Publish Date:Apr 27, 2022
దేశంలోనే సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ, స్వాతంత్ర్య సంగ్రామంలో ముందు పీఠిన నిలిచిన పార్టీ..దేశంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ....దాదాపు 5 దశాబ్దాలు దేశ రాజకీయాలనుశాశించిన పార్టీ.. వందేళ్లకుకు పైబడిన చరిత్ర ఉన్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ పరువు ఒక్క ట్వీట్..ఒకే ఒక్క ట్వీట్తో గంగలో నిండా మునిగింది. ఆ ట్వీట్ చేసినది ఎన్నికల వ్యూహకర్తగా ఇటీవల గుర్తింపు పొందిన పీకేఅనబడే ప్రశాంత్ కిశోర్. ఆయన ట్వీట్ వటవృక్షం లాంటి కాంగ్రెస్ కూకటి వేళ్లను వణికించింది. ఇంతకీ ఆయనా ట్వీట్ లో ఏమన్నారంటే...కాంగ్రెస్ కు నాయకుడు కావాలి అని మాత్రమే. ఆ ఒక్క మాట కాంగ్రెస్శ్రేణుల ఇన్నేళ్ల ధీమానూ కకావికళం చేసింది.
ఆ పార్టీ అధినాయకత్వం ఆత్మ విశ్వాసాన్నే దెబ్బ తీసింది. గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉంది. ఈ పదేళ్ల కాలంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆపార్టీకి పరాభవమే ఎదురౌతోంది. పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఒక్కటొక్కటిగా చేజారి పోతున్నాయి. ఈ పరిస్థితుల్లో అధికారమే లక్ష్యంగా ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను ఆశ్రయించింది.పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వ్యూహాలు రూపొందించాలని కోరింది. ఈ క్రమంలోనే ప్రశాంత్కిశోర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సహా ఆ పార్టీ కోర్ నాయకులతో వరసగా భేటీలు జరిపారు. ఇంత
వరకూ బాగానే ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ వచ్చే ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పని చేసేందుకుఏర్పాటు చేసిన సాధికార కమిటీలో భాగమై పని చేయాల్సిందిగా స్వయంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పీకేను ఆహ్వానించారు. ఇక్కడ వరకూ బానే ఉంది...అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఆహ్వానానికి పీకే స్పందించిన తీరే కాంగ్రెస్ పరువు ప్రతిష్టలను నడి బజార్లో నిలబెట్టేసింది. పార్టీని నవ్వుల పాలు చేసింది. వ్యూహకర్తను పార్టీలోకి ఆహ్వానించే విషయంలో ఆ పార్టీ వ్యూహాత్మక వైఫల్యం పార్టీ అధినేత్రి ప్రతిష్టను పలుచన చేసింది.
ఇంతకీ పీకే...సోనియా ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ...చేసిన ట్వీట్ లో పేర్కొన్న అంశాలే ఆ పార్టీ నాయకత్వాన్ని తలెత్తుకోనీయకుండా చేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి కావలసింది తన లాంటి వ్యూహ కర్తలు కాదనీ, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసి, పార్టీ శ్రేణులను ఏకతాటిపై నడిపించగలిగిన సమర్థ నాయకత్వం కావాలని పీకే సోనియా గాంధీ ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు. పార్టీకి సమర్థ నాయకత్వం లేదనీ సాక్షాత్తూ ఆ పార్టీ అధినేత్రికే ట్వీట్ చేశారు. ఇది రాజకీయంగా కాంగ్రెస్ కు అంత త్వరగా తేరుకోవడానికి వీలులేని పెద్ద ఎదురు దెబ్బగానే రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా ఇప్పటి వరకూ కాంగ్రెస్ అధినాయకత్వంపై ధిక్కారం కేవలం జీ-23 బృందానికే పరిమితమైంది. ఇక ఇప్పుడు అది మరింతగా విస్తరించే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.ఒక వైపు సోనియా గాంధీ, పీకే చర్చలు జరుగుతున్న సమయంలోనే పీకేను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకుల నుంచి ప్రకటనలు రావడం, వ్యతిరేక ప్రదర్శనలు వెల్లువెత్తడమే ఇందుకు నిరసనగా వారు చూపుతున్నారు. ఏది ఏమైనా సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ యేతర కూటమి ఏర్పాట్లు, బీజేపీని దీటుగా ఎదుర్కోవాలన్న కాంగ్రెస్ యత్నాలకు ఇది పెద్ద ఎదురు దెబ్బే!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-prestige-drowned-with-only-one-tweet-25-135097.html
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.