సెంట్రల్ విస్తా.. ఒక వాస్తు తంత్రం

Publish Date:May 24, 2023

Advertisement

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అట్టహాసంగా ప్రారంభించిన సరికొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్తా చుట్టూ వివాదాలు ముసురుతున్నాయి.  పాత పార్లమెంటు భవనం 1927లో ప్రారంభం కాగా, మరో వందేళ్లకు భారత పార్లమెంట్ తన అడ్రస్ మార్చుకోనుంది. సెంట్రల్ విస్తా విషయంలో దాదాపు ప్రతి అంశం వివాదాలకు కారణం అవుతోంది. సెంట్రల్ విస్తా మొత్తం ప్రాజెక్ట్ 2026 నాటికి పూర్తి కానుంది. ప్రస్తుతానికి పార్లమెంట్ సభ్యుల సమావేశాలు జరిగే లోక్ సభ, రాజ్య సభ సముదాయాలను పూర్తి చేశారు. ఈ భవనాలను ఈ నెల 28వ తేదీన ప్రారంభించాలని మోడీ భావిస్తున్నారు.

మే 28 సావర్కార్ జయంతి అయినందున ఆ రోజు  ప్రారంభోత్సవం జరపరాదన్న వాదన బలంగా వినబడుతోంది. బ్రిటిషర్ల కాలు మొక్కి శిక్ష నుంచి తప్పించుకున్న సావర్కార్ అసలు దేశ భక్తుడే కాదని వీరి వాదన. కానీ బీజేపీ మాత్రం సావర్కార్ ను మచ్చ లేని దేశ భక్తుడిగా గుర్తిస్తోంది.  ఇది ఒక అంశం అయితే, సెంట్రల్ విస్తాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత  ప్రారంభోత్సవం జరిపించాలంటూ 19 ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాయి. ఇంకా కొన్ని రాజకీయ పక్షాలు స్పందించాల్సి ఉంది.  అయితే సెంట్రల్ విస్తాను ప్రధాని మోడీ మాత్రమే ప్రారంభిస్తారనని అది కూడా సావర్కార్ జన్మదినం రోజైన మే 28వ తేదీనే జరుగుతుందని బీజేపీ చెబుతోంది.  ఇదిలా ఉంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇంత వరకూ ఆహ్వానం కూడా పంపించలేదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.

ప్రస్తుత పార్లమెంటు భవనం 1911 నుంచి 1932 వరకూ నిర్మాణం జరుపుకుంది.  కాగా 1927లో  నిర్మాణం కాకముందే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం హౌస్ ఆఫ్ పార్లమెంట్ ను ప్రారంభించింది. బ్రిటిష్ ఇంజనీర్లు ఎడ్వర్డ్  లూత్సాన్, హెర్బెర్ట్ బెకర్ లు భారత పార్లమెంట్ భవనాన్ని డిజైన్ చేసి నిర్మించారు. భారతదేశ ఆధినిక చరిత్ర ఈ పార్లమెంట్ భవనంతో ముడివేసుకుంది. అంబేడ్కర్, నెహ్రూ, ఇందిరాగాంధీ, పటేల్, వాజ్ పేయి, జగ్జీవన్ రామ్, పీవీ నరసింహారావు, నీలం సంజీవరెడ్డి, వీవీగిరి, అబ్దుల్ కలాం, సర్వేపల్లి , జాకీర్ హుస్సేన్, రాజీవ్ గాంధీ వంటి దిగ్గజాలు ఆధునిక భారతదేశానికి దిశానిర్దేశం చేశారు. అలాంటి ప్రపంచంలోనే అత్యద్బుతమైన పార్లమెంట్ భవనాలలో ఒకటిగా చెప్పుకునే భారత పార్లమెంట్ భవనం ఇక ముందు ఆ ఖ్యాతిని కోల్పోనుంది. ప్రస్తుత భవనం నిర్మించి శతాబ్దం కావస్తున్న నేపథ్యంలో మరో భవనాన్ని మోడీ సర్కార్ నిర్మిస్తోంది.  

ఖర్చు విషయం పక్కన పెడితే చారిత్రక ప్రాధాన్యతను మనం కోల్పోతున్నమన్నది వాస్తవం. ప్రపంచంలో  అతి పురాతన ప్రజాస్వామ్య దేశం అమెరికాలోని పార్లమెంట్ భవనానికి 230 సంవత్సరాలు పూర్తయ్యాయి. అంతటి అమెరికా కూడా చారిత్రక మూలాలను వదల కుండా ఇప్పటికీ  కేపిటల్ హిల్ ను తమ పార్లమెంట్ భవనంగా గౌరవిస్తోంది. 

ఇంకా సెంట్రల్ విస్తా గురించి చూస్తూ గుజరాత్ కు చెందిన విమల్ పటేల్ అనే వాస్తు శిల్పి అధీనంలో సెంట్రల్ విస్తా రూపొందుతోంది. ఈ భవన సముదాయం వాస్తుతంత్ర విధానంలో నిర్మితం అవుతోందని విమల్ పటేల్ బృందం చెబుతోంది.

ఇదిలా ఉండగా,  సెంట్రల్ విస్తా వాస్తుపై పండితులు పెదవి విరుస్తున్నారు.  86 ఎకరాల్లో నిర్మితం అవుతున్న ఈ ప్రాజెక్ట్ వాస్తుకు పూర్తి విరుద్ధమని వారి వాదన. త్రికోణ ఆకారంలో నిర్మితం అవుతున్న సెంట్రల్ విస్తా చివరికి నష్టాలను కలిగిస్తుందని  లెక్కలు వేస్తున్నారు. ఒరిస్సా  భువనేశ్వర్ లోని బ్రహ్మేశ్వర దేవాలయం వాస్తు సెంట్రల్ విస్తాలో కనిపిస్తుందని  దేవాలయాల వాస్తు మరో నిర్మాణానికి పెట్టడం అరిష్టమని పండితులు వాదిస్తున్నారు. ఏది ఏమైనా సెంట్రల్ విస్తా బీజేపీ నాయకత్వానికి మరో తలనొప్పిగా మారిందని చెప్పక తప్పదు.

By
en-us Political News

  
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.