ఐతానగర్ రౌడీ బ్యాచ్ కు జగన్ పరామర్శ.. సంకేతమేంటి?

Publish Date:Jun 2, 2025

Advertisement

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెనాలి పర్యటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ప్రకటించిన షెడ్యూల్ మేరకు జగన్ మోహన్ రెడ్డి మంగళవారం (జూన్ 3) తెనాలిలో పర్యటించనున్నారు.   అయితే ఈ పర్యటన ఎందుకు అంటే..  ఇటీవల పోలీసులు బహిరంగంగా ముగ్గురు యువకులపై  జులుం చెలాయించిన ఘటనలో బాధితులను పరామర్శించడానికట. ఔను పోలీసులు ఇటీవల తెనాలి ఐతానగర్ లో ముగ్గురు యువకులకు బహిరంగంగా లాఠీ ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఆ ఘటనలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడంటూ వైసీపీ నానా హంగామా చేస్తున్నది. ఆ గాయపడిన యువకుడు జాన్ విక్టర్ ను పరామర్శించమే జగన్ తెనాలి పర్యటన ముఖ్య ఉద్దేశమట. ఇందు కోసం ఆయన సోమవారం సాయంత్రానికే బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకోనున్నారు. 

సరే ఇంతకీ పోలీసులు ఓపెన్ లాఠీ ట్రీట్ మెంట్ కు గురైన ముగ్గురు యువకులూ ఎవరంటే..  పలు కేసులలో నిందితులు. అన్నిటికీ మించి ఒక కానిస్టేబుల్ పై దాడి చేసి, బెదరించిన వారు. వారికి పోలీసులు ఇచ్చిన ట్రీట్ మెంట్ పట్ల ఐతానగర్ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. వారి ఆగడాలు భరించలేక పోతున్నామనీ, ఇప్పుడు పోలీసుల ట్రీట్ మెంట్ తోనైనా వారిలో భయం పుట్టి అరాచకాలకు స్వస్తి చెబుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలా ప్రజల దృష్టిలో దుర్మార్గులుగానూ, చట్టం దృష్టిలో నేరస్తులుగానూ ముద్రపడిన వ్యక్తులకు పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్ కు నిరసనగా, ఆ ట్రీట్ మెంట్ లో తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్న జాన్ విక్టర్ ను పరామర్శించడానికి జగన్ బయలుదేరారు. అయితే పోలీస్ ట్రీట్మెంట్ జరిగి వారం దాటిపోయింది. ఇప్పుడు హఠాత్తుగా జగన్ వారిని పరామర్శించడానికి రావడానికి కారణమేంటి? అంటే... దళితులపై పోలీసుల దౌర్జన్యం అంటూ కలర్ ఇచ్చి రాజకీయ లబ్ధి పొందానికే. 

జగన్ తెనాలి పర్యటన ప్రకటన వచ్చీ రావడంతోనే అన్నివర్గాల నుంచీ వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ  అధినేత.. రౌడీ షీటర్లను పరామర్శించడం ఎలాంటి సంకేతాలను ఇస్తుందన్న చర్చా మొదలైంది. వైసీపీలోనే పలువురు జగన్ పరామర్శ పర్యటనను వ్యతిరేకిస్తున్నారు.  క్రిమినల్స్ ను పరామర్శించడమంటే.. అలా పరామర్శిస్తున్న వారిది  కచ్చితంగా క్రిమినల్ మనస్తత్వమే అయి ఉంటుందని చెబుతున్నారు. 

వాస్తవానికి ఇప్పుడు జగన్ పరామర్శించనున్న వారు సజ్జనులు కాదు. కరుడుగట్టిన నేరస్తులు. గంజాయి బ్యాచ్ కు చెందిన వారు. గంజాయి స్మగ్లింగ్, అమాయకులపై దౌర్జన్యాలు, దాడులకు పాల్పడిన వారు. అది కూడదంటూ హెచ్చరించిన పోలీసుపైనే దాడికి పాల్పడిన వారు. అటువంటి వారిని పరామర్శించడానికి జగన్ తగుదునమ్మా అంటూ బయలు దేరడాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తప్పుపట్టారు. వారిని పరామర్శించడం ద్వారా జగన్ పార్టీ శ్రేణులకు ఎలాంటి సందేశం ఇవ్వదలచుకున్నారని నిలదీశారు.   

By
en-us Political News

  
రాదు..రానివ్వం..! వైసీపీ విషయంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఏపీలో రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శంకుస్థాపన చేశారు.
తిరుమల ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ఎన్‌ఆర్‌ఐ తోట చంద్రశేఖర్‌ రూ.కోటి విరాళం అందించారు. టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడును ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి దీనికి సంబంధించిన చెక్కును అందజేశారు.
హైదరాబాద్ గచ్చిబౌలి‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలిలోని ఐఎస్ బీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న నిఖిల్ మదన్ 17వ అంతస్తు బాల్కనీ నుంచి కిందికి దూకాడు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజ‌య‌వాడ‌ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో గురువారం నుంచి వారాహి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ఈవో శీనానాయక్ దంపతులు తొలి సారెను సమర్పించారు.
రైలు పట్టాలపై కారు నడుపుతూ యువతి హల్‌చల్‌ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని నాగుపల్లి-శంకర్‌పల్లి మార్గంలో రైలు పట్టాలపై కారు నడుపుతూ వెళ్లింది.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ బైపాస్‌లోని దుర్గాపురం వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న ఒక కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ఉత్తరాఖండ్‌ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అలకనందా నదిలో పర్యాటకుల బస్సు పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది గల్లంతయ్యారు.
తెలంగాణ‌లో ఆషాడ‌మాస బోనాలు నేటి నుండి ప్రారంభం అయ్యాయి. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు భోనాల పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు.
పూరి జగన్నాథ ఆలయం. అంతుచిక్కని రహస్యాల గని. ఈ ఆలయంపై ఏ సమయంలోనూ నీడ పడక పోవడం ఒక ప్రాకృతిక విచిత్రి.
కారు కిందపడ్డ సింగయ్యను వదిలేసి ఎలా ముందుకు వెళ్లారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. మాజీ సీఎం జగన్ జగన్‌ చేసే ర్యాలీలు, బల ప్రదర్శనలను నిషేధించాలని షర్మిల తెలిపారు.
గ్లోబల్ క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా అమరావతిని మార్చేందుకు ఉన్న అవకాశాలపై అమరావతి క్వాంటం వ్యాలీ, క్వాంటం టెక్నాలజీలపై నేషనల్ వర్క్ షాప్ ను ప్రభుత్వం నిర్వహించనుంది.
వాయువ్య బంగాళాఖతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన కారణంగా రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.