చంద్రబాబు.. పవన్ బేటీ.. ఏపీలో రాజకీయ వేడి

Publish Date:Oct 19, 2022

Advertisement

ఒక్క సమావేశం.. ఒకే ఒక్క సమావేశం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలను వేడెక్కించింది. ఔను రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించిన స్వల్ప వ్యవధిలోనే దాదాపు అలాంటి చిత్రమే ఆవిష్కృతమైంది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు విజయవాడ నోవాటెల్ లో బస చేసిన పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు.

ఇద్దరూ కలిసి సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. ఆ తరువాత దాదాపు గంట సేపు ఇరువురూ ముఖాముఖీ భేటీ అయ్యారు. ఇప్పటికే జనసేన, బీజేపీ మిత్రపక్షాలు.. ఇరు పార్టీల మధ్యా పొత్తు ఉంది. అయినా ఈ మూడేళ్లలో ఇరు పార్టీలూ కలిసి పని చేసిన సందర్భాలు పెద్దగా లేవు. కలిసి పోరాటాలు చేసిన సందర్భమూ లేదు. చివరాఖరికి విశాఖపట్నంలో జనవాణి కార్యక్రమం జరిగే అవకాశం లేకుండా అడ్డంకులు సృష్టించిన సందర్భంలోనూ.. పవన్ కు మద్దతుగా బీజేపీ ముందుకు రావడంలో జాప్యం చేసింది. ముందుగా తెలుగుదేశం సంఘీభావం ప్రకటించింది. ఆ తరువాతే బీజేపీ పవన్ కల్యాణ్ కు సంఘీభావం ప్రకటిస్తూ ముందుకు వచ్చింది. సరే ఆ సంగతి పక్కన పెడితే విజయవాడ నోవాటెల్ హోటల్ లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ బేటీ రాష్ట్ర రాజకీయాలలో పొత్తలపై చర్చను మళ్లీ తెరమీదకు తీసుకు వచ్చింది. వీరి భేటీకి ముందు మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో కార్యకర్తలతో సమావేశంలో బీజేపీ విషయంలో తన అసంతృప్తి ఇసుమంతైనా దాచుకోకుండా వ్యక్తం చేశారు.

ఆ తరువాత చంద్రబాబుతో భేటీ కావడంతో ఇరు పార్టీల మధ్య వచ్చే ఎన్నికల నాటికి పొత్తు పొడిచే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన పొత్త ఖాయమనీ, బీజేపీ కలుస్తుందా లేదా అన్నది ఆ పార్టీ తేల్చుకోవలసిన అంశమని అంటున్నారు. అన్నిటికీ మించి గంట సేపు ముఖాముఖీ భేటీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య చర్చకు వచ్చిన అంశాలేమిటి? పొత్తుల ప్రస్తావన వారి మధ్య వచ్చిందా అన్న విషయంపై రాజకీయ వర్గాలలో తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. పొత్తు ఊహాగానాలకు బలం చేకూర్చే విధంగా వైసీపీ నుంచి ఒంటరి పోరుకు దమ్ముందా? అంటూ ఆవుకథలాంటి విమర్శలు వెల్లువెత్తాయి. కాగా నోవాటెల్ లో చంద్రబాబు పవన్ బేటీ సమయంలో ఓ పది నిముషాల పాటు మాత్రమే నాగబాబు, నాదెండ్ల మనోహర్ ఉన్నారు.

ఆ తరువాత దాదాపు గంట సేపు బాబు, పవన్ కల్యాణ్ ముఖాముఖీ ముచ్చటించుకున్నాయి. కాగా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరరు విశాఖలో ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుపై పవన్ కల్యాణ్ చంద్రబాబుకు వివరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉమ్మడి వేదిక ఏర్పాటు ఆవశ్యకతపై, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలనూ ఏకతాటిపైకి తీసుకురావాలని ఒక నిర్ణయానికి వచ్చారు. వామపక్షాలు, బీజేపీలను ఓకే వేదికపైకి తీసుకురావడం ఒకింత కష్టమైనా, రాష్ట్రంలో అరాచక పాలనను ఎదిరించేందుకు అందరినీ కలుపుకుపోవాలని ఇరువురు నాయకులూ అభిప్రాయపడ్డారు.

ఇక వీరి బేటీలో ముందస్తు ఎన్నికల ప్రస్తావన కూడా వచ్చిందని అంటున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం పోరాటాలు చేస్తూనే మరో వైపు ఎన్నికలకూ సిద్ధం కావాల్సిన అవసరం ఉందని ఇరువురూ కూడా తమ సంభాషణలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. 

By
en-us Political News

  
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని, చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి.
సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు, పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న నేతలకు రాజకీయ అభయం ఇస్తూ, వారిపై విచారణ అధికార తెలుగుదేశం కూటమి కక్షసాధింపుగా అభివర్ణించే ప్రయత్నం చేయడం జగన్ కు రివాజుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రగతి ప్రకటనలో భాగంగా ప్రభుత్వం మొత్తం 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేస్తున్నది. గతంలోని అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రబుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల యాక్షన్ టేకెన్ నివేదికలతో పాటు, అభివృద్ధి , సుపరిపాలన, సంక్షేమం, సాధికారత విభాగాలపై సమగ్ర నివేదికలు విడుదల చేయనుంది. అభివృద్ధి నివేదికలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాల పురోగతిని పొందుపరచగా, సుపరిపాలన నివేదిక ద్వారా నూతన విధానాలు, డిజిటల్ విప్లవం, వాట్సాప్ గవర్నెన్స్ వంటి సేవల వివరాలను అందించనుంది.
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.