పత్రాలు తగలెట్టేసి తప్పించుకుందామనే.. బెడిసి కొట్టిన సీఐడీ చీఫ్ బిగ్ ప్లాన్!

Publish Date:Apr 8, 2024

Advertisement

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ తాడేప‌ల్లి సిట్ కార్యాల‌యం వ‌ద్ద సీఐడీ సిబ్బంది కీల‌క ప‌త్రాల‌ను ద‌గ్దం చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. సిట్ కార్యాల‌యం కాంపౌండ్ లో పెద్ద‌ మొత్తంలో ప‌త్రాల‌ను ద‌గ్దం చేయ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. సీఐడీ చీఫ్ ర‌ఘురామ్‌రెడ్డి ఆదేశాల మేర‌కు వాటిని ద‌గ్దం చేసిన‌ట్లు కార్యాల‌య సిబ్బంది తెలిపారు. సిబ్బంది ద‌గ్దం చేసిన కాగితాల్లో హెరిటేజ్ సంస్థకు చెందిన‌ కీల‌క ప‌త్రాలు. చంద్రబాబుపై నమోదు చేసిన స్కిల్ కేసుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని అంటున్నారు.   ఈ ప‌త్రాల‌ను ద‌గ్దం చేసే స‌మ‌యంలో ఫొటోలు, వీడియోలు తీసిన కొంద‌రిని వాటిని త‌మ‌కు ఇవ్వాల‌ని సీఐడీ అధికారులు ఒత్తిడి తేవ‌డం ప‌త్రాల ద‌గ్దం వెనుక పెద్ద మ‌త‌ల‌బే ఉంద‌న్నఅనుమానాలకు తావిచ్చింది. గ‌తంలో మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడుపై సీఐడీ అధికారులు పలు అక్ర‌మ కేసులు నమోదు చేశారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా వాంగ్మూలం కోసం సీఐడీ అధికారులు అనేక మందిపై ఒత్తిడి  తెచ్చారన్న  విమ‌ర్శ‌లూ ఉన్నాయి. అంతేకాదు.. హెరిటేజ్ ఫుడ్స్‌కు సంబంధించిన ఐటీ రిటర్న్స్ చట్టవిరుద్ధంగా అధికారులు పొందార‌ని అప్ప‌ట్లో  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్  ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సిట్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున  ప‌త్రాల‌ దగ్ధంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

తాడేప‌ల్లి సీఐడీ కార్యాల‌యంలో కీల‌క పాత్రాలను  దగ్ధం చేసిన సంగతి వెలుగులోకి రావడంతో  ఉన్న‌తాధికారులు ఆఘ‌మేఘాల మీద‌ స్పందించారు. తాము దగ్ధం చేసిన పత్రాలు వేస్ట్ పేపర్లు అంటూ.. నమ్మించేందుకు  ప్ర‌య‌త్నించారు. తాము ఐదు కేసుల్లో చార్జిషీటు వేశామని, ఒక్కో చార్జిషీట్‌లో ఎనిమిది వేల నుంచి పదివేల పేజీల డాక్యుమెంట్లు ఉన్నాయని,  చాలా జిరాక్సులు తీయాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు.. అయితే, జిరాక్సులు తీసే సమయంలో మిషన్ వేడెక్కడం వల్ల పేపర్ స్టక్ అవుతుందని, ఇంక్ లెవల్ కూడా తగ్గిపోతుందని, దీనివలన కొన్ని కాపీలు సరిగ్గా రావని.. వీటన్నింటిని కూడా వేస్టు పేపర్లుగా గుర్తించి దగ్ధం చేస్తామని తెలిపారు. తాజాగా సిట్ కార్యాల‌యం సిబ్బంది ద‌గ్దం చేసిన కాగితాలు కూడా అవేనంటూ అధికారులు చెప్పుకొచ్చారు. అధికారుల వివరణ తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అన్నట్లుందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అస‌లు స‌మ‌స్య‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు సీఐడీ ఉన్న‌తాధికారులు క‌ట్టుక‌థ‌లు చెబుతున్నరని విమర్శిస్తున్నారు. ఎందుకంటే.. సీఐడీ అధికారులు జిరాక్సులు తీసింది కేవ‌లం హెరిటేజ్ సంస్థ‌కు చెందిన కాగితాలేనా?  హెరిటేజ్ సంస్థ‌కు చెందిన ప‌త్రాల‌ను జిరాక్స్ తీసేట‌ప్పుడే మిష‌న్లో ఇంక్ అయిపోయిందా? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఇదే విష‌యాన్నితెలుగుదేశం నేత‌లు కూడా గట్టిగా ప్రశ్నిస్తున్నారు.  తెలుగుదేశం అధికారంలోకి వ‌స్తే   సేక‌రించిన ఆధారాలు త‌ప్పుడ‌వ‌ని తేలి ఎక్క‌డ జైలుకెళ్లాల్సి వ‌స్తుందోన‌న్న భ‌యంతోనే సీఐడీ తాధికారులు కీల‌క ప‌త్రాల‌ను ద్వంసం చేశార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. 

