ఐటీ నుంచి ఏఐ వరకు.. నారా లోకేష్ ట్రాన్స్‌ఫార్మేషన్!

Publish Date:Jun 23, 2026

Advertisement

పనితీరుని చూడలేని కబోది నాయకుల విమర్శల నుండి ఎదిగిన పరిణితి   నారా లోకేష్.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా లోకేష్ ప్రస్థానం ఒక అద్భుతం. ఒకప్పుడు   చంద్రబాబు నాయుడు కుమారుడిగా, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతగా మాత్రమే గుర్తింపు ఉన్న యువకుడు నారా లోకేష్.  అదే నారా లోకేష్ ఇప్పుడు   ప్రజా క్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు.  ప్రజా సమస్యల పరిష్కారం నుంచి  రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, విద్యా పరంగా దేశంలోనే నంబర్ వన్ గా నిలిపే విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు, అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకుర దీటుగా ఇస్తున్న కౌంటర్లు.. ఆయనలోని పరిణితికి అద్దం పడుతున్నాయి.

అదే సమయంలో జాతీయ మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలో ఆయన ప్రదర్శిస్తున్న పరిణితి అందరినీ విస్మయ పరుస్తోంది.  జాతీయ మీడియా అడిగిన ప్రశ్నలకు ఇసుమంతైనా తడబాటు లేకుండా స్పాంటేనియస్ గా ఇస్తున్న సమాధానాలు, గణాంకాలతో సహితంగా ఆయన చెబుతున్న వివరాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఐటీ నుంచి  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  వరకు ఆంధ్రప్రదేశ్‌ను ఎలా నడిపించబోతున్నారో ఇటీవల ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ వివరిం వివరించిన తీరు ఆయన పొలిటికల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ను కళ్ళకు కట్టింది.  లోకేష్ విజన్‌కు దిగ్గజ నేతలు సైతం ఫిదా అవుతున్నారు.  

అయితే నారా లోకేష్ లోని  మార్పు ఒక్క రోజులో వచ్చింది కాదు. 2019 మంగళగిరి ఎన్నికల ఓటమి లోకేష్‌ను   రాటుదేల్చింది. కేవలం 5,337 ఓట్ల  తేడాతో ఓడిపోయిన ఆయన..కుంగిపోలేదు..  వెనకడుగు వేయలేదు. అదే మంగళగిరిని తన స్థావరంగా మార్చుకుని ప్రజా సమస్యలపై పోరాడారు. ఆ తర్వాత ఆయన చేపట్టిన 400 రోజుల  యువగళం పాదయాత్ర లోకేష్ రాజకీయ భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు సుమారు నాలుగువేల కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో ఆయన ప్రజలతో మమేకమయ్యారు. ఫలితంగా 2024 ఎన్నికల్లో మంగళగిరిలో  91,413 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి..  గత 39 ఏళ్లుగా అక్కడ గెలుపు అన్నదే ఎరుగని తెలుగుదేశం పార్టీకి అద్భుత విజయాన్ని అందించారు. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి , రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రిగా లోకేష్ సరికొత్త పాలనా విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. కేవలం  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' మాత్రమే కాకుండా..  'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను తమ ప్రభుత్వ పాలసీగా మార్చేశారు. ఇందుకు ఉదాహరణగా పుట్టపర్తిలో ఏఎంసీఏ   ప్రాజెక్ట్ కోసం కేవలం 37 రోజుల్లోనే భూసేకరణ పూర్తి చేయడాన్ని చెప్పుకోవచ్చు. గూగుల్ వంటి దిగ్గజ సంస్థల ప్రాజెక్టులను వేగంగా ఆకర్షిస్తూ, రాష్ట్రంలోకి పెట్టుబడుల వరద పారించేలా ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నారు. 

రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటికే ఏకంగా 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలను సాధించామని, వాటిని త్వరితగతిన కార్యరూపంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని లోకేష్ గణంకాలతో సహా  జాతీయ మీడియా ముందు ఆవిష్కరించిన తీరు ఆయనకు  ప్రత్యర్థుల నుంచి సైతం ప్రశంసలు దక్కేలా చేసింది.  2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే భారీ లక్ష్యాన్ని  నిర్దేశించుకున్నట్లు చెప్పిన నారా లోకేష్..  గతంలో హైదరాబాద్ ఐటీ రంగాన్ని ఎలా నిర్మించామో, అంతకంటే మెరుగైన ఫలితాలను విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్‌లో కేవలం 10 ఏళ్లలోనే సాధించి చూపిస్తామని లోకేష్ ధీమాగా చెబుతున్నారు. డిజిటల్ టెక్నాలజీ, లైవ్ డేటా ఫీడ్స్, రియల్ టైమ్ డ్యాష్‌బోర్డుల ద్వారా రికార్డు స్థాయిలో 52 లక్షల  మందిని తెలుగుదేశం సభ్యులుగా చేర్పించిన లోకేష్  ఇప్పుడు అదే సాంకేతికతను ఏపీ అభివృద్ధికి సమర్థంగా వాడుతున్నారు. నారా లోకేష్ ఈ పొలిటికల్ ట్రాన్స్‌ఫార్మేషనే ఆయనను ప్రజా నాయకుడిగా అందరూ గుర్తించేలా చేస్తోంది. 

