నామినేటెడ్ పదవులు... చాణక్య చంద్రబాబు!

Publish Date:Sep 25, 2024

Advertisement

నామినేటెడ్ పదవుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలో భాగస్వాములుగా ఉన్న కూటమి పార్టీలలో అసంతృప్తి వ్యక్తం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే సమయంలో కూటమి పార్టీలలో తెలుగుదేశం వ్యతిరేకులను దూరం పెట్టడంలోనూ జాగ్రత్త వహిస్తున్నారు. ఇన్ని పరిమితుల మధ్య సొంత పార్టీ నేతలకు పదవుల విషయంలో అక్కడక్కడా తలెత్తుతున్న అసంతృప్తిని గమనించడం లేదా అన్న అభిప్రాయం తెలుగుదేశం వర్గీయులలోనే వ్యక్తం అవుతోంది. 

ఆ సంగతి కొద్ది సేపు పక్కన పెడితే కూటమి పార్టీలలో అసంతృప్తి వ్యక్తం కాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూనే.. ఆయా పార్టీలలో మరీ ముఖ్యంగా బీజేపీలో వైసీపీకి అనుకూల నేతలను పూర్తిగా పక్కన పెట్టేయడంలో చంద్రబాబు విజయం సాధించారనే చెప్పవచ్చు. తొలుత నామినేటెడ్ పదవులకు రంగం సిద్ధం అయ్యిందన్న వార్తలు రాగానే బీజేపీ తరఫున ఆ పదవులకు బీజేపీ కేంద్ర నాయకత్వం సిఫారసు చేసిన నేతలలో తెలుగుదేశం నేతలు, శ్రేణులకు సుతరామూ ఇష్టం లేని కొన్ని పేర్లు ఉన్నాయి. జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి వంటి వారికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలంటూ బీజేపీ సిఫారసు చేయడం తెలుగుదేశం, జనసేన శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అయితే చంద్రబాబు మాత్రం ఆచితూచి వ్యవహరించారు. వారి పేర్లను స్వయంగా బీజేపీ హై కమాండే ఉపసంహరించుకునేలా వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఇందు కోసం నామినేటెడ్ పదవుల భర్తీలో జాప్యం జరిగినా పెద్దగా పట్టించుకోలేదు. చివరికి మంగళవారం (సెప్టెంబర్ 24) ఆయన ఓ 20 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. ఆ జాబితాలో బీజేపీలోని వైసీపీ అనుకూల నేతల పేర్లు లేవు. అయినా బీజేపీ నుంచి ఇసుమంతైనా అసంతృప్తి వ్యక్తం కాలేదు. ఇది కచ్చితంగా  కూటమి ధర్మాన్ని పాటిస్తూనే.. కూటమి పార్టీల్లోని తెలుగుదేశం వ్యతిరేకులను పక్కన పెట్టేయడం  చంద్రబాబు చాణుక్యమే. అంతే కాదు.. ఇప్పుడే కాదు, భవిష్యత్ లోనూ అటువంటి వారికి ఎటువంటి అవకాశాలూ ఉండవని స్పష్టం చేయడమే.  

మంగళవారం (సెప్టెంబర్ 24)  చంద్రబాబు ప్రకటించిన నామినేటెడ్ పోస్టులలో బీజేపీ నుంచి కేవలం లంకా దినకర్ కు మాత్రమే పదవి లభించింది. ఆయన  తెలుగుదేశం మాజీ నాయకుడే. ఇక  జనసేన నుంచి ముగ్గురికి పదవులు లభించాయి. ఇక తెలుగుదేశం కు 16 పదవులు లభించాయి. అన్ని సమీకరణాలనూ పరిగణనలోనికి తీసుకుని సమగ్ర కసరత్తు తరువాతే చంద్రబాబు నామినేటెడ్ పోస్టులకు నేతలను ఎంపిక చేశారని ఆ పదవులు దక్కిన వారి పేర్లను బట్టి అర్ధమౌతోంది. 

ఇక ఇప్పుడు తెలుగుదేశంలో అక్కడక్కడా అసంతృప్తి వ్యక్తం కావడం విషయానికి వస్తే.. ఐదేళ్ల పాటు విపక్షంలో  ఉండటంతో..  పలువురు తెలుగుదేశం నాయకులు జగన్ అరాచక పాలనలో అన్ని విధాలుగా వేధింపులకు, దాడులకు, దౌర్జన్యాలకూ గురై ఇబ్బందులు పడ్డారు. వారి జాబితా చాలా చాలా పెద్దదే. అటువంటి వారంతా తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది కనుక ఏదో ఒక పదవి ఆశించడం సహజమే. అయితే పొత్తు ధర్మాన్ని పాటిస్తూ, ఒకే విడతలో అందరినీ సంతృప్తి పరిచేలా పదవుల పందేరం అంత సులభ సాధ్యం కాదు. ఇప్పుడు తెలుగుదేశంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలకూ ఆ విషయం తెలుసు. అయినా వారిలో అసంతృప్తికి కారణం లేకపోలేదు.

ఎన్నికలలో తెలుగుదేశం అఖండ విజయంతో తమ పాత్రకు తగిన గుర్తింపు లభించలేదన్నదే ఆ అసంతృప్తికి కారణం. ఈ విషయాన్ని తెలుగుదేశం  జాతీయ అధికార ప్రతినిథి జీవీకే బాహాటంగానే వ్యక్తం చేస్తే, మరో జాతీయ అధికార ప్రతినిథి పఠాభి మాత్రం తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేశారు. గుర్తింపు లభించడం అంటే ఏంటన్న ప్రశ్నకు వారిచ్చిన సమాధానాల సారాంశం ఏంటంటే... పార్టీ నుంచి కమ్మూనికేషన్. పార్టీ విజయం సాధించిన తరువాత ఇంత వరకూ పార్టీ అధినేతను కలిసే అవకాశమే తమకు దక్కలేదన్నది వారిలో అసంతృప్తికి అసలైన కారణం. తాము పదవుల కోసం పార్టీలో లేమనీ, పార్టీ అధికారంలో ఉండాలన్న సంకల్పంతో జగన్ హయాంలో ఎన్నో ఇబ్బందులు, దాడులు, దౌర్జన్యాలను ఎదుర్కొని నిలబడ్డామని, అటువంటి తమకు పార్టీ అధినేత అప్పాయింట్ మెంట్ కూడా  దక్కకపోవడం ఒకింత అసంతృప్తి కలిగించిందనీ చెబుతున్నారు. ఈ విడత నామినేటెడ్ పదవులలో మీకు అవకాశం లేదు.. తరువాత చూద్దాం అన్న ఒక్క సందేశం పార్టీ అగ్రనాయకత్వం నుంచి తమకు అంది ఉంటే బాగుండేదనీ వారు అంటున్నారు. నిజమేకదా?!

By
en-us Political News

  
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.