సీఐడీ అధికారులు చంద్ర‌బాబుపై పెట్టిన కేసుల్లో కీల‌క ప‌త్రాల‌ను కూడా ద‌గ్దం చేశారని తెలుగుదేశం నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ విష‌యాన్ని ఎన్నిక‌ల క‌మిష‌న్ దృష్టికి తీసుకెళ్లారు. పత్రాల దగ్ధంపై లోతైన విచారణకు డిమాండ్ చేశారు.   ఏపీలో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ ఓటమి ఖాయమని  స‌ర్వేలు స్పష్టం చేస్తున్నాయి.  తెలుగుదేశం,  జ‌న‌సేన, బీజేపీ కూట‌మి భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌స్తుంద‌ని ప్రిడిక్ట్ చేస్తున్నాయి. దీంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ అభ్య‌ర్థుల‌కు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది. ఏపీలో వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో కొంద‌రు పోలీసులు, అధికారులు వైసీపీ నేత‌ల‌కు తొత్తులుగా ప‌నిచేశారు. వైసీపీ నేతల ఆదేశాల మేరకు పలువురిపై అక్ర‌మంగా కేసులు పెట్టి చిత్ర‌హింస‌లకు గురిచేసిన ఘటనలు ఉన్నాయి.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలై కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌న్న అంచనాలతో  వైసీపీకి తొత్తులుగా పని చేసిన అధికారులు కొత్త ప్రభుత్వం వస్తే తమకు జైలు తప్పదన్న వణుకు మొదలైంది. ముఖ్యంగా జగన్ ప్రాపకం కోసం అడ్డగోలుగా అక్రమ కేసులు బనాయించి అరెస్టులు, వేధింపులకు పాల్పడిన సిట్ అధికారులు ఇక సర్దుకునే పనిలో పడ్డారు.   గత ఐదేళ్లుగా తప్పుడు కేసులు.. తప్పుడు వాంగ్మూలాలు, ట్యాపింగ్‌లు  ఇలా ఒక్కటేమిటి.. లెక్క లేనన్ని అక్రమాలతో నిలువెల్లా  బురద పూసుకున్న సిట్ ఇప్పుడు ఆ బురదను కడిగేసుకుని చేతులు దులిపేసుకోవడానికి నుడీ అయిపోయింది. అందులో భాగంగానే సిట్ ఆఫీసులో ఉన్న పత్రాలను ముఖ్యంగా తెలుగుదేశం  నేతలపై ఉన్న కేసులకు సంబంధించి అక్రమంగా సంపాదించిన పత్రాలన్నింటికీ నిప్పు పెట్టేశారు. ఇది ఎలా బయటపడిందంటారా.. ఆ కార్యాలయంలోని వ్యక్తులే  దీనికి సంబంధించి వీడియో తీసి మీడియాకు పంపారు.  మీడియాలో ఈ అంశం సంచలనంగా మారింది. చిత్తు కాగితాల్ని తగల బెట్టామని వారు కవర్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నం నవ్వుల పాలైంది.   అవి హెరిటేజ్ కు సంబంధించిన పత్రాలని తగలబడకుండా మిగిలిపోయిన పత్రాలు నిర్ద్వంద్వంగా తేల్చేశాయి.  తెలుగుదేశం నేతలు సైతం సిట్ తప్పులు తగలెట్టేస్తే కనిపించకుండా పోయేవి కావని అంటున్నారు.  ప్రభుత్వం మారిన తర్వాత తప్పక అనుభవించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. 

అసలు ఈ ఐదేళ్ల కాలంలో సీఐడీ అధికారులు  తాము బాధ్య‌త క‌లిగిన అధికారుల‌మ‌న్న‌ విష‌యాన్ని పూర్తిగా విస్మరించి   జగ‌న్ ఏది చెబితే అది చేయ‌డ‌మే తమ ఉద్యోగ ధర్మం అన్నట్లుగా ఆయన సేవలో తరించిపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ క్ర‌మంలో నే చంద్ర‌బాబుపై అక్ర‌మ కేసులు పెట్టి జైలు పంపించ‌డం, లోకేశ్ ను విచారించ‌డం, తెలుగుదేశం ముఖ్య‌నేత‌ల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డం వంటివి చేశారని తెలుగుదేశం గత కొన్నేళ్లుగా విమర్శలు చేస్తున్నది.  వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖాయమన్న నిర్ధారణకు వచ్చేసిన సీఐడీ ఉన్న‌తాధికారులు.. చంద్ర‌బాబు కేసులో, లోకేశ్ ను విచారించిన స‌మ‌యంలో అక్ర‌మంగా సేక‌రించిన ఆధారాలు క‌నిపించ‌కుండా చేసే ఉద్దేశంతోనే కీల‌క ప‌త్రాల‌ను ద‌గ్దం చేశార‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.     మొత్తానికి సిట్ కార్యాల‌యం ఆవ‌ర‌ణంలో ద‌గ్దం చేసిన ప‌త్రాల అంశంపై ఎన్నిక‌ల క‌మిష‌న్ జోక్యం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.  

By
en-us Political News

  
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.