దేశంలో నల్లధనాన్ని అరికట్టాలన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్రమోడీ 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో దేశంలో ఒక్కసారిగా సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ నానా ఇబ్బందులూ పడ్డారు. 2016 నవంబర్ 8న ప్రధాని పెద్ద నోట్లు రద్దు చేసినట్లు ప్రకటించారు. సరిగ్గా ఆ ఆ రోజు నుంచి రెండు నెలల పాటు దేశంలోని ప్రజలంతా బ్యాంకుల ముందు క్యూలలో నిబబడి కొద్ది మొత్తం తమ ఖాతాల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవడమే రోజు వారీ కార్యక్రమంగా మారిపోయింది. రోజు వారీ అవసరాలకు కూడా సొమ్ములు లేక జనం నానా ఇబ్బందులూ పడ్డారు. అయినా దేశంలో నల్లధనం లేకుండా పోతుంది, ఉగ్ర కార్యకలాపాలు తగ్గుముఖం పడతా యన్న ఆశతో ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొన్నారు.
అయితే నల్లధనం లేకుండా చేయాలన్న మోడీ ఉద్దేశం పెద్ద నోట్ల రద్దుతో ఎంత వరకూ నెరవేరిందో తెలియదు కానీ, పాత నోట్లు రద్దు చేసి కొత్త నోట్లు చెలామణిలోకి వచ్చిన ఇన్నేళ్ల తరువాత కూడా దేశంలో దొంగనోట్ల చెలామణి యథేచ్ఛగా సాగుతోంది. ప్రధానంగా ఇప్పుడు భారత కరెన్సీలో అత్యధికంగా చెలామణిలో ఉన్న రూ.500 నోట్లలో అసలు నోటేదో, నకిలీ ఏదో గుర్తుపట్టడం దాదాపు అసాధ్యంగా మారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. పెద్ద మొత్తంలో రూ.500 నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయి. ఈ నోట్లలో అసలేదీ, నకిలీ ఏదీ అని గుర్తుపట్టడం కష్ట సాధ్యంగా ఉందని బ్యాంకులే చెబుతున్నాయి. అంత పకడ్బందీగా నకిలీ నోట్లు ముద్రిస్తున్నారని అంటున్నారు. రూ.500ల నోట్లలో అసలుకూ నకిలీకీ తేడా ఏమిటో సామాన్యలు గుర్తించడం చాలా చాలా కష్టమని అంటున్నారు. అయితే అసలులో రిజర్వ్ బ్యాంక్ స్పెల్లింగ్ కరెక్టుగా ఉంటే నకిలీ నోటులో ఆ స్పెల్లింగ్ చిన్న తప్పు ఉందనీ, అసలేదో, నకిలీ ఏదో తెలుసుకోవడానికి అదో మార్గమనీ చెబుతున్నారు.
అసలు నోటులో రిజర్వ్ బ్యాంకు అన్న స్పెల్లింగ్ కరెక్టుగా ఉంటే నకిలీ నోటులో రిజర్వ్ బ్యాంకు స్పెల్లింగ్ ఆర్ఇఎస్ఏఆర్ విఇ అని ఉంటుందని చెబుతున్నారు. అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న భారత్ లో ఈ తేడాను గుర్తించగలిగేది ఎందరు? అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. మొత్తం మీద పెద్ద నోట్ల రద్దు తరువాత కూడా దేశంలో నకిలీ నోట్లు ఏ మాత్రం తగ్గలేదనీ, నోట్ల రద్దుతో మోడీ సాధించిందేమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/counterfeit-500-rupee-notes-39-190858.html
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.