సిబీఐ ఎదుట రాజన్నపై నెపం నెట్టేసిన చేవెళ్ళ చెల్లమ్మ
Publish Date:May 22, 2012
Advertisement
చేవెళ్ళ చెల్లమ్మగా పేరుపొందిన ప్రస్తుత రాష్ట్రహోంశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి తనను తాను తప్పించుకునేందుకు సిబీఐ ఇదుట దివంగత రాజశేఖరరెడ్డిపై ఆరోపణలు చేసి నట్లు విశ్వసనీయంగా తెలిసింది. భర్త ఇంద్రారెడ్డి మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చిన సబితా ఇంద్రారెడ్డిని కాంగ్రెస్ నేత రాజశేఖరరెడ్డి ఎంతగానో ప్రోత్సహించారు. చేవెళ్ళ చెల్లమ్మగా ఆమెను అభిమానిస్తూ తాను ఏ పథకాన్ని ప్రారంభించినా ముందుగా చేవెళ్ళ నుంచే ప్రారంభించేవారు. ఆమెకు పెద్దగా అర్హతలు లేకపోయి నప్పటికీ రాజ శేఖర రెడ్డి హోంమంత్రిత్వశాఖను కట్టబెట్టి విమర్శలకు కూడా గురయ్యారు. వై.ఎస్. హయాంలో ఆమె కీలకమైన భూగర్భగనుల మంత్రిత్వశాఖను కూడా నిర్వహించారు. ఈ గనుల కేటాయింపుపై విచారణ జరుపుతున్న సిబీఐ ఇప్పటికే గాలి జనార్థనరెడ్డిని, ఐఎఎస్ అధికారులైన బిపి ఆచార్య, శ్రీలక్ష్మిలను కూడా కటకటాల వెనక్కి నెట్టింది. ఈ కుంభకోణంలో సబితా ఇంద్రారెడ్డికి కూడా వాటా ఉందన్న అనుమానంపై సిబీఐ ఇటీవల ఆమెను కూడా విచారించింది. విచారణ సమయంలో ఆమె నెపమంతా రాజశేఖరరెడ్డి, శ్రీలక్ష్మీలపైనే నెట్టేసి చేతులు దులుపెసుకున్నట్లు తెలిసింది. గనుల కేటాయింపునాకు సంబంధించి ప్రత్యేకంగా రెండు జి.వో.లపై తాను అభ్యంతరం తెలిపానని, అయితే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి జోక్యం చేసుకుని క్యాబినెట్ సమావేశంలో ఈ అంశాలను పెట్టి వాటిని జి.వో.లుగా జారీ చేయించారని ఆమె చెప్పినట్లు తెలిసింది. దీనిపై ఏమైనా ఇబ్బందులు వతాయని తాను ఆందోళన వ్యక్తం చేయగా, క్యాబినెట్ సమావేశం తీసుకునే నిర్ణయానికి క్యాబినెట్ మొత్తం బాధ్యతా వహించాల్సి ఉంటుందని, వ్యక్తిగతంగా ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ ఉండదని రాజశేఖర్ వివరణ ఇచ్చారని సిబీఐ అధికారుఅలకు సబితా ఇంద్రారెడ్డి సాక్ష్యం చెప్పినట్లు తెలిసింది. కొన్ని జి.వో.లను ఐ.ఎ.ఎస్. అధికారి తనకు చెప్పకుండానే విడుదల చేసిందని ఆమె సిబీఐ అధికారులకు చెప్పారట!
http://www.teluguone.com/news/content/chevella-sister-24-14202.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





