చిరును వెంటాడిన తమిళ కోర్టు
Publish Date:Jun 20, 2012
Advertisement
ప్రచారంలో పరిథి దాటినా మెగాస్టార్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అక్టోబరు 2వ తేదీ లోపు బాగుళూరు కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. సినీజీవితం వదిలేసి రాజకీయ జీవితానికి అలవాటు పడేందుకు చిరు బోలెడు ప్రయాస పడుతున్నారు. ముందుగా ప్రజారాజ్యంపార్టీని స్థాపించి ఆ తరువాత దాన్ని కాంగ్రెస్ లో కలిపేశారు. ఇలా కలిపేసిన తరువాత ఎమ్మెల్యేగా ప్రారంభించిన రాజేకీయ జీవితంలో ఓ చిన్న ప్రమోషన్ లభించి ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు అయ్యారు. అందరూ ఎంపీ అని పిలిచే ఈ సభ్యత్వంతో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, జాతీయనాయకులతో కలిసే సువర్ణావకాశం ఆయనకు లభించింది. అయితే ఈ మధ్యలో ఓ చిన్న అపశ్రుతి దొర్లింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తొలినాళ్ళ (2011)లో తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు చిరంజీవి అక్కడికి వెళ్ళారు. అక్కడ చిరు కొంచెం స్పీడుగానే ప్రచారం చేశారు. తొందరగా ప్రచారం ముగించుకుని వచ్చేయాలనే కంగారులో చిరంజీవి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. హోసూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి గోపీనాథ్ తరపున చిరు ప్రచారం చేశారు. ఆయనపై 188, 143 సెక్షన్ల కింద హోసూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కోర్టు వాయిదాలకు కూడా చిరు గైర్హాజరవటంతో హోసూర్ కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. చిరుతో పాటు ఆరుగురిపై 2011లో ఈ కేసు నమోదైంది. సినీ జీవితంలో (ఖైదీ) కోర్తుమెట్లు నటనలో భాగంగా ఎక్కినా చిరు ఇప్పుడు నిజం కోర్టుకు హాజరుకావాలి. అప్పుడు నటుడుగా, ఇప్పుడు రాజకీయ నాయకునిగా ఎదురవురున్న ఈ మార్పులను చిరు తట్టుకోగలరా? లేక తనకు సినీజీవితమే బాగుందని బయటపడిపోతారా? అని అన్నిరాజకీయ పక్షాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/chiranjeevi-non-bailable-warrant-24-15022.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





