మహానాడులో బాబు జోస్యం

Publish Date:May 27, 2013

Advertisement

 

చంద్రబాబు పాదయాత్రలో ఉన్నప్పుడు ముందస్తు ఎన్నికలు ఏ క్షణానయినా రావచ్చునని అందుకు పార్టీలో అందరూ సంసిద్దంగా ఉండాలని చెపుతూ వచ్చారు. కానీ, పాదయాత్ర ముగించుకొని వచ్చిన తరువాత ఇప్పుడు ఆయన తన అభిప్రాయం మార్చుకొన్నారు. మొన్న మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ చరిత్ర గమనిస్తే ఆ పార్టీ ఏనాడు కూడా గడువుకి ఒక్కరోజు ముందు కూడా ఎన్నికలకి వెళ్ళినట్లు కనబడదు. అందువల్ల ఈ సారి కూడా ఏప్రిల్ 2014 వరకు ఎన్నికలకు వెళ్ళక పోవచ్చును. ఏమయినప్పటికీ, మేము ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఎదుర్కొనేందుకు తయారుగానే ఉంటాము,” అని అన్నారు.

 

వచ్చే ఎన్నికలలో తమ పార్టీ కేంద్రంలో లెఫ్ట్ పార్టీలు మరికొన్ని ఇతర పార్టీలతో కలిసి 3వ ఫ్రంట్ ఏర్పరచి ప్రభుత్వం ఏర్పాటుకు కృషిచేస్తుందని ఆయన అన్నారు. రానున్న ఎన్నికలలో యుపీఏ ప్రభుత్వ అవినీతి, వెలుగు చూస్తున్న కుంభ కోణాలే ప్రధానాంశాలుగా ఉంటాయని ఆయన అన్నారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికలలో ప్రజలు అవినీతిని ఎంత మాత్రం సహించరని రుజువు చేసిందని అన్నారు. అయితే, కర్ణాటకలో ప్రజలకు బీజేపీ, కాంగ్రెస్ లకు అక్కడ సరయిన ప్రత్యామ్నాయం లేకపోవడం వలననే కాంగ్రెస్ పార్టీకి అవకాశం దక్కిందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ వైయస్సార్ కాంగ్రెస్ రెండూ విలీనమయి పోవచ్చును గనుక అప్పుడు రాష్ట్రంలో తాము కేవలం కాంగ్రెస్ పార్టీతోనే పోటీ పడవలసి ఉంటుందని ఆయన అన్నారు.

 

లోకేష్ వంటి విద్యావంతుడు రాజకీయాలలోకి రావడం ఆహ్వానించ దగ్గ పరిణామమే అని ఆయన అన్నారు. కేవలం అతను తన కుమారుడిగా కాక, వ్యాపార వ్యవహారాలను చక్కబెట్టి తన సమర్ధత నిరూపించుకొన్న వ్యక్తిగా, యువతకు ప్రతినిధిగా అతనిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని, అదే సమయంలో యువతరానికి తమ పార్టీ స్వగతం పలుకుతోందని ఆయన అన్నారు. ఒకవేళ అవసరమనుకొంటే తమ పార్టీ జూన్ 10నుండి మొదలయ్యే రెండవ విడత బడ్జెట్ సమావేశాలలో అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చునని ఆయన అన్నారు.

By
en-us Political News

  
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనకు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి అరమరికలూ లేకుండా మిత్రధర్మాన్ని తప్పకుండా నడపిన వాజ్ పేయి స్ఫూర్తిగా ముందుకు సాగాలన్న సంకేతాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.
బెంగ‌ళూరు టు ఢిల్లీ అన్నట్లుగా ప్ర‌త్యేక ఎపిసోడ్లు న‌డిచాయి. రాహుల్ గాంధీ డీకేకి స్పెష‌ల్ మెసేజీలు పెట్టారు. క‌ట్ చేస్తే ఏదో అనుకుంటే ఏమీ కాలేదు అన్నట్లుగా క‌ర్ణాట‌క‌లో సీఎం మార్పు జరగలేదు. కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది.
2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.
దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.