Publish Date:May 22, 2023
అవినాష్ ఇక అరెస్టు నుంచి తప్పించుకోలేరా? ఆఖరి ఆశగా ఆయన దాఖలు చేసుకున్నముందస్తు బెయిలు పిటిషన్ విచారణకు సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ నిరాకరించడంతో ఇక సీబీఐ కూడా మరింత దూకుడుగా వ్యవహరిస్తుందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
ఇప్పటికే కర్నూలు ఎస్పీకి అవినాష్ ను అరెస్టు చేస్తాం శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయమని సీబీఐ కోరింది. అయితే అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయడం సాధ్యం కాదని ఆయన చెప్పడంతో సీబీఐ కేంద్ర బలగాలను రంగంలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయాన్ని సీబీఐ అధికారులే చెబుతున్నారు. మరో వైపు అవినాష్ తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి కూడా సీబీఐ అధికారులు ఆరాతీస్తున్నట్లు సమాచారం. కర్నూలులోని అవినాష్ రెడ్డి స్నేహితుడి ఆస్పత్రి అయిన విశ్వభారతి ఆస్పత్రి వైద్యులపై అంతగా విశ్వాసం ఉంచని సీబీఐ ఆమెను వేరే వైద్యుల ఒపీనియన్ తీసుకునే దిశగా కూడా సీబీఐ యోచన చేస్తున్నది.
ఇలా ఉండగా ఇప్పటికీ విశ్వభారతి ఆస్పత్రి పూర్తిగా అవినాష్ అనుచరుల అధీనంలోనే ఉండటంతో అవినాష్ తల్లి శ్రీలక్ష్మి భద్రతపై కూడా ఆందోళన వ్యక్తమౌతోందని పరిశీలకులు అంటున్నారు. ఇలా ఉండగా అవినాష్ ను అరెస్టు చేస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందంటూ కర్నూలు ఎస్పీ చెప్పడాన్ని సీరియస్ గా తీసుకున్న సీబీఐ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయానికి వివరించి సూచనలు తీసుకుంటున్నారు. అవినాష్ తీరుపై ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న సీబీఐ హెడ్ క్వార్టర్స్ ఆయనను అరెస్టు చేయమని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందంటున్నారు. ఇప్పుడు ఇక అవసరమైతే కేంద్ర బలగాలను రంగంలోనికి దించైనా అదుపులోనికి తీసుకోవాలని చెప్పినట్లు ప్రచారం అవుతోంది.
ఇక అవినాష్ రెడ్డి వ్యవహారంలో సీబీఐ తాత్సారంపై సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ‘అవినాష్ రెడ్డిగారూ పిచ్చి చూపులు చూస్తున్న సీబీఐ మీద దయ చూపించడండి.. సర్జికల్ స్ట్రైక్స్ తో ప్రపంచానికే హీరోగా నిలబడిన ప్రధాని మోడీ చేతిలో చేతకాని సీబీఐ ఉందన్న చెడ్డ పేరు తీసుకురాకండి.. దయచేసి లొంగిపోండి’ అంటూ ఓ రేంజ్ లో నెటిజన్లు సీబీఐని ట్రోల్ చేస్తున్నారు.
మరో వైపు అవినాష్ అరెస్టుకు రంగం సిద్ధం చేసిన సీబీఐ ఒక్కటొక్కటిగా అడ్డంకులను తొలగించుకుంటూ.. ముందుకు అడుగులు వేస్తున్న సీబీఐని నిలువరించడానికా అన్నట్లు అవినాష్ రెడ్డికి ర క్షణ కవచంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో కలిసి వైసీపీ ఎమ్మెల్యేలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద వైసీపీ మూకలు, అవినాష్ అనుచరులు ఎవరూ లోపలికి వెళ్లకుండా బైఠాయించారు. వారితో పాటు హాస్పిటల్ ముందే కర్నూల్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి , పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ ఉన్నారు. దీంతో ఆస్పత్రిలో ఉన్న ఇతర రోగులు, వారి బంధువులూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ పరిస్థితిని సీబీఐ బృందాలు ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయానికి నివేదించాయి. దీంతో కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలన్న నిర్ణయానికి వచ్చిన సీబీఐ హెడ్ క్వార్టర్స్ ఆమేరకు చర్యలు చేపట్టింది. ఈ మధ్యాహ్నానికి కేంద్ర బృందాలు కర్నూలు చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఆ తరువాత ఏ క్షణంలోనైనా అవినాష్ ను సీబీఐ అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/central-forces-into-action-39-155725.html
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు.
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.