క్లారిటీ లేని పొత్తులా? ప్రత్యర్థులని ముప్పుతిప్పలు పెట్టడమా?

Publish Date:Jun 20, 2023

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ది క్లారిటీ లేని రాజకీయమా?, క్లారిటీ లేకనే ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతుంటారా?, ఆ క్లారిటీ లేకనే మొన్నటి వరకు సీఎం అయ్యేందుకు రాజకీయాల్లోకి రాలేదని.. ఇప్పుడు తానే సీఎం అభ్యర్థిని అనేలా మాట్లాడుతున్నారా? అంటే ఆయన రాజకీయ ప్రత్యర్ధులు అవుననే అంటారు. మరి నిజంగానే ఆయన క్లారిటీ లేకనే ఇప్పుడు తానే సీఎం అభ్యర్థిని అనేలా మాట్లాడుతున్నారా?  అంటే ముమ్మాటికీ కాదని చెప్పాలి.  ఇంకా చెప్పాలంటే పవన్ ఇప్పుడు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు మొదలు పెట్టారు. అందుకు తగ్గట్లే ఒక్కోసారి ఒక్కోలా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఇది అర్ధం చేసుకోవాలంటే కాస్త లోతుగా వెళ్లి విశ్లేషణ చేసుకోవాలి.

పవన్ జనసేన పార్టీ పెట్టిన తొలిసారి ఎన్నికలలో ఆయన పోటీ చేయనే లేదు. టీడీపీ-బీజేపీ కూటమికి సహకరించి వారి విజయానికి అంతో ఇంతో సహకరించారు. అయితే ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో గత 2019 ఎన్నికలలో ఆయన సింగిల్ గా పోటీ చేసి పరాజయం పాలయ్యాడు. ఓటమి మాత్రమే కాదు.. రాజకీయంగా ఆయన లెక్కలు కూడా తప్పేనని ఈ ఎన్నికలలో తెలిసొచ్చింది. దీంతో దీర్ఘకాలిక రాజకీయాల మీద ఫోకస్ పెట్టిన పవన్ జాతీయస్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తుకి సిద్దమై.. 1+1=2 ఫార్ములాతో బలం పెంచుకున్నారు. ఇక ఎన్నికలకు రెండేళ్ల ముందు నుండే ఈ సారి తప్పు చేయబోనని, వైసీపీకి అధికార దక్కనివ్వమని, అందుకోసం తాను ఒక మెట్టు దిగేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. ఇప్పటికీ అదే మాట చెప్తున్నారు.

అయితే, ప్రస్తుతం తన వారాహీ వాహనంతో పర్యటన సాగిస్తున్న పవన్  కాకినాడలో మాట్లాడుతూ.. మీరు ఆశీర్వదిస్తే సీఎం అవుతానని.. మీరు కోరుకుంటే తానే సీఎం అభ్యర్థిని అవుతా అంటూ మాట్లాడారు. దీంతో మెయిన్ స్ట్రీమ్ మీడియా నుండి సోషల్ మీడియా వరకూ ఎవరికి వారు పొత్తుపై పవన్ పునరాలోచన చేస్తున్నారని, పొత్తు వ్యవహారం చెడిందని  విశ్లేషణలు మొదలు పెట్టారు. కానీ, ఇక్కడ అర్ధం చేసుకోవాల్సింది.. పవన్ మాటలకు అర్ధాలే వేరులే అని. ఆ అర్ధం ఏంటో కాదు.. టీడీపీతో  కలిసి నడిచేది గ్యారంటీ అని ఎప్పుడో విడమర్చి చెప్పేశారు. కానీ, లెక్కలు.. సీట్లు.. పదవుల బేరం ఇంకా ఏదీ తేలలేదు. అవి తేల్చాల్సిన సమయం దగ్గర పడుతుంది. అందుకే పవన్ మార్క్ స్ట్రాటజీగా దీన్ని చూడాలి.

ఎవరు ఎన్ని అనుకున్నా.. రాజకీయం రాజకీయమే కదా. ఎంత పొత్తు అయినా.. నాలుగు సీట్లు ఎక్కువగా దక్కించుకోవాలనుకోవడం రాజకీయ పార్టీ ధర్మం. అదే ఇప్పుడు పవన్ చేస్తున్నది. దీనికి తోడు జనసైనికులు పవన్ కళ్యాణ్ ను ఎప్పుడూ రాజకీయ నేతగా చూడరు. వెండితెర మీద ఆయన్ని హీరోగా చూసిన అభిమానులు రాజకీయాలలో కూడా ఆయన్ను హీరోగా (సీఎం) చూడాలని ఆశపడుతుంటారు. ఒక్కో సందర్భంలో అభిమానుల నినాదాలు శృతి మించిన సమయంలో పవన్ కూడా తనకి కూడా సీఎం కావాలనే ఉందంటూ అభిమానులను ఉత్సాహపరుస్తుంటారు. అలా తానే సీఎం అనే టాక్ ఎంత పబ్లిక్ లోకి వెళ్తే రేపు పొత్తులలో జనసేనకి అంత డిమాండ్ పెరుగుతుంది. ఆ కారణంగానే పవన్ ఇప్పుడు సీఎం నినాదాన్ని ఎత్తుకున్నట్లు అర్ధం చేసుకోవచ్చు.

పైగా, ఈ మధ్య కాలంలో అధికార వైసీపీ టీడీపీ, జనసేనలను కలిపే మాట్లాడుతోంది. పవన్ కళ్యాణ్ మీద ఒంటి కాలిపై విమర్శలకు దిగుతున్న వైసీపీ నేతలు, టీడీపీని గెలిపించేందుకు మాత్రమే  పవన్ రాజకీయం పరిమితమైందని విమర్శలు  చేస్తున్నారు. ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది కనుక ఈలోగా ఇలా తానే సీఎం అనే  మాట ద్వారా ప్రత్యర్థుల విమర్శలకు బ్రేక్ వేసినట్లౌతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుకే పవన్ అప్పుడప్పుడూ ఇలా ప్రత్యర్థులకు నోటి నిండా మాట్లాడుకోవడానికి స్టఫ్ ఇస్తుంటారు. దాన్నే నమ్ముకొని ప్రత్యర్ధులు పండగ చేసుకుంటుంటారు. కానీ, నిజానికి పవన్ టార్గెట్ 2029 మాత్రమే. ఇప్పటికే వేలసార్లు ఈ మాట చెప్పినా.. అప్పుడప్పుడు ఇలా చిన్నా చితకా ప్రచారాలకు విపక్షాలు పండగ చేసుకోవడమే ఆసక్తి  కలిగించే అంశం.

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.