Publish Date:Sep 16, 2025
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. విభజిత ఆంధ్రప్రదేశ్ కు రెండో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 15 నెలలు అయ్యింది. గతంలో మూడు సార్లు సీఎంగా ఉన్న సమ యంలో ఎన్నడూ ఎదుర్కోని క్లిష్టపరిస్థితులు ఈ సారి ఆయనకు స్వాగతం పలికాయి. జగన్ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం, విధ్వంస పాలన కారణంగా గత ఏడాది చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టేనాటికి రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉండటమే కాకుండా పది లక్షల కోట్ల రూపాయల అప్పు నెత్తిన పడింది.
ఇదే విషయాన్ని చంద్రబాబు సోమవారం (సెప్టెంబర్ 15) కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ చెప్పారు. అటువంటి పరిస్థితుల నుంచి, ఆర్థిక సంక్షోభం నుంచీ రాష్ట్రాన్ని బయటకు తీసుకువచ్చి అభివృద్ధి దిశగా నడిపించేందుకు తాను చేపట్టిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలను ఆయన ఈ సదస్సులో వివరించారు. అదే సమయంలో నగదు బదలీ పథకాలు అంటే సంక్షేమ పథకాలకు ఎక్కడా ఎలాంటి లోటూ రాకుండా ముందుకు సాగుతున్నానని చెప్పారు.
దేశంలోనే అతిపెద్ద సంక్షేమ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నాన్నా. అదే పెన్షన్ల పథకం అని చెప్పిన ఆయన ఈ పథకం ద్వారా 64 లక్షల మందికి ప్రతి నెలా మొదటి తేదీన క్రమం తప్పకుండా పెన్షన్లు అందిస్తున్నట్లు వివరించారు. అలాగే తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రంలో విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థికీ ఆర్థిక సహాయం అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెప్పారు.
మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, దీపం 2 పథకాల గురించి వివరించారు. అన్నదాతా సుఖీభవ, ఆటో డ్రైవర్లకు రూ.15వేలు పథకాల గురించి కూడా చెప్పారు. గత ఏడాది ఎన్నికలకు ముందు చెప్పాము.. ఇప్పుడు చేసి చూపిస్తున్నాము అన్న చంద్రబాబు.. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎలాంటి ఆటంకాలూ లేకుండా కొనసాగాలని, అందులో కలెక్టర్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbn-fullfill-promises-made-39-206258.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.