Publish Date:Jul 19, 2022
ఊరించి ఊరించి ఊరగాయ బెట్టి ఆఖరికి ముక్కలేదు తర్వాత చూద్దాం అని నూనె జాడీ చూపించింది వెనకటికి ఓ బామ్మగారు. అదుగో అలా మారింది ఆంధ్రప్రధేశ్ ప్రత్యేక హోదా తంతు. 2014లో ప్రత్యేక హోదా తప్పకుండా ఇస్తామన్న హామీ ఇచ్చారనే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా విడిపోవడానికి అప్పటి నాయకులు అంగీకరించారు. ప్రభుత్వం ఏర్పాటయింది. అప్పటి నుంచి హోదా గురించి ఎప్పుడు చర్చ లేదా ప్రశ్నలు తలెత్తినా ఏదో మాయమాటలు చెప్పి తెలుగు ప్రజల, ప్రభుత్వ ఆవేశాన్ని చల్లా ర్చడం కేంద్రం పెద్ద పనిగా పెట్టుకుంది. కాలం గడిచిపోయింది రాష్ట్రానికి వీలయినంత ఆర్ధిక సాయం చేస్తామని ఊరించి అసలు హోదా మాటనే మర్చిపోయేలా చేశారు కేంద్రంలోని బిజెపీ పెద్దలు.
జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే ముందుగా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ప్రత్యేక హోదా సాధించుదామనే అన్నారు. కానీ క్రమేపీ కేంద్రానికి దాసోహం అనడంతో ఆ మాటను మార్చి ఏవేవో కబుర్లు చెబుతూ, జగన్ని అసలా అంశాన్ని ఎత్తకుండా చేశారు. జగన్ కేవలం కేంద్రంలో నాయకుల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం తప్ప ప్రత్యేక హోదా గురించి ఇతర అంశాల గురించి పల్లెత్తు ఏమీ మాట్లాడటం లేదు. జనం పూర్తిగా దాని సంగతే మర్చిపోయారన్న భ్రమలో కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలు ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో మళ్లీ ప్రత్యేక హోదా అంశం చర్చకు తెరలేపింది. లోక్సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు హోదాపై అడిగిన ప్రశ్నకు కేంద్రప్రభుత్వంమళ్లీ పాత పాటే పాడింది. లోక్సభలో కేంద్రమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటాను 42 శాతానికి ఆర్థిక సంఘం పెంచిందన్నారు.
రెవెన్యూ లోటు రాష్ట్రాలకు అదనపు నిధులను ఆర్థిక సంఘం కేటాయించిందని, 15వ ఆర్థిక సంఘం కూడా ఈ సిఫార్సులను కొనసాగించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీలను చాలా వరకు కేంద్రం నెరవేర్చిందని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ అన్నారు. కొన్ని అంశాలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, వాటిని కూడా పదేళ్ల కాలంలో పరిష్కరిస్తామని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి..ఇప్పటికే కేంద్ర హోంశాఖ 28 సమావేశాలను ఏర్పాటు చేసిందని నిత్యానందరాయ్ పేర్కొన్నారు.
...
హోదా సాధనకు ఒక సుధీర్ఘ పోరాటాన్ని వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీలతో సహా అన్ని పార్టీలు తమ విభేదాలను వీడి ఎస్సీ ఎస్ఎస్ సాధనకు ఐక్య పోరాటానికి సిద్ధపడాల్సిన అవసరం ఉంది. 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తమకు అత్యధికంగా ఎంపీ సీట్లు ఇస్తే రాష్ట్రానికి ఎస్సీ ఎస్టీ కోసం పాటుపడతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ఇప్పుడు మౌనంగా ఉండటం పట్ల రాష్ట్రంలో విపక్షాలతో పాటు ప్రజలు మండిపడుతున్నారు. ఈ విషయంలో బిజెపీని దీటుగా ఎదర్కోవడంలో వైసీపీ ని పూర్తిగా నమ్మి మోసపోయామన్న అభిప్రాయాలే అంతటా వినవస్తున్నాయి. కేంద్రంతో కొంత సహచర్యం వున్న జగన్ హోదా విషయంలో మాత్రం వారిని ఒప్పించడంలో దారుణంగా విఫలమయ్యారు. పైగా కేంద్రం మనసులో మాట జగన్కు తెలిసి కావాలనే అసలు రహస్యాన్ని బయటపెట్టక కాలక్షేపం కబుర్లతో ప్రజల్ని మోసం చేశారన్నది తేటతెల్లమయింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/center-shows-empty-hands-to-ap-again-on-special-status-25-140113.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.