సిపిఎం కు పోటీగా సిపీఐ న్యూస్ ఛానల్
Publish Date:May 22, 2012
Advertisement
సిద్ధాంతపరమైన వైరుధ్యాలతో పరస్పరం కలహించుకునే రాష్ట్రంలోని సిపీఐ, సిపిఎం పార్టీలు త్వరలో మరో పోటీకి సన్నాహాలు చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్ న్యూస్ చానళ్ళ ప్రాదాన్యతను ఆలస్యంగా గమనించిన సిపిఎం త్వరలో ఒక తెలుగున్యూస్ ఛానల్ ను ప్రారంబించాలని నిర్ణయించింది. ఈ ఛానల్ ఏర్పాటు బాధ్యతనంతా పార్టీ మాజీ ఎమ్మెల్యే తమ్మినేని వీరభద్రంకు అప్పగించింది. ఈ విషయం బయటికి తెలిసిన వెంటనే రాష్ట్రంలోని సిపీఐ నాయకుల్లో కలవరం మొదలైంది. అన్నింటిలోనూ సిపిఎం తో పోటీ పడుతున్న తామూ న్యూస్ ఛానల్ విషయంలో వెనుకబడితే ఎలా అనుకున్నారో ఏమో కానీ వెంటనే రంగంలోకి దిగారు. కేంద్ర నాయకత్వం అనుమతి తీసుకున్నారు. రాష్ట్రంలో సిపీఐ తరుపున తెలుగున్యూస్ ఛానల్ ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి ప్రస్తుత అంచనాల ప్రకారం పూర్తిస్థాయిలో శాటిలైట్ న్యూస్ ఛానల్ ప్రారంభించాలంటే 40 నుంచి 50కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఆ డబ్బులు కొంత చందాల రూపంలో వస్తూలు చేస్తే మిగిలినది బ్యాంకు రుణాలుగా తీసుకోవాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీలకు లేని ఆస్తులు ఈ రెండు కమ్యూనిస్టు పార్టీలకూ ఉన్నాయి. ఈ రెండు పార్టీలకూ పట్టాన, నగర, మండల స్థాయిల్లో కూడా సొంత భూములు ఉన్నాయి. ఈ ఆస్తుల విలువ వందల కోట్లలో ఉంటుంది. అవసరమైతే బ్యాంకులకు ఈ ఆస్తుల్లో కొంతభాగాన్ని ష్యూరిటీ పెట్టి దాంతో చానల్ పెట్టాలని కమ్యూనిస్టుపార్టీల నాయకులు యోచిస్తున్నట్లు తెలిసింది.
http://www.teluguone.com/news/content/cpm-vs-cpi-24-14205.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





