చిరు కు త్వరలో కేంద్రమంత్రి పదవి?
Publish Date:Jul 26, 2012
Advertisement
రాజ్యసభ సభ్యుడు,మెగాస్టార్ చిరంజీవి కేంద్రమంత్రి అవటం ఖాయం అని వార్తలొస్తున్నాయి. దీంతో పీఆర్పీ విలీనం అప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు అవుతుందంటున్నారు. అయితే కేంద్రంలో మంత్రి పదవికి ప్రణబ్ముఖర్జీ రాజీనామా చేయటం, మరికొన్ని ఖాళీలు ఉండటంతో రాష్ట్రం నుంచి కనీసం ముగ్గురికి కేంద్ర మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటి వరకూ తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం కోసం పోరాడుతూనే వచ్చిన తెరాస నుంచి ఇద్దరికి మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణా ఇవ్వకపోయినా మంత్రిపదవుల ద్వారా వారిని కాంగ్రెస్కు అనుకూలంగా మార్చుకోవాలని అథిష్టానం భావిస్తోంది.
ప్రత్యేకించి బయట నుంచి మద్దతు ఇచ్చిన తెరాస ఇప్పుడు మంత్రుల ద్వారా లోపలికి ఆహ్వానించాలని కాంగ్రెస్ ఏర్పాట్లు చేసుకుంటోంది. కొత్త మంత్రులతో పాటు కాంగ్రెస్ జాతీయప్రధానకార్యదర్శి రాహుల్గాంథీ కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరిగాయని తెలుస్తోంది. తిరుపతి ఎన్నికల్లో ఓటమి తరువాత చిరంజీవి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం దక్కదనుకుని మౌనంగా ఉన్నారు. అంతేకాకుండా తమ గొప్పదనాన్ని చాటేందుకు ప్రయత్నించి భంగపడ్డ చిరుకు ఈ మంత్రి పదవి ఓ మంచి అవకాశమని పలువురు భావిస్తున్నారు. ఈ పదవి ద్వారా ఏమైనా చేస్తేనే ఆయనకు కాంగ్రెస్ తగిన గుర్తింపు ఇస్తుందన్నది మాత్రం ఆ పార్టీపెద్దలు తేల్చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/chiranjeevi-central-minister-24-15974.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