By
en-us Political News

  
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా.. కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్ పంపించారన్నారు.
కూటమి ప్రభుత్వంలో పరిపాలనా లోపాలు, రాజకీయ సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా లభించిన 80 శాతం ప్రజా సంతృప్తి కేవలం కాగితాలకే పరిమితమైందనీ.. డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తమ సర్వేలో తేలిందని చెప్పారు.
ఎన్నికల బరిలో కేసీఆర్, బీఆర్ఎస్ కూటమిని ఢీకొట్టడం ఎవరికైనా పెద్ద సవాలే. గతంలో కేసీఆర్ వాడే ఘాటైన రాజకీయ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలపై ఆయనకు మాత్రమే పేటెంట్ హక్కు ఉందనే భావన ఉండేది. కానీ రేవంత్ రెడ్డి రాకతో.. ఆ ముద్రను పూర్తిగా చెరిపివేశారు. కేసీఆర్, కేటీఆర్ ల కంటే మరింత దూకుడుగా, ఘాటుగా రేవంత్ ప్రజల్లోకి వెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం పాలసీలు లేదా ప్రాజెక్టులను ఏ ఒక్కరి కోసమో కాకుండా దేశ ప్రజలందరి కోసమే ప్రవేశపెడుతుందని బదులిచ్చారు. అయితే.. ఆ ప్రాజెక్టులను అందుకోవడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా, సానుకూలంగా స్పందిస్తుందనే దానిపైనే వాటి రాక ఆధారపడి ఉంటుందని చెప్పారు.
ఈ చర్చోపచర్చలు, ఊహాగాన సభలపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా వేదికగా క్లారిటీ ఇచ్చారు. దేశానికి నరేంద్ర మోదీ రూపంలో ఒక బలమైన ప్రధానమంత్రి ఉన్నారన్న లోకేష్.. చంద్రబాబు ప్రధాని అన్న చర్చకు, వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
ఆయనకు పార్టీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదన్న చర్చ గత కొంత కాలంగా జనసేనలో అంతర్గతంగా సాగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా, మీడియా ముఖంగా చేస్తున్న విమర్శలను, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం వెనుకబడిందన్న భావన సర్వత్రా వ్యక్తమౌతోంది.
నగర ప్రజల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రో విస్తరణ, నిధుల విడుదలే లక్ష్యంగా వీరిద్దరూ కలిసి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీ చాలా సానుకూల వాతావరణంలో జరిగిందనీ, మెట్రో ప్రాజెక్టుకు ఎదురవుతున్న ఆర్థిక అవరోధాలను అధిగమించడానికి ఇదొక కీలక ముందడుగని సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం పేర్కొన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని సమర్ధంగా, ఎఫెక్టివ్ గా అమలు చేయగలుగుతున్నామని చెప్పారు. ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు దీనిని మరొక మెట్టు పైకి తీసుకువెళ్లి ముందుకు తీసుకెళ్లి ఈజ్ ఆఫ్ లివింగ్ అనే భావనను తీసుకొచ్చారనీ, ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలలో ఎప్పటినుంచో అనేక అంతరాలు, ఘర్షణలు ఉన్నాయనీ, సాంకేతికత ద్వారా ఆ అవరోధాలను తొలగించాలనేదే మా ఆలోచన అన్నారు.
ఎక్స్‌ప్రెస్ అడ్డా వేదికపైకి విప్లవాత్మక మార్పులకు, పాలనా విధానాలకు కేంద్ర బిందువులుగా నిలిచే అత్యున్నత ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తారు. గతంలో ఈ వేదికపై కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, నితిన్ గడ్కరీ, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ వంటి దిగ్గజాలు పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు ఆ లీగ్‌లో నారా లోకేష్ నిలవడం ఆయన స్థాయిని రుజువు చేస్తోంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
బిజెపి ఏపీలో తన బలాన్ని మరింత పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. అందులో భాగంగానే వైసిపికి చెందిన ముగ్గురు లోక్‌సభ సభ్యులతో బిజెపి అగ్రనాయకత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.