చంద్రబాబు తెలంగాణ యాత్ర
Publish Date:Oct 22, 2012
Advertisement
తెలుగుదేశం పార్టీ అధినేత చేపట్టిన వస్తున్నా మీకోసం యాత్ర సోమవారం మధ్యాహ్నానికి తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా రాజోలి దగ్గర చంద్రబాబు తెలంగాణలోకి అడుగుపెడుతున్నారు. బాబుని అడ్డుకుని తీరతామంటూ బీరాలు పలికిన తెలంగాణ వాదులంతా ఇప్పుడు పూర్తిగా చప్పబడిపోయినట్టు కనిపిస్తోంది. చంద్రబాబు యాత్రని అడ్డుకోబోమని, కేవలం నిరసన తెలిపి ఊరుకుంటామని పొలిటికల్ జెఎసి చైర్మన్ కోదండరామ్ తేల్చిపారేశారు. అటు టిఆర్ ఎస్ కూడా చంద్రబాబు తెలంగాణ యాత్ర విషయంలో స్తబ్దుగానే ఉంది. భవిష్యత్తులో ఎలాంటి అవసరాలు వస్తాయో ఎలా నెట్టుకురావాల్సొస్తుందో తెలీదు కనుక చంద్రబాబుతో వైరం పెట్టుకుంటే నష్టమే తప్ప లాభం ఏమీ లేదన్న విషయం ఆ పార్టీకికూడా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. హరీష్ రావ్ లాంటి పెద్ద తలకాయలుకూడా ఈ విషయాన్ని బాహాటంగానే అంగీకరిస్తున్నారుకూడా . పైగా ఇక్కడింకో చిక్కుంది. టిఆర్ ఎస్ విరగబడి నిరసన తెలిపినంతమాత్రాన టిడిపికి వచ్చే నష్టం ఏం లేదు. పైగా ఆ ప్రార్టీకి, పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకి అనవసరంగా విస్తృతమైన ప్రచారం కల్పించినట్టువుతుందేమోనన్న మీమాంసకూడా జనంలో గట్టిగానే ఉంది. మరోవైపు చంద్రబాబుకి ఘన స్వాగతం చెప్పేందుకు రాజోలిదగ్గర 30మంది ఎమ్మెల్యేలు, టిడిపి నేతలు కాచుక్కూర్చున్నారు. కొందరు కరుడుగట్టిన తెలంగాణ వాదులు మాత్రం ఆరునూరైనా చంద్రబాబుకి తడాఖా చూపించి తీరాలని గట్టిగానే నిర్ణయించుకున్నారు. అందుకే ఈ తెల్లవారు జామున కరీంనగర్ లోని టిడిపి కార్యాలయాన్ని అగ్గిపాలుజేసి బాబు తెలంగాణ యాత్రపై తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు.
http://www.teluguone.com/news/content/chandrababu-meekosam-yatra-telangana-31-18428.html





