వరంగల్ డిక్లరేషన్ తో కాంగి ‘రేసు’

Publish Date:May 21, 2022

Advertisement

వరంగల్ డిక్లరేషన్ తో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. టీఆర్ఎస్, బీజేపీలపై ఘాటు విమర్శలతో చెలరేగిపోతున్నది. కాంగ్రెస్ కు సహజ రుగ్మతలుగా చెప్పుకునే అంతర్గత విభేదాలను దాటి జనంలోకి దూకుడుగా వెళ్లేలా వరంగల్ డిక్లరేషన్ తో స్కెచ్ వేసుకుంది. టీఆర్ఎస్ సర్కార్ అత్యంత ప్రతిష్ఠత్మకంగా ప్రారంభించిన థరణి పోర్టల్ కుప్పుస్వామి మేడ్ డిఫికల్టీలా తయారైందన్న విమర్శలతో రైతులకు చేరువయ్యే వ్యూహాన్ని అమలు చేస్తున్నది. ధరణి పోర్టల్ వల్ల రైతుల ఇబ్బందులు రెట్టింపయ్యాయన్న విమర్శలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిని టీఆర్ఎస్ ప్రభుత్వానికి కల్పించింది.  ధరణి పోర్టల్ కు ముందు పరిస్థితే మేలని రైతులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ కు ధరణి పోర్టల్ వల్ల నష్టం తప్పేటట్లు లేదని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు. సరిగ్గా ఈ పరిస్థితినే కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకునేలా వ్యూహ రచన చేసి దూసుకుపోతున్నది.  ధరణి వల్ల రైతుల ఇబ్బందులను గమనించిన కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తామని హామీ ఇస్తున్నది. అదే సమయంలో రాష్ట్రంలో దూకుడు పెంచిన బీజేపీ ధరణిపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించడంలో వెనుక బడింది. రాహుల్ గాంధీ వరంగల్ సభలో టీఎస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధరణిపై చేసిన  ప్రకటనకు    రైతుల నుంచి మంచి స్పందన వచ్చిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను తీసేస్తామన్న తమ హామీని మరింతగా ప్రజలలోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రైతు కష్టాలను అడ్రస్ చేయడంలో కాంగ్రెస్ బీజేపీ కంటే మెరుగ్గా, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.

వరంగల్ డిక్లరేషన్ తో రైతులలో విశ్వాసాన్ని పొందామని భావిస్తున్న కాంగ్రెస్ ఆ దిశగా మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో త్రిముఖ పోరు అనివార్యమని భావిస్తున్న నేపథ్యంలో రైతు సమస్యలపై కాంగ్రెస్ సీరియస్ గా పని చేయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే రచ్చ బండ కార్యక్రమంలో ధరణి పోర్టల్ వల్ల రైతుల ఇబ్బందులపై ప్రముఖంగా ప్రస్తావించాలని నిర్ణయించుకుంది.  వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతులు పండించే పంటకు మద్దతు ధర కల్పించడంతో పాటు కౌలు రైతులకు పంట రుణమాఫీ అమలు హామీలపై రైతులలో కాంగ్రెస్ పట్ల సానుకూలత వ్యక్తమౌతున్నదన్న పరిశీలకుల విశ్లేషణలతో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది.

కొనుగోలు కేంద్రాల పేరుతో తెలంగాణ సర్కార్ రైతులను దగా చేసిందనీ, కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో అకాల వర్షాలకు రైతుల తీసుకు వచ్చిన ధాన్యం తడిసి ముద్దై నష్టాలలో కూరుకుపోయారనీ కాంగ్రెస్ విమర్శిస్తున్నది. అన్నిటికీ మించి ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రం పరస్పర విమర్శలతో విలువైన కాలాన్ని వృధా చేసి రైతులతో అయోమయం నెలకొల్పారని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణలో రైతులు ధాన్యం కల్లాల వద్ద మరణిస్తుంటే..వారి వైపు కన్నెత్తి చూడని  సీఎం కేసీఆర్   పంజాబ్ రైతులకు ఆర్థిక సాయం చేయడానికి వెళ్లడాన్ని ప్రశ్నిస్తోంది.  

సరిగ్గా ఆ అంశంలోనే రాష్ట్రంలో రైతులు కూడా కేసీఆర్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలలోనే చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో సమస్యలను గాలికి వదిలేసి జాతీయ రాజకీయాలంటూ సీఎం చేస్తున్న ప్రసంగాల పట్ల జనంలో పెద్దగా స్పందన రావడంలేదనీ, పైపెచ్చు ఆయన జాతీయ అంశాలు ప్రస్తావించే  ప్రతి సారీ జనం రాష్ట్ర సమస్యలపై ప్రశ్నలు సంధిస్తున్నారనీ పరిశీలకులు ఉదాహరణలతో విశ్లేషణలు చేస్తున్నారు.

సరిగ్గా ఈ అంశాన్నే కాంగ్రెస్ అందిపుచ్చుకుని జాతీయ పార్టీగా తాము ప్రాంతీయ అంశాలపై పోరాడుతున్నామని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నది.  కేంద్రం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందనీ, కేసీఆర్ రాష్ట్ర సమస్యలను విస్మరించి దేశం పట్టుకు తిరుగుతున్నారన్న విమర్శలతో దూకుడుగా ప్రజలలోకి వెళుతోంది.  కాంగ్రెస్ లో ఈ జోష్.. ప్రజలను ఆ పార్టీకి చేరువ చేస్తుందా.. లేక పార్టీలో అంతర్గత విభేదాలు, నేతల మధ్య భేదాభిప్రాయాలతో మర మారు ప్రజల ముందు పలుచన అవుతుందా వేచి చూడాలి.

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
పవన్ కళ్యాణ్‌పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్  అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్..  రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం  4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు.
గతంలో మాతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు పెట్టుకుంటే మూతిపళ్ళు రాలుతాయని కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని కట్టుకోవడం చేతకానివాళ్ళు, తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
అరవ శ్రీధర్‌పై ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన నాయకత్వం దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
పోలీసులు జనసేన సభకు నో చెప్పారు. వేలాది మంది అభిమానులు, వందలాది మంది ముఖ్య నాయకులు హాజరయ్యే ఇటువంటి కీలక సభకు చివరి నిమిషంలో పర్మిషన్ నిరాకరించడంపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత.. భవిష్యత్తు కార్యాచరణను చర్చించేందుకు ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై సీనియర్ రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ తో తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
తెలుగువన్ వేదికగా జరిగిన ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ముఖ్యంగా దేశ యువతను పారసైట్లు, కాక్రోచ్‌లు అనడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.