జైపాల్ రెడ్డిని కాంగ్రెస్ అందుకే ముందుకి తెచ్చిందా?

Publish Date:Nov 18, 2013

Advertisement

 

తెలంగాణాపై గత పదేళ్లుగా ఉద్యమాలు చేసిన తెరాసను చివరికి రాష్ట్ర ఏర్పాటు సాకారం కానున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పక్కన పడేసి మొత్తం వ్యవహారమంతా స్వంత పార్టీ వ్యవహారంగా నడిపిస్తుండటం చూస్తే అది ఉద్దేశ్య పూర్వకంగానే చేస్తున్నట్లుంది. విభజనపై నిర్ణయం తీసుకొనే సమయంలోనే కేసీఆర్ ను పక్కనపెట్టిన కాంగ్రెస్ అధిష్టానం ఆ తరువాత అతనిని దారికి తెచ్చుకొనేందుకు కొన్ని ప్రయత్నాలు చేసింది. కానీ అతను కాంగ్రెస్ తో చేతులు కలపడం కంటే ఒంటరిగా పోటీకి దిగేందుకే సిద్దపడుతున్నట్లు స్పష్టమయిన సంకేతాలు పంపడంతో, అతనిని నిలువరించేందుకే కేంద్ర మంత్రిని జైపాల్ రెడ్డిని రంగంలోకి దింపి, అతనిని ముందు ఉంచుకొని ముందుకు సాగుతోంది. తెలంగాణా ప్రజలలో మంచి పేరు, మచ్చలేని చరిత్ర, అపార రాజకీయ అనుభవజ్ఞుడయిన జైపాల్ రెడ్డిని విమర్శించడం వల్ల తెరాసకు లాభం కంటే నష్టమే ఎక్కువని గ్రహించినందునే బహుశః ఆయనని ఆకస్మాతుగా ముందుకి తీసుకువచ్చి ఉండవచ్చును.

 

తన ప్రమేయం లేకుండా డిల్లీలో ఇంత హడావుడి జరుగుతున్నప్పటికీ, తెరాస నోరు విప్పలేకపోవడానికి బహుశః ఇది కూడా ఒక కారణమయి ఉండవచ్చును. బహుశః ఆయనను కాంగ్రెస్ అధిష్టానమే ముందుకు తెచ్చిన కారణంగానే ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న అనేకమంది టీ-కాంగ్రెస్ నేతలు సామాజికన్యాయం అంటూ ఎంతగా గొంతు చించుకొంటునపటికీ, ఆయన రాకను, అత్యుత్సాహాన్నిఅడ్డుకోలేక చివరికి వ్యవహారమంతా ఆయన చేతుల్లో పెట్టి, ఆయన దర్శకత్వంలో ముందుకు సాగుతున్నట్లుంది.

 

ప్రస్తుతం తెరాస వెనక్కి తగ్గినట్లు కనబడుతున్నపటికీ, అది కేవలం తగిన అవకాశం కోసం ఎదురుచూస్తోంది. రేపు కేంద్రమంత్రుల బృందం తెలంగాణా ప్రజల అభీష్టానికి వ్యతిరేఖంగా  ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. అప్పుడు అదే సాకుతో తెరాస జైపాల్ రెడ్డిపై కూడా తన అస్త్ర శాస్త్రాలు ఎక్కుబెట్టవచ్చును.

By
en-us Political News

  
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీల్లో పల్నాడు జిల్లా నేతలకు సముచిత ప్రాధాన్యత దక్కింది.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.