Publish Date:Jul 23, 2020
ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉన్న భారత్ సైన్యం
లద్ధాఖ్ ఎల్ఎసీ వద్ద చొరబాట్లపై ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాకముందే డ్రాగన్ కంట్రీ భారత్ సరిహద్దుల వెంట సైన్యాన్ని మోహరిస్తూ కుతంత్రాలు పన్నుతోంది. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనేలా చూస్తామంటూనే డ్రాగన్ కంట్రీ మరోవైపు తన కుటిల బుద్ధిని చూపిస్తోంది. భారత్ సరిహద్దు దేశాలను తన వైపు తిప్పుకుంటూ యుద్దానికి సిద్ధం అంటూ పరోక్షంగా సంకేతాలను అందిస్తోంది. వెనుకడుగు వేసినట్టే వేసి భారీగా సరిహద్దు వెంట సైన్యాన్ని మోహరిస్తోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని మెక్ మెహన్ రేఖ (ఎంఎల్) సమీపంలోకి దాదాపు 40 వేలమంది సైనికులను చేరవేస్తుంది. . భారత సైన్యం కూడా డ్రాగన్ కంట్రీకి ధీటైన సమాధానం చెప్పడానికి సిద్ధమవుతోంది. యుద్ధ సామాగ్రిని, సైన్యాన్ని అరుణాచల్ ప్రదేశ్ కు పంపిస్తోంది.
వైమానిక దళం సిద్దంగా ఉండాలి..
దేశ సరిహద్దుల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్దంగా ఉండమని సైన్యాన్ని ఆదేశించారు. భారత వాయుసేన అగ్ర కమాండర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో యుద్ధవిమానాలు మోహరించడం మంచి చర్య అన్నారు. సరిహద్దుల వెంట శత్రుదేశానికి గట్టి బుద్ధి చెప్పడానికి వైమానిక దళం సిద్దంగా ఉండాలని ఆదేశించారు.
సరిహద్దుల్లో యుద్ధవిమానాలు..
చైనా చేస్తున్న కవ్వింపు చర్యలకు గట్టిగా గుణపాఠం చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఆర్మీ అమ్ముల పొదిలో కొత్త చేరిన అస్త్రాలను సరిహద్దుల వెంట సిద్ధం చేస్తోంది. అత్యాధునిక పరిజ్ఞానంలో తయారుచేసిన డ్రోన్ కెమెరాలతో డ్రాగన్ కంట్రీ చర్యలపై నిఘా పెంచింది. మిగ్ 29కె సూపర్ సోనిక్ ఫైటర్స్, లాంగ్ రెంజ్ ఎయిర్ క్రాఫ్ట్ పి 8లను తూర్పు లద్దాఖ్ సరహిద్దుల్లో సిద్ధంగా ఉంచింది. భారత్ చైనా సరిహద్దులోని ప్రధాన ఎయిర్ బేస్ ల్లో ఐఏఎఫ్ ఫైటర్ జెట్లతో పాటు మిగ్ విమానాలు కూడా సిద్ధంగా ఉంచారు. సుఖోయ్ 30 ఎంకేఐఎస్, చినూక్ హవీ లిఫ్ట్ హెలికాప్టర్లను కూడా సన్నద్దం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chinese-troops-now-stepping-up-activity-near-arunachal-pradesh-39-101784.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.