Publish Date:Jul 21, 2020
ప్రపంచమంతా ఎదురుచూస్తున్న కోవిద్ 19 వైరస్ ను ఎదుర్కొనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేస్తుంది. కోట్లాదిమందికి సోకి లక్షలాది మందిని బలితీసుకున్న ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు పలుదేశాల్లో 140పైగా పరిశోధనలు జరుగుతున్నాయి. వివిధ దశల్లో ఉన్న ఈ పరిశోధనల్లో సైంటిస్ట్ లంతా నిమగ్నమయ్యారు. అహోరాత్రులు కష్టపడి చేస్తున్న ఆ పరిశోధనల ఫలితాలు అతి త్వరలోనే మానవాళికి అందుబాటులోకి రానున్నాయి.
తొలి వ్యాక్సిన్ సిద్దం చేసిన రష్యా
కోవిద్ 19 వైరస్ తో బాగా ప్రభావితమైన రష్యా వ్యాక్సిన్ తయారిలో చాలా చురుగ్గా పరిశోధనలు నిర్వహిస్తోంది. రష్యాప్రభుత్వం వ్యాక్సిన్ తయారీని ప్రతిష్టాత్మకంగా భావిస్తూ పరిశోధనలను వేగవంతం చేయడానికి కావల్సిన ఏర్పాట్లు చేసింది. 1,2 దశల క్లినికల్ ట్రయల్స్ గతంలోనే పూర్తి చేసిన సెచెనోవ్ విశ్వవిద్యాలయం ఇప్పుడు మూడోదశ క్లినికల్ ట్రయల్స్ ను కూడా విజయవంతంగా నిర్వహించింది. అన్ని పరీక్షలు మంచి ఫలితాలను ఇచ్చాయని.. ఆగస్టు 3 నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువస్తామని రష్యా ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు. మూడు కోట్ల డోస్ లను దేశీయంగా తయారు చేస్తామని మరో 17కోట్ల డోస్ లు విదేశాల్లో తయారు చేస్తమని ఆయన తెలిపారు. ఈ వ్యాక్సిన్ తమతమ దేశాల్లో తయారు చేయడానికి ఐదు దేశాలు ఇప్పటికే అంగీకరం తెలిపాయన్నారు.
త్వరలోనే ఫలితాలు..
కోవిద్ 19 వైరస్ ను ఎదుర్కోనే వ్యాక్సిన్ పై లండన్ లోని ఆక్సఫర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రయోగాలు విజయవంతమయ్యాయి. వారు తయారు చేసిన ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కోవిద్ 19 వైరస్ తో సమర్థవంతంగా పోరాడగలదని ప్రకటించారు. చాలా సురక్షితమైన తమ వ్యాక్సిన్ వైరస్ను తట్టుకునే వ్యాధి నిరోధక శక్తి ని ఇస్తుందన్నారు. తమ పరిశోథనల ఫలితాలను ది లాస్సెట్ మెడికల్ జర్నర్ లో ప్రచురించారు. మొదటి దశ, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి అయ్యాయని, చివరి దశగా వృద్దులపై వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నయన్నారు. ఈ ఏడాది చివరి వరకు పూర్తి ఫలితాలు వస్తాయన్నారు.
తొలిదశ ప్రారంభం
భారత్ లో కోవిద్ 19 వైరస్ ను అరికట్టే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమైనవి. కాస్త ఆలస్యంగా క్లినికల్ ట్రయల్స్ మొదలైనా.. విజయవంతంగా కొనసాగుతున్నాయి. దేశంలోని భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ ఫస్ట్ డోస్ 12 చోట్ల 60మంది వాలంటీర్లపై తొలిదశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని నిమ్స్ లో ఇద్దరు వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్ ఇచ్చారు. 14రోజుల తర్వాత ఫలితాలు వస్తాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/coronavirus-vaccine-coming-soon-39-101676.html
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.