ఏపీ ప్రభుత్వం అప్పుల కోసం కేంద్రం చుట్టూ ఎన్ని ప్రదక్షిణాలు చేసినా ఫలితం లేని పరిస్థితి తెలిసిందే. లెక్కల చిట్టాలు విప్పితే తప్ప కొత్త అప్పులకు నో అంటూ కేంద్రం ఏపీకి దాదాపుగా అప్పులకు మార్గం లేకుండా దారులు మూసేసింది. అయితే ధనిక రాష్ట్రం అయిన తెలంగాణకూ అప్పుల తిప్పలు తప్పడం లేదు.
రెండు రాష్ట్రాల అప్పుల తిప్పలకు కారణాలు వేరు వేరు అయినా ఫలితం మాత్రం ఇరు రాష్ట్రాలకూ ఒకేలా ఉంది. ధనిక రాష్ట్రమే అయినా, తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించే స్తోమత ఉన్నా కూడా తెలంగాణకు కేంద్రం మొండి చేయే చూపిస్తోంది. ఇక ఏపీ సంగతి తెలిసిందే. ఎందుకు అప్పు తీసుకుంటోందో అందుకు వ్యయం చేస్తుందన్న గ్యారంటీ లేదు. విపత్తు నిధులను సైతం సంక్షేమ పద్దుకు మరళించి వచ్చే ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ఇన్వెస్ట్ చేసేసిన చరిత్ర ఏపీది. ఏపీకి రుణం అందక అవస్థలు పడటం ఆ రాష్ట్ర ప్రభుత్వ స్వయం కృతాపరాధమే. మరి తెలంగాణకూ అదే పరిస్థితి ఎందుకు? ఈ నిరాకరణ వెనుక రాజకీయం ఉందా?
మొదటి మూడు నెలల్లో ఆర్బీఐ నుంచి రూ. పదిహేను వేల కోట్లు అప్పు తెచ్చి పరిస్థితిుల్నిచక్క బెట్టుకుందామనుకున్న తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ఫలించలేదు. ఏప్రిల్ నెలలో రూ. ఐదు వేల కోట్ల అప్పు కోసం చేసిన ప్రయత్నాలకూ సేమ్ రిజల్ట్. తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేసి.. తమ అప్పులు.. గ్యారంటీలు.. కార్పొరేషన్ల అప్పుల వివరాలన్నింటినీ కేంద్రానికి పంపించినా, ఎఫ్ఆర్బీఎం లిమిట్స్ దాటేసిందన్న నెపంతో కేంద్రం కొత్త రుణాలకు మోకాలడ్డింది. ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటూ, తాము చేసే అప్పులు భవిష్యత్ అభివృద్ధికి పెట్టుబడే నంటూ చెబుతున్న తెలంగాణ రాష్ట్రం కూడా నిబంధనలకు నీళ్లొదిలేసి పరిమితిని మించి అప్పులు చేసేసిందనడానికి ఇదే నిదర్శనం. తెలంగాణ కూడా అభివృద్ధి కంటే ఎన్నికల ముంగిట ఉచిత పందేరాల పథకాలకే అగ్ర తాంబూలమిచ్చి..మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చేస్తోందన్న విపక్షాల విమర్శలకు ఎఫ్ఆర్బీఎం లిమిట్ దాటేసి మరీ అప్పులు చేసిందన్న సమాచారం ఊతమిస్తోందని పరిశీలకులు అంటున్నారు. కేంద్రం నిర్వాకం కేవలం రాజకీయమేనని తెరాస ఎదురుదాడికి దిగినా గణాంకాల ఆధారంగా రాష్ట్ర పన్నుల వాటాలో కోత అనివార్యమని అర్దమౌతున్నది. తెలంగాణ పన్నుల రూపంలో రాష్ట్రానికి చెల్లించిన మొత్తం లెక్కలను చెబుతూ, గుజరాత్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలకు అప్పులకు అనుమతి చేసి తెలంగాణకు ఎందుకివ్వరన్న తెరాస విమర్శలు రాజకీయ ప్రయోజనాలకు పని కొస్తాయేమో కానీ, అప్పు పుట్టడానికి కాదు.ఇక ఏపీ అయితే ఏపీకి మాత్రం అలా తీసుకున్న అప్పులు, వాటిని వ్యయం చేసిన వివరాలు వెల్లడిస్తే.. అసలింక అప్పుపుట్టే పరిస్థితే ఉండదు. ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలు ఈ ఆర్థిక అడ్డంకులను అధిగమించడానికి ఏం చేస్తాయన్నది రానున్న రోజుల్లోనే తెలుస్తుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/center-demies-permission-for-new-debta-to-telangana-akso-39-135292.html
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.