తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. వెండితెరపై తిరుగులేని చక్రవర్తిగా వెలిగిన దళపతి విజయ్, ఇప్పుడు రాజకీయ పీఠంపై కూడా తన మార్క్ చూపిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్, అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే సంచలన నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ముందుకు సాగుతున్నారు. సాధారణంగా రాజకీయాల్లో ఒక సంప్రదాయం బలంగా కొనసాగుతోంది. ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసి గెలిచినప్పుడు లేదా పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తినప్పుడు.. సీనియర్ నాయకులను బుజ్జగించడానికి ఉప ముఖ్యమంత్రి పదవులను పంచుతుంటారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించి రికార్డు సృష్టించారు. ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన, శక్తిమంతమైన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ డైనమిక్ రోల్ పోషిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ పదవిని, దళపతి విజయ్ మాత్రం పూర్తిగా పక్కన పెట్టేసి అందరికీ షాక్ ఇచ్చారు.
తమిళనాడులో మిత్రపక్షాల మద్దతుతోనే విజయ్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ, ఆయన ఒక్కరికి కూడా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వలేదు. కూటమిలోని భాగస్వామ్య పక్షాల నుంచి డిప్యూటీ సీఎం పదవి కోసం గట్టి ఒత్తిడి వచ్చినప్పటికీ, విజయ్ తన నిర్ణయానికే కట్టుబడ్డారు. మరి మిత్రపక్షాలను ఆయన ఎలా ప్రసన్నం చేసుకున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కూటమి నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన విజయ్, వారికి డిప్యూటీ సీఎం పదవులకు బదులుగా కేబినెట్లో కీలకమైన మంత్రిత్వ శాఖలను కేటాయించి పరిస్థితిని చాలా చాకచక్యంగా సర్దుబాటు చేశారు. ఈ వ్యూహాత్మక అడుగు వెనుక దళపతి విజయ్ ఒక బలమైన రాజకీయ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు స్పష్టమవుతోంది. అధికార వికేంద్రీకరణ పేరుతో పాలనలో గందరగోళం ఏర్పడకూడదని, ప్రభుత్వంలో ఎలాంటి రాజకీయ జోక్యాలు లేకుండా నేరుగా తన నియంత్రణలోనే నిర్ణయాలు సాగాలని ఆయన భావిస్తున్నారు.
ఒకే ప్రభుత్వంలో ఎక్కువ మంది పవర్ సెంటర్లు ఉంటే, భవిష్యత్తులో పాలనాపరమైన ఇబ్బందులు వస్తాయని, ముఖ్యంగా కూటమి ప్రభుత్వాల్లో ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయని విజయ్ భావిస్తున్నారు. అందుకే, ఎటువంటి డైవర్షన్స్ లేకుండా ఒక స్థిరమైన, బలమైన, స్పష్టమైన పారదర్శక పాలనను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. తమిళ రాజకీయాల్లో కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాలు ఒంటిచేత్తో రాష్ట్రాన్ని ఏలిన తరహాలోనే, తాను కూడా పూర్తి అధికారంతో, ఎలాంటి రాజీ పడకుండా ముందుకెళ్లాలని విజయ్ డిసైడ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ లాంటి క్రేజ్ ఉన్న నేత ఏపీలో డిప్యూటీ సీఎంగా సక్సెస్ అవుతున్న తరుణంలో, విజయ్ తీసుకున్న ఈ 'నో డిప్యూటీ సీఎం' పాలసీ తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. ఈ వినూత్న పొలిటికల్ స్ట్రాటజీ విజయ్ ప్రభుత్వానికి ఎంతవరకు స్థిరత్వాన్ని ఇస్తుందో చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-vijay-clarify-on-deputy-cm-post-25-221431.html
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
పవన్ కళ్యాణ్పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్ అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్.. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు.
గతంలో మాతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు పెట్టుకుంటే మూతిపళ్ళు రాలుతాయని కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజధాని కట్టుకోవడం చేతకానివాళ్ళు, తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
అరవ శ్రీధర్పై ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన నాయకత్వం దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
పోలీసులు జనసేన సభకు నో చెప్పారు. వేలాది మంది అభిమానులు, వందలాది మంది ముఖ్య నాయకులు హాజరయ్యే ఇటువంటి కీలక సభకు చివరి నిమిషంలో పర్మిషన్ నిరాకరించడంపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత.. భవిష్యత్తు కార్యాచరణను చర్చించేందుకు ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై సీనియర్ రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ తో తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
తెలుగువన్ వేదికగా జరిగిన ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ముఖ్యంగా దేశ యువతను పారసైట్లు, కాక్రోచ్లు అనడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.