ముదిరిపాకాన పడ్డ మహా రాజకీయం

Publish Date:Nov 27, 2024

Advertisement

మహారాష్ట్ర రాజకీయం ముదిరి పాకాన పడింది. ఓ వైపు అనూహ్య విజయం సాధించిన బీజేపీ కూటమి పార్టీలలోనూ విభేదాలు పొడసూపాయి. అలాగే ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ కూటమిలోనూ లుకలుకలు మొదలయ్యాయి. ముందుగా బీజేపీ కూటమి విషయానికివస్తే.. కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ కూటమిలో ముఖ్యమంత్రి పదవి కోసం కుమ్ములాటలు సాగుతున్నాయి. బీజేపీయే కలలో కూడా ఊహించని విధంగా కూటమిలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో మిత్రధర్మం సంగతి పక్కన పెట్టి ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతోంది. ఏక్ నాథ్ షిండే సీఎంగా కొనసాగుతారన్న నమ్మకం, ఒప్పందంతోనూ కూటమి మహా ఎన్నికలకు వెళ్లింది. అయితే ఘన విజయం తరువాత బీజేపీ ప్లేట్ ఫిరాయించిందన్నది శివసేన షిండే వర్గం ఆరోపణ. అంతే కాదు షిండేను సీఎంను చేసి తీరాల్సిందేనని ఆయన వర్గం ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. షిండే గత రెండేళ్లుగా సాగించిన పాలనకు ప్రజామోదమే ఈ ఎన్నికలలో బీజేపీ కూటమి ఘన విజయానికి కారణమని చెబుతున్నారు.

అయితే బీజేపీ అధినాయకత్వం మాత్రం అందుకు ససేమిరా అంటోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పార్టీ నే దేవెంద్రఫడ్నవిస్ నే సీఎం పీఠంపై కూర్చోపెట్టాలని పట్టుబడుతోంది. అదే సమయంలో ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా కన్ ఫర్మ్ అయ్యారని కూడా చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఏక్ నాథ్ షిండే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజ్యాంగం ప్రకారం మంగళవారం (నవంబర్ 26)తో అసెంబ్లీ గడువు ముగియడంతో ఎగ్జిస్టింగ్ ప్రభుత్వం గద్దె దిగి కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంది. అయితే సీఎం ఎవరన్న విషయం తేలకపోవడంతో షిండే రాజీనామా చేసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. షిండే తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు అందజేయడానికి రాజ్ భవన్ కు వెళ్లిన సందర్భంగా ఆయన బాడీ లాంగ్వేజ్ గమనించిన ఎవరికైనా ఆయన హ్యాపీగా లేరన్న విషయం స్పష్టమౌతుంది. 

షిండేను సముదాయించడానికి బీజేపీ ఆయనకు భారీ ఆఫర్లు చేసిందని కూడా మహారాష్ట్ర రాజకీయవర్గాలలో వినిపిస్తోంది. ఫడ్నవీస్ సర్కార్ లో ఉప ముఖ్యమంత్రిగా ఉండేందుకు షిండే ఇష్టపడకుంటే.. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తామని కూడా బీజేపీ హై కమాండ్ ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు. అయితే రాష్ట్ర రాజకీయాలకు దూరం కావడానికి షిండే ఇసుమంతైనా అంగీకరించడం లేదని తెలుస్తోంది.  ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే విషయంలో జాప్యం జరుగుతోంది. 

మరో వైపు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ కూటమిలో కూడా లుకలుకలు మొదలయ్యాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ బలం పూర్తిగా దిగజారిపోయింది. అతి తక్కువ స్థానాలలో విజయం సాధించింది. దీంతో శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం అసెంబ్లీలో విపక్ష నేత హోదా కోసం పట్టుబడుతున్నారు. కూటమిలో పెద్ద పార్టీగా, కూటమికి నాయకత్వం వహించే పార్టీగా కాంగ్రెస్ అందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇక శరద్ పవార్ అయితే కూటమిలో కొనసాగే విషయంలోనే విముఖంగా ఉన్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మహావికాస్ అఘాడీ ఐక్యంగా కొనసాగే విషయంలో సర్వత్రా అనుమానాలు, సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

By
en-us Political News

  
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.