Publish Date:Oct 21, 2022
నిబంధనలను తుంగలో తొక్కి అధికార పార్టీతో అంటకాగితే అధికారులపై చర్యలు తప్పవని కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి రుజువు చేసింది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం విధుల నుంచి తొలగించింది. మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న భూసేకరణ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథరావును మునుగోడు రిటర్నింగ్ అధికారి బాధ్యతల నుంచి తొలగించింది. ఇంతకీ ఆయనేం చేశారంటే.. ఒక అభ్యర్థికి ఎన్నికల గుర్తు కేటాయింపు జరిగిన తరువాత దానిని మార్చారు. ఈ విషయంలో ఆయన లేని అధికారాన్ని వినియోగించారని సీఈసీ తప్పుపట్టింది.
ఒక అభ్యర్థికి కేటాయించిన ఎన్నికల గుర్తును మార్చడం ద్వారా ఆయన.. లేని అధికారాన్ని వినియోగించారని తప్పుపట్టింది. రద్దు చేసిన రోడ్డు రోలర్ గుర్తు.. తిరిగి అదే అభ్యర్థికి కొనసాగుతుందని స్పష్టం చేసింది. గంటల వ్యవధిలోనే మిర్యాలగూడ ఆర్డీవో బి.రోహిత్సింగ్ను నూతన ఆర్వోగా నియమించింది. మామూలుగా గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఈసీ వద్ద ఉన్న గుర్తుల జాబితా నుంచి ఒక్కొక్కరు మూడింటిని ప్రాధాన్యక్రమంలో ఎంచుకోవాలి. వాటి నుంచి లాటరీ ద్వారా గుర్తులు కేటాయిస్తారు. యుగతులసి పార్టీ నుంచి పోటీ చేస్తున్న కె.శివకుమార్ తొలి ప్రాధాన్యంగా రోడ్డు రోలర్ గుర్తును ఎంచుకున్నారు.
లాటరీలో అదే గుర్తు రావడంతో దాన్ని కేటాయిస్తున్నట్లు ఈ నెల 17వ సీఈసీ ప్రకటించింది. అయితే ఆ తరువాత అభ్యర్థి శివకుమార్ కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆయనకు కేటాయించిన గుర్తు రోడ్ రోలర్ గుర్తును మార్చి బేబీ వాకర్ గుర్తును కేటాయించారు. దీంతో శివకుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం శివకుమార్ కు మళ్లీ ఎన్నికల గుర్తునే కేటాయించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం రాత్రి శివకుమార్ కు రోడ్ రోలర్ గుర్తునే కేటాయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా, లేని అధికారాలను వినియోగించిన మునుగోడు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని విధుల నుంచి తొలగించింది. కా
గా తెలంగాణలో ఇలా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన కారణంగా అధికారిని విధుల నుంచి తొలగించడం ఇదే మొదటి సారి కాదు. గతంలో అంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో అధికార తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై అప్పటి సూర్యాపేట ఎస్పీ వెంకటేశ్వర్లును ఈసీ ఆ ఉప ఎన్నికల విధుల నుంచి తొలగించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cec-axe-on-munugodu-returning-officr-for-changing-election-of-a-cndidate-25-145805.html
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.