రాయచోటి, రాజన్నపేటల్లో బలిజలపైనే దేశం ఆశలు
Publish Date:Apr 20, 2012
Advertisement
కడపజిల్లా రాజన్నపేట, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయానికి తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా పావులను కదుపుతోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో బలిజ ఓటర్లు పెద్దసంఖ్యలో ఉన్నారు. అందుకే ఇక్కడ బలిజసామాజిక వర్గానికి చెందిన వ్యక్తులనే తెలుగుదేశం పార్టీ రంగంలోకి దింపింది. రాజన్నపేటలో మాజీమంత్రి పసుపులేటి బ్రహ్మయ్య పేరును రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడు కుమారుడు బాలసుబ్రహ్మణ్యం పేరును ఖరారు చేసింది. దీనివల్ల ఈ రెండు నియోజకవర్గాల్లో బలిజ ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీకే వస్తాయని పార్టీ నమ్మకం పెట్టుకుంది. ఈ రెండు స్థానాల్లో బాలసుబ్రహ్మణ్యం, బ్రహ్మయ్యకు తెలుగుదేశంపార్టీ టిక్కెట్టు ఇవ్వటం ద్వారా ఉప ఎన్నికల పోరులో త్రిముఖపోటీ హోరాహోరీగా సాగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవల మెహబూబ్ నగర స్థానంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల సమయంలో రౌండు రౌండుకు గెలుపు అవకాశం వేరువేరు పార్టీలకు ఎలా మారిందో ప్రస్తుతం రాయచోటి, రాజన్నపేటల్లో కూడా అలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. రాజన్నపేట టిడిపి అభ్యర్థి బ్రహ్మయ్య గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. అయితే 2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. పి.ఆర్.పి. కాంగ్రెస్ లో విలీనం అయిన తరువాత ఆయన పార్టీ కార్యకలాపాలకు అంటీఅంటనట్లు ఉంటున్నారు. బ్రహ్మయ్యకు ఉన్న కేడర్, ఓటుబ్యాంకును దృష్టిలో ఉంచుకుని చంద్రబాబునాయుడు ఆయన్ని పార్టీలోకి పిలిచి టిక్కెట్టు ఇవ్వటం విశేషం.
http://www.teluguone.com/news/content/cuddapah-district-bypolls-24-13495.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





