కేంద్రంలో పదవుల పందేరంపై ఆశలు
Publish Date:Oct 17, 2012
Advertisement
ఎప్పుడెప్పుడు కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందోనని ఆశగా చూస్తున్న రాష్టనాయకులకు విజయదశమికి ముందే ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలవడం ద్వారా ఆంద్రప్రదేశ్ కు ఎంతవరకూ అవకాశం ఇస్తారోనని అధికార కాంగ్రెస్ వర్గాలు బలాబలాలు అంచనా వేస్తున్నారు, ప్రత్యర్ధిపార్టీలన్నీ బిసి , ఎస్టీ, ఎస్సీ లను కలుపుకుంటూ దూసుకై పోతుంటే తాము మాత్రం వెనుకబడి పోయామని అధికార కాంగ్రెస్ భావిస్తుంది. అందుకే ఈ సారి అయినా బిసిలకు కేంద్రంలో స్థానం ఇవ్వాలని బిసి సంఘాలు కోరుతున్నాయి. అందుకు గానూ చిరంజీవిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని కోరుతున్నారు. అయితే అదే సామాజిక వర్గానికి చెందిన పల్లంరాజు ఇప్పటికే కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్నారు. కమ్మ వర్గానికి చెందిన కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావులు ఎప్పటినుండో తాము కాంగ్రెస్ పార్టీలో ఉన్నా తమకు ప్రాధాన్యత నివ్వడంలేదని విసుగు చెందుతున్నారు. అంతే కాక తమ వర్గానికి తీరని అన్యాయం జరుగుతుందని కూడా వారు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ వర్గానికి చెందిన దగ్గుపాటి పురంధేశ్వరి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. వెనుకబడిన వర్గాలను అన్ని పార్టీలు కలుపుకు పోతున్నాయని వైసిపి ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి తనకే ఉందని భావిస్తున్న హనుమంతరావు చెబుతున్నారు. సోనియా కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం, వారికి ఆయనపై వారికి ఉన్న విశ్వాసం తో పాటు తెలంగాణాలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వవలసి ఉంటుందని అందువల్ల కూడా రేస్ లో హనుమంతు ముందున్నారని తెలుస్తుంది. కర్నూల్నుండి ఎంపి కోట్ల సూర్య భాస్కరరెడ్డి పేరుకూడా ప్రముఖంగా వినిపిస్తుంది. వైయస్ జగన్ని కర్నుల్ ఓదార్పు యాత్రకు రానివ్వకుండా అడ్డుకుంటంతో అధిష్టానం మదిలో చోటు సంపాదించారు. యస్సీ వర్గనికి చెందిన పనబాక లక్మీ పనితీరుపై నాయకత్వం అసంతప్తిగా ఉన్నారని తెలుస్తుంది. అందువల్ల ఆమె స్దానంలో ఎంపీ సర్వే సత్యన్నారాయణకు అవకాశం కల్పించే వీలుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణవాదం, పార్టీ ప్రయోజనాలను గుర్తుంచుకొని ఇంతవరకు ఒక్కసారి కూడా మాదిగలకు కేంద్రపదవి ఇవ్వక పోవడం ఇంకా తెలుగుదేశం పార్టీ మాదిగలకు దగ్గరవడం వల్లకూడా దాన్ని అడ్డుకోవడానికి గానూ సర్వేకు మంత్రి పదవి దక్కవచ్చునంటున్నారు.
http://www.teluguone.com/news/content/central-ministers-race-24-18262.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





