Publish Date:Oct 28, 2024
జగన్ పాలనలో పారదర్శకత అన్నది దేవతావస్త్రమే అన్నట్లుగా పరిస్థితి ఉండేది. జగన్ చెప్పే మాటల్లో, పాలనలో ఎక్కడా పారదర్శకత కనిపించేది కాదు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉత్తుత్తి ఆదేశాలు ఇచ్చేవారు. ఆ సంగతి తెలుసు కనుక అధికారులు జగన్ ఆదేశాలను ఇసుమంతైనా పట్టించుకునే వారు కాదు. ప్రభుత్వం జీవోలు విడుదల చేసేది కానీ అవి ఎవరికీ ఎక్కడా కనిపించేవి కావు. కోర్టులకు మాత్రం తమ ప్రభుత్వం అత్యంత పాదర్శ కంగా పాలన సాగిస్తోందని చెప్పుకునేది. కానీ ఆచరణలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించేది.
ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ఇదేళ్ల పాలనా ఇలాగే సాగింది. జగన్ హయాంలో ప్రభుత్వం ఎన్నో రహస్య జీవోలను ఇచ్చింది. ప్రతి జీవో పబ్లిక్ డొమైన్ లో ఉండాలని అన్ని శాఖలను ప్రభుత్వం ఆదేశించేది. జగన్ ఐదేళ్ల పాలనలో జీవోలన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉండాలన్న ఆదేశాలను కనీసం నాలుగు సార్లు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలు జగన్ అధికారంలో ఉన్నంత కాలం అమలు కాలేదు. అంటే జగన్ ఉత్తుత్తి ఆదేశాలు ఇచ్చారన్న మాట. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కీలక నిర్ణయం తీసుకుంది. ఇంత కాలం రహస్యంగా ఉంచిన జగన్ హయాంలోని జీవోలన్నిటినీ పబ్లిక్ డొమైన్ లో ఉంచాలని నిర్ణయించింది. ఆ రహస్య జీవోలన్నిటినీ జీఓఐఆర్ వెబ్సైట్లో అప్లోడ్ చేయించాలని నిర్ణయించింది. 2021 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 28 వరకూ రహస్యంగా ఉంచిన అన్ని జీవోలనూ ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు ఇంత కాలం గోప్యంగా ఉన్న జీవోలన్నిటినీ ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఉత్తర్వులు జారీ చేసింది. జీఓఐఆర్ వెబ్సైట్ ప్రారంభమైన 2008 నుంచి ఇప్పటివరకూ అన్ని జీఓలు అందుబాటులో ఉన్నప్పటికీ, వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 28 వరకు జారీ అయిన జీఓలు మాత్రమే అందుబాటులో లేవని సాధారణ పరిపాలన శాఖ వెల్లడించింది. ఇప్పుడు వాటన్నిటినీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbn-sarkar-decided-to-bring-all-secret-gos-in-jagan-tenure-into-public-domain-39-187557.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.