లోకేశ్ లాంటి నేత‌లు ఎవ‌రైనా అధికారుల‌పై ఇలా బెదిరింపుల‌కు పాల్ప‌డితే వెంట‌నే పోలీసు అధికారుల సంఘం నేత‌లు ప్రెస్ మీట్లు పెట్టి వార్నింగ్ ఇచ్చేవారు. కానీ జ‌గ‌న్ వ‌రుస‌గా అధికారుల‌ను బెదిరిస్తున్నా పోలీసు అధికారుల‌ సంఘాల నేత‌లు ప‌ట్టించుకోక‌పోవ‌టంతో ప్ర‌జ‌లుసైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు కూట‌మి ప్ర‌భుత్వం కూడా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌టం లేద‌న్న వాద‌న ఉంది. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌గ‌న్ తీరుపై స్పందిస్తూ.. అధికారుల‌ను బెదిరిస్తే ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. అయినా జ‌గన్ ఏమాత్రం వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. అధికారం కోల్పోయినా అహంకార పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో జ‌గ‌న్‌పైచ‌ర్య‌లు తీసుకోవాల‌న్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.  జ‌గ‌న్‌ తీరుపై కూట‌మి ప్ర‌భుత్వం ఏ విధంగా స్పందిస్తుంద‌నేది వేచి చూడాల్సిందే.

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